నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ
మండల అధ్యక్షులు శ్రీ రామోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ
భీమదేవరపల్లి మండలంలో కేక్ కట్, పండ్ల పంపిణీ, సామాజిక సేవ కార్యక్రమాలు
ప్రజామంటలు, ముల్కనూర్:
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భాజపా భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు శ్రీ రామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మండల కేంద్రం ముల్కనూర్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం ముల్కనూర్ సుధాకర్ మెమోరియల్ హాస్పిటల్లో డాక్టర్ సుధాకర్ సమక్షంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కూడా పండ్లు అందించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, బండి సంజయ్ గారు నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడని, ఆయన సేవలే మనందరికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం MEO ద్వారా పంపిన జాబితా ప్రకారం ఈ నెలలోపే సంబంధిత పాఠశాలల్లోనే సైకిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మోడీ కిట్లు త్వరలోనే అందించనున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృధ్వీరాజ్, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, దుర్గాసింగ్, జిల్లా నాయకులు ఊస కోయిల కిషన్, దొంగల వేణు, పోడేటి బిక్షపతి, మండల నాయకులు ములుగు సంపత్, దొంగల రాణాప్రతాప్, బండారి కరుణాకర్, రఘు నాయకుల ప్రదీప్ రెడ్డి, కంకల సదానందం, బొజ్జపురి పృథ్వీరాజ్, లక్కిరెడ్డి మల్లారెడ్డి, మహిళా నాయకురాలు అంబీర్ కవిత, చరిష్మా, అలుగు భాస్కర్, కాలేరు వికాస్, ముండేడ్ల విజయ్, గుములాపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
