ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

On
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 08 (ప్రజా మంటలు). 

ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.

విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి. 

  • జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
  • జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
  • మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,

అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.

రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు: 

  1. మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
  2. విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
  3. ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
  4. వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
  5. వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  6. వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  7. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
  8. ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
  9. ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
  10. వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
  11. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
  12. మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
  13. రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.

పై సూచనలతో అందరూ  వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.

 

Tags
Join WhatsApp

More News...

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్ సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9: బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది. సమాచారం ప్రకారం, ఈ...
Read More...

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన “100...
Read More...
National  International  

ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్‌బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్

ఇండో–పాక్ యుద్ధ విరమణలో ట్రంప్ పాత్రకు మరోసారి షెహ్‌బాజ్ షరీఫ్ కృతజ్ఞత ఎన్ బాకు (అజర్‌బైజాన్), నవంబర్ 9: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలకు ముగింపు పలికిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాహసోపేత నాయకత్వం సాధ్యంచేసిందని ఆయన పేర్కొన్నారు. అజర్‌బైజాన్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్ కార్యక్రమంలో...
Read More...
National  International  

రష్యాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం :: నలుగురు మృతి

రష్యాలో సైనిక హెలికాప్టర్ ప్రమాదం :: నలుగురు మృతి మాస్కో, నవంబర్ 9:రష్యాలో మరోసారి భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యన్ ఆర్మీకి చెందిన Ka-226 హెలికాప్టర్ కళ్ళ ముందే కుప్పకూలి భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ హెలికాప్టర్‌లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీకి చెందిన డిప్యూటీ...
Read More...

చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు

చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు - హరీష్‌రావు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌,  హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బహుళ పార్టీలు తుది సమరానికి సిద్ధమవుతుండగా, భారత రాష్ట్ర సమితి (BRS) భారీ ప్రణాళికలు వేసింది.ప్రచార ముగింపు దశలో నియోజకవర్గంలో  ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు, మీటింగులు ఏర్పాటు చేస్తూ పార్టీ ఉత్సాహాన్ని...
Read More...

బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?

బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?   హైదరాబాద్‌  నవంబర్ 09 (ప్రజా మంటలు): –దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎటేకుదుతున్నాయి. ఉదాహరణకు: 24 కరట్ బంగారం 10 గ్రாம்‌కు సుమారు ₹1,20,100 స్థాయిలో నమోదవుతోంది. – 22 కరట్ బంగారం 10 గ్రామ్‌కు సుమారు ₹1,10,010 స్థాయిలో ఉంది.   గతంలో గరిష్ఠంగా ఉన్న స్థాయి (ఉదాహరణకు అక్టోబరులో ~₹1,31,000+ 10 గ్రామ్‌కు) నుండికాస్తకాని...
Read More...

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, కుమారుడు హైదరాబాద్‌ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న విషయం — మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పై నెలకొన్న అనుమానాలు. ఆయన కుటుంబ...
Read More...

హిమాచల్‌ బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌పై పాక్సో (POCSO) కేసు

హిమాచల్‌ బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌పై పాక్సో (POCSO) కేసు చండీగఢ్ నవంబర్ 09 (ప్రజా మంటలు) హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చంబా జిల్లా చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌ (Hans Raj) పై మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఇటీవల నెల రోజుల వ్యవధిలో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ బీజేపీకి చెందిన మూడవ...
Read More...

పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం

పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు): ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్‌ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ...
Read More...
National  Filmi News  State News 

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి రాజమౌళి కథ — ఊహలకు అతీతం హైదరాబాద్‌ నవంబర్ 08: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” అనే పాత్రలో వీల్‌చెయిర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి. ప్రపంచ ప్రఖ్యాత...
Read More...

షేప్ ఆఫ్ మొమో” నేపాలీ చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో

షేప్ ఆఫ్ మొమో” నేపాలీ  చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో త్రిబేని రాయ్ – ఒక కొత్త స్వరం గ్యాంగ్టాక్ నవంబర్ 08: సిక్కిం రాష్ట్రానికి చెందిన యువ దర్శకురాలు త్రిబేని రాయ్ తీసిన తొలి నెపాలి చిత్రం “షేప్ ఆఫ్ మొమో” ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రం మూడు ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో పోటీలో నిలవడం సిక్కిం సినీమా ప్రపంచానికి...
Read More...

జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు!

జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు! న్యూయార్క్, నవంబర్ 8:అమెరికాలోని Democratic Socialists of America (DSA) న్యూయార్క్ శాఖ, త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించబోయే మేయర్-ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లు లీకైన పత్రాలు వెల్లడించాయి. Just The News బయటపెట్టిన సమాచారం ప్రకారం, DSA యొక్క “ఆంటీ-వార్ వర్కింగ్ గ్రూప్” జోహ్రాన్ మమ్దానీకి అమలు...
Read More...