మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

On
మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

వైఎంసీఏ లో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాన్ని 
  సికింద్రాబాద్ వైఎంసీఏ లో మంత్రి అడ్లూరి తో కలసి ప్రారంబోత్సవాలు

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) :

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, అలాగే మైనార్టీలు కూడ ఎప్పుడూ  పార్టీ వెంట నడుస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో వైఎంసీఏ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటేడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆండ్ మల్టీ పర్పస్ ప్రొగ్రామ్ సెంటర్ శంకుస్థాపన, నూతన ఆడిటోరియం లను మరో మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..క్రిస్టియన్ మైనార్టీలకు అందాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు, ఆ వర్గాలకు అందాల్సిన పదవుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని  కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.

అలాగే బడ్జెట్ లో నిధుల కేటాయింపులో కూడా సముచిత స్థానం కల్పించనున్నామని తెలిపారు. వైఎంసీఏ తో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని, చిన్నప్పుడు నారాయణగూడ గ్రౌండ్ లో క్రికెట్ , టేబుల్ టెన్నిస్ ఆడేవాడినని అన్నారు. విద్యార్థి దశలో క్రికెట్ టోర్నమెంట్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ వైఎంసీఏ లో బస చేశామని గుర్తు చేశారు. అందరూ ఐకమత్యంతో ఉండి వైఎంసీఏ ను మరింత అభివృద్దిలో తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఆడిటోరియం, గెస్ట్ హౌజ్ లను నిర్మించిన వైఎంసీఏ నిర్వాహకులను మంత్రి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని, గత ప్రభుత్వం క్రైస్తవ మైనార్టీ వర్గాల ప్రజలను పట్టించుకోలేదని, ఇటీవల జరిగిన సమీక్షలో తెలిసిందన్నారు.

కానీ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రైస్తవ మైనార్టీలకు సంబందించిన స్మశాన వాటికలు, వారికి కేటాయించిన భూముల విషయంలో అమలు కాకుండా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని కలెక్టర్ కు ఆదేశించినట్లుచెప్పారు. అలాగే ఈ స్థలాలు కబ్జా కాకుండా కాపాడేలాపెన్సింగ్ తో పాటు సౌకర్యాలను కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. వైఎంసీఏ ప్రపంచంలోనే సేవలు అందిస్తున్న అత్యుత్తమైన సంస్థ అని దీన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న అద్యక్షులు జయకర్ డేనియల్కు అభినందించారు. మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి మాట్లాడుతూ...వైఎంసీఏ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్యామిలికి ఎంతో గొప్ప పేరుందని, వారి కుటుంబం అనేక సామాజిక సేవ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.  ఈసందర్బంగా వైఎంసీఏ  ఆశ్రయ్ కు ఛైర్మన్ గా వ్యవహరించి సేవలు అందించిన మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డిని అవార్డు జ్ఞాపికతో మంత్రులు  సత్కరించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  దీపక్ జాన్ , వైఎంసీఏ అద్యక్షులు జయకర్ డేనియల్ తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు,మంత్రి అడ్లూరి సతీమణిఅడ్లూరి శాంతికుమారి, కార్పొరేటర్ కొంతం దీపిక, సుప్రీం కోర్టు న్యాయవాది జోయ్స్ , సుప్రీం కోర్టు జడ్జి సూరపనేని నంద, బిషప్ సింగం,మోజాస్,లెనార్డ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు బెర్హంపూర్ (ఒడిశా) సెప్టెంబర్ 13: ఒడిశాలోని ఒక ఆశ్రమ  పాఠశాల హాస్టల్‌లో విద్యార్థుల కళ్ళు ఫెవిక్‌విక్‌తో ఎవరో అతికించిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత మరియు పర్యవేక్షణ గురించి ఆందోళనలను రేకెత్తించింది. బాధిత విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు మరియు వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు.బాధిత విద్యార్థులను...
Read More...
Local News 

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం వరంగల్ సెప్టెంబర్ 13: తెలంగాూ రాష్ట్ర ప్రభుతరు ఉద్యోగుల సంఘం, వరంగల్ సిటి యూనిట్ తైవార్షిక 2005 -2028 సంవత్సరానికి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది  ఈ క్రింది కార్యవర్గం ఎక్కవంగా ఎన్నికైంది. మహమ్మద్ నిఖాముద్దీని అధ్యక్షులు, ఎం.ఏ. జలీల్ అసోసియెట్ అధ్యక్షులు, ముబషీర్ అహ్మద్ మహమూది. కోశాధికారి పెద్ది స్వరాజ్యబాబు, ఉపాధ్య ఉటీస్, కార్యదర్శి, ఎం....
Read More...
National  State News  International  

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత కాలమానం ప్రకారంANI పోడ్కాస్ట్  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 13: నేపాల్ స్థానిక సమస్యలలో చైనా రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుంటున్నారు" అని లోబ్సాంగ్ సంగే పేర్కొన్నారు. టిబెట్ మాజీ ప్రధాని ANI ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో జరిపిన పాడ్కాస్ట్ లో చైనా దుర్ణితిపై, దురాలోచనలపై అనేక...
Read More...
Local News 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ప్రతినిధులు  కొత్తగా నియమితులైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎన్.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆస్పత్రి సేవలను మరింత బలోపేతం చేసి, రోగుల వైద్యం మెరుగుపరచడంలో పూర్తి సహకారం అందిస్తామని జూడా హామీ ఇచ్చింది. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలిసి...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం  జగిత్యాల సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం శుక్రవారం  14వ రోజుకు చేరింది. వామన పురాణంలోని ప్రహ్లాదునితో వామనుని యుద్ధం ,సతిదేవి జన్మ వృత్తాంతం  దక్షయజ్ఞం, ఘట్టాలు ఆచార్యులు కండ్లకు కట్టినట్టుగా వివరించారు. వామన పురాణం...
Read More...
Local News 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు  సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు): స్కై ఫౌండేషన్ సంస్థ స్థాపించి పదమూడు సంవత్సరాలు దాటినా శుభ సందర్భంగా శుక్రవారం  అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు.  చిన్నారులతో కేక్ కట్ చేయించి, రకరకాల తినుబండారాలు,నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు, ఇతర స్టేషనరీ వస్తువులు, బహుమతులు అందించారు, అలానే రోడ్ల పక్కన జీవనం సాగించే సంచారజాతుల వారితో కేక్...
Read More...
Local News 

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి వైఎంసీఏ లో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాన్ని     సికింద్రాబాద్ వైఎంసీఏ లో మంత్రి అడ్లూరి తో కలసి ప్రారంబోత్సవాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) : మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, అలాగే మైనార్టీలు కూడ ఎప్పుడూ  పార్టీ వెంట నడుస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో...
Read More...
Local News 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఈరోజు, మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో  రాజేశం గౌడ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు...
Read More...
Local News 

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)మండలంలోని చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్...
Read More...
Local News  State News 

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత హెచ్ఎంఎస్ లో సభ్వత్యాలు పెంచాలి.  ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ పెట్టుకుందాం హెచ్ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయి. హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు .జగిత్యాల సెప్టెంబర్ 12 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ తోటి మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.  విధి నిర్వహణ లో కలిసి పని చేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ లో చేయడం, కాల్స్ చేసి వేధించిన ఎమ్మార్వో...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నేతలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 ( ప్రజామంటలు ): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ గా అడిషనల్ డీఎంఈ ప్రొఫెసర్ డాక్టర్ వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.వాణిని ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...
Read More...