అసలైన ఓటు  చోర్  కాంగ్రెస్ పార్టీయే -బీజేపీ నాయకురాలు ఏం. రాజేశ్వరి

On
అసలైన ఓటు  చోర్  కాంగ్రెస్ పార్టీయే -బీజేపీ నాయకురాలు ఏం. రాజేశ్వరి

అబద్ధాలు ఆడడంలో కాంగ్రెస్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

సికింద్రాబాద్, ఆగస్ట్ 22 (ప్రజామంటలు ):

ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకొస్తాయని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి  విమర్శించారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని ప్రజాస్వామ్యం,రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు.

 హిందీ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం వలన ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయని దుష్ప్రచారం చేసి, ఇప్పుడు కొత్తగా మీ ఓటు ప్రమాదంలో పడిందని, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కలిసి మీ ఓటును దొంగిలిస్తున్నాయని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు.  

ప్రమాదంలో పడింది 65సంవత్సరాలు దేశాన్ని పాలించిన నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడబోతుందని తెలుసుకొని దేశప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతిన్నారని పేర్కొన్నారు.

స్వాతంత్రానంతరం నెహ్రూ కాలం నుండి అసలైన ఓటు చోరీ కి పాల్పడింది నెహ్రూ కుటుంబ సభ్యులేనని విమర్శించారు.1947 సంవత్సరంలో మొదటి సారిగా ప్రధానమంత్రి ఎన్నికకు రాజ్యాంగ పరిషత్ లోని 15 ఓట్లకుగాను 12ఓట్లు సాధించిన సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి కాకుండా ఒక్క ఓటు వచ్చిన నెహ్రూ ప్రధాన మంత్రి అయి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు.

తర్వాత అడ్డదారిలో గెలిచిన ఇందిరాగాంధీ నియామకం చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే తీర్పును కాలరాసి అత్యవసర పరిస్థితి ప్రకటించి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు.1968లో సోనియా వివాహం జరిగితే 16 సంవత్సరాల వరకు భారత పౌరసత్వం తీసుకోలేదని కాని 1983లో జరిగిన ఎన్నికల్లో సోనియా ఓటు వేసి ఓటు చోరికి పాల్పడిందని పీవీ నరసింహ రావు ప్రధాన మంత్రి అయ్యాక జరిగిన బల ప్రదర్శనలో పార్లమెంటు సాక్షిగా ఎంపీలను కొనుగోలు చేసి డబ్బుల సూటుకేసులు మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఓటు చోరికి పాల్పడిందని అన్నారు.

రాహుల్ గాంధీకి బ్రిటన్ లో పౌరసత్వం కొనసాగిస్తూ  భారత్ లో ఓటు చోరీ చేసుకుంటూ ఎంపీ అవుతున్నారని దుయ్యబట్టారు.2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 100నియోజకవర్గాల్లో ఓటు చోరీ జరిగింది అని చేస్తున్న ప్రచారం అది నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 99 నియోజకవర్గాలతో పాటు   హైద్రాబాద్ నుండి గెలిచిన అసదుద్దీన్ నియోజవర్గాల్లో ఓటు చోరీ జరిగినట్లు రాహుల్ గాంధీ ఒప్పుకోవాలని అన్నారు. బిజెపి ఓటు చోరికి పాల్పడేది అయితే వాజపేయి  ఒక్క ఓటు తేడాతో ప్రధాన మంత్రి పీఠాన్ని వదులుకునే వారు కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని ధర్మ సత్రంగా మార్చి పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి వచ్చిన రోహింగ్యాలకు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ నిజంగా గాంధేయవాదానికి కట్టుబడి ఉంటే భారత ఎన్నికల సంఘం చేపట్టిన బోగస్ ఓటర్ల ఏరివేతకు సహకరించాలని స్వచ్ఛ భారత్ లో భాగంగానే బోగస్ ఓటర్ల తొలగింపు కార్యక్రమం ఎన్నికల సంఘం చేపట్టిందని మల్లేశ్వరపు రాజేశ్వరీ  అన్నారు.

Tags

More News...

Local News  State News 

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు    మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూయడం బాధాకరమైన విషయమని ,ఆయన మృతి దేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రజా ఉద్యమాలలో కూడా తీరని లోటు కలిగించిందను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి. రాజేశం గౌడ్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు....
Read More...
Local News 

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు    సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు): మాజీమంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి  జన్మదిన వేడుకలు  ఆదివారం ఘనంగా జరిగాయి. బేగంపేట లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు రాష్ర్ట బీజేపీ అద్యక్షులు ఎన్,రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హజరయ్యారు. ఈసందర్బంగా భారీ కేకు కట్ చేశారు....
Read More...
Local News 

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌ సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) : హైదరాబాద్, సికింద్రాబాద్‌ల సిక్కు సమాజం ఆదివారం సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్‌లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. కార్యక్రమం ఆసా ది వార్ తో  ప్రారంభమై, ప్రసిద్ధ రాగి జథా భాయ్ జగ్ప్రీత్ సింగ్ జీ ఖన్నా వాలే  ఆధ్యాత్మిక కీర్తనలో...
Read More...
Local News 

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

ఎవరి కోసం అధికారంలో ఉన్నారా..? ప్రతి పక్షంలో ఉన్నారా? సికింద్రాబాద్  ఆగస్టు 24 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చేస్తున్న యాత్ర కేవలం నటన కోసం మాత్రమే అన్నట్లుగా ఉందని,  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా లేదా ప్రతిపక్షంలో ఉన్నదా అని తెలంగాణ...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం సికింద్రాబాద్, ఆగస్టు 24 (ప్రజామంటలు ):  హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద ఆకలితో అలమటిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు తమ 283వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుట్ పాత్ పై ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు.  ప్రతి ఆదివారం తమ కోసం రకరకాల...
Read More...
Local News 

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు):   పద్మారావు నగర్ అభినవ్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్  అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త ఎన్.చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవంగా అసోసియేషన్ నూతన అద్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా నర్సింహారెడ్డి ఎన్నికయినట్లు సభ్యులు తెలిపారు. నూతన అద్యక్షుడిగా ఎంపికైన
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్ కడసారి వీడ్కోలు పలికిన నేతలు , కార్యకర్తలు సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) :  సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ  సురవరం సుధాకర్‌రెడ్డి పార్ధివ దేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కళాశాలకు డొనేట్ చేశారు. ఆదివారం సాయంత్రం మఖ్దూంభవన్‌నుంచి గాంధీ మెడికల్‌కాలేజీ వరకు  సురవరం  భౌతికకాయాన్ని కార్యకర్తలు వెంట రాగా...
Read More...
Local News 

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం? ఇబ్రహీంపట్నం ఆగస్టు 24( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఆదివారం మాంసం వ్యాపారులు చనిపోయిన మేక మాంసాన్ని విక్రయించినట్లు జరిగిన ప్రచారం, గ్రామంలో ఆందోళనకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ముగ్గురు మటన్ వ్యాపారులు మాంసాన్ని విక్రయిస్తుండగా మాంసం నుండి దుర్వాసన రావడంతో...
Read More...
Local News 

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ ఆగస్ట్ 24(ప్రజా మంటలు)   ఆదివారం (భానువాసరే ) భాద్రపద మాసం  శుక్ల  పక్షం, పాడ్యమి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ.సూర్య భగవానుని విశిష్టత :ఆదివారం – సూర్య భగవానుని ప్రత్యేక దినంఆదివారం హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుని (సూర్యుని)కి అంకితమైన పవిత్రమైన రోజు.  సూర్యదేవుని...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు    జగిత్యాల ఆగస్టు 24 (ప్రజామంటలు) పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన విద్యార్థులు 64 వ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.   ఈ నెల 22-08-2025న జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన  జగిత్యాల జిల్లా ఫుట్‌బాల్  సెలెక్షన్లలో ప్రతిభ ఈ...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం (అంకం భూమయ్య): గొల్లపల్లి ఆగస్టు 24  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని గంగదేవిపల్లి గ్రామానికి చెందిన బోయపోతూ నర్సయ్య  ఇటీవల అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున గంగదేవిపల్లి, రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకులు, ప్రజలు దయా...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు జగిత్యాల ఆగస్టు 24 (ప్రజా మంటలు)జిల్లా  కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో గత పది రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతుల  ముగింపు  ఉత్సవం, ఎంతో ఘనంగా జరిగింది. గాయత్రి పరివార్ నిర్వాహకులు శ్రీ వేముల రాంరెడ్డి  భగవద్గీత శ్లోకాలను వాటి తాత్పర్యాలను హృదయాలకు హత్తుకునేలా చెబుతున్న...
Read More...