కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుని గుర్తింపు?

On
కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుని గుర్తింపు?

హైదరాబాద్ ఆగస్టు 22 (ప్రజా మంటలు):

కూకట్ పల్లి లోని సంగీత నగర్ లో  ఇటీవల పదేళ్ల పాప దారుణ హత్య వెనుక మిస్టరీని పోలీసులు విడదీశారు.

ఆదేప్పఆన్దోతమలో ఉండే ఓ తరగతి విద్యార్థి, ఈ బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తుంది.  సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలుడు, బాలిక ఒకతె ఉండటంతో హత్య చేసినట్టు, బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు ఐదేళ్లుగా కూకట్ పల్లి లోని సంగీత నగర్ లో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్డులో పనిచేస్తుండగా, రేణుక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. వీరికి కుమార్తె సహస్ర(10), కుమారుడు(7) ఉన్నారు. సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు కాలనీలోని బడికి వెళ్తున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా, వారి కుమారుడు పాఠశాలకు వెళ్లాడు.

క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.

స్కూల్ నుంచి ఫోన్ రావడంతో,తానే స్కూల్కు వెళ్లి తమ్ముడికి టిఫిన్ బాక్స్ ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేయిపెట్టి, పనికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 'లంచ్ బాక్సు తీసుకురాలేదేమంటూ' స్కూల్ సిబ్బంది కృష్ణకు ఫోన్ చేశారు.  ఆయన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో,ఇరుగుపొరుగు వారు చేరి, పోలీసులకు సమాచారమిచ్చారు.

బాలిక ఒంటి మీద 20 కత్తి గాట్లు..బాలిక శరీరంపై 20వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం..హత్య సోమవారం ఉదయం 9.30-10.30 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తుంది.

ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారమిచ్చారు.  జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించిన పోలీసులు, ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించి, ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags

More News...

Local News  State News 

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు    మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూయడం బాధాకరమైన విషయమని ,ఆయన మృతి దేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రజా ఉద్యమాలలో కూడా తీరని లోటు కలిగించిందను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి. రాజేశం గౌడ్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు....
Read More...
Local News 

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు    సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు): మాజీమంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి  జన్మదిన వేడుకలు  ఆదివారం ఘనంగా జరిగాయి. బేగంపేట లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు రాష్ర్ట బీజేపీ అద్యక్షులు ఎన్,రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హజరయ్యారు. ఈసందర్బంగా భారీ కేకు కట్ చేశారు....
Read More...
Local News 

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌ సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) : హైదరాబాద్, సికింద్రాబాద్‌ల సిక్కు సమాజం ఆదివారం సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్‌లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. కార్యక్రమం ఆసా ది వార్ తో  ప్రారంభమై, ప్రసిద్ధ రాగి జథా భాయ్ జగ్ప్రీత్ సింగ్ జీ ఖన్నా వాలే  ఆధ్యాత్మిక కీర్తనలో...
Read More...
Local News 

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

ఎవరి కోసం అధికారంలో ఉన్నారా..? ప్రతి పక్షంలో ఉన్నారా? సికింద్రాబాద్  ఆగస్టు 24 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చేస్తున్న యాత్ర కేవలం నటన కోసం మాత్రమే అన్నట్లుగా ఉందని,  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా లేదా ప్రతిపక్షంలో ఉన్నదా అని తెలంగాణ...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం సికింద్రాబాద్, ఆగస్టు 24 (ప్రజామంటలు ):  హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద ఆకలితో అలమటిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు తమ 283వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుట్ పాత్ పై ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు.  ప్రతి ఆదివారం తమ కోసం రకరకాల...
Read More...
Local News 

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు):   పద్మారావు నగర్ అభినవ్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్  అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త ఎన్.చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవంగా అసోసియేషన్ నూతన అద్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా నర్సింహారెడ్డి ఎన్నికయినట్లు సభ్యులు తెలిపారు. నూతన అద్యక్షుడిగా ఎంపికైన
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్ కడసారి వీడ్కోలు పలికిన నేతలు , కార్యకర్తలు సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) :  సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ  సురవరం సుధాకర్‌రెడ్డి పార్ధివ దేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కళాశాలకు డొనేట్ చేశారు. ఆదివారం సాయంత్రం మఖ్దూంభవన్‌నుంచి గాంధీ మెడికల్‌కాలేజీ వరకు  సురవరం  భౌతికకాయాన్ని కార్యకర్తలు వెంట రాగా...
Read More...
Local News 

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం? ఇబ్రహీంపట్నం ఆగస్టు 24( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఆదివారం మాంసం వ్యాపారులు చనిపోయిన మేక మాంసాన్ని విక్రయించినట్లు జరిగిన ప్రచారం, గ్రామంలో ఆందోళనకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ముగ్గురు మటన్ వ్యాపారులు మాంసాన్ని విక్రయిస్తుండగా మాంసం నుండి దుర్వాసన రావడంతో...
Read More...
Local News 

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ ఆగస్ట్ 24(ప్రజా మంటలు)   ఆదివారం (భానువాసరే ) భాద్రపద మాసం  శుక్ల  పక్షం, పాడ్యమి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ.సూర్య భగవానుని విశిష్టత :ఆదివారం – సూర్య భగవానుని ప్రత్యేక దినంఆదివారం హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుని (సూర్యుని)కి అంకితమైన పవిత్రమైన రోజు.  సూర్యదేవుని...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు    జగిత్యాల ఆగస్టు 24 (ప్రజామంటలు) పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన విద్యార్థులు 64 వ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.   ఈ నెల 22-08-2025న జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన  జగిత్యాల జిల్లా ఫుట్‌బాల్  సెలెక్షన్లలో ప్రతిభ ఈ...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం (అంకం భూమయ్య): గొల్లపల్లి ఆగస్టు 24  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని గంగదేవిపల్లి గ్రామానికి చెందిన బోయపోతూ నర్సయ్య  ఇటీవల అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున గంగదేవిపల్లి, రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకులు, ప్రజలు దయా...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు జగిత్యాల ఆగస్టు 24 (ప్రజా మంటలు)జిల్లా  కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో గత పది రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతుల  ముగింపు  ఉత్సవం, ఎంతో ఘనంగా జరిగింది. గాయత్రి పరివార్ నిర్వాహకులు శ్రీ వేముల రాంరెడ్డి  భగవద్గీత శ్లోకాలను వాటి తాత్పర్యాలను హృదయాలకు హత్తుకునేలా చెబుతున్న...
Read More...