నేడే పోలాల అమావాస్య.. పశువులను పూజించడం ఆనవాయితీ
ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. శనివారం అమావాస్య సందర్భంగా పశువులను పూజించడం పూజలు నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది.
ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టతను, వ్రతం కథను తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ఆవులు ఎద్దులు , బర్రెలు దున్నలు వంటి పశువులు
వ్యవసాయ పనులలో
రైతులకు ముమ్మరంగా సహాయం చేసేవి . దాంతో పోలాలన్ని నాట్లు పూర్తయి శ్రావణ బహుళ అమావాస్య వరకు ఎటూ చూసినా పచ్చని పచ్చదనం పరుచుకుని పశువులకు కాస్త తెరిపి దొరికేది . పశువులు తమకు చేసిన మేలువల్ల రైతాంగం పశువులను నీళ్ళతో కడిగి కొమ్ములకు రంగులు వేసి గౌరవించి పూజించడం ఆనవాయితీ గా మారింది
సంతానం పొందిన మహిళలు తమ పిల్లల బాగుకోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
పురాణాల ప్రకారం
పోలాల అమావాస్య కథ
పూర్వం ఓ గ్రామంలో నివసించే బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమారులు. యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఏడుగురు కుమారులు ఆ గ్రామంలోనే వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు.
తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు.
దీంతో ఏడుగురు అన్నదమ్ములు శ్రావణమాసం లో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరించారు. చివరిగా అమావాస్య రోజు వచ్చే పోలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వ్రతం చేయలేకపోతారు. మరుసటి ఏడాది వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మళ్లీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడి మరో బిడ్డ మరణిస్తాడు. దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు.
ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం.. బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం.. ఇలా ఏడేళ్లు జరుగుతుంది. దీంతో మిగిలిన ఆరు మంది కోడళ్లు ఏడో కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నాము అంటూ తిట్టుకుంటారు. ఈ కారణంగా ఏడో కోడలు కుమిలిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోజు కూడా ఏడో కోడలి మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్లీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా.. మాములుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే.. ఏడో కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకూ అలాగే గడిచిపోతుంది.
అయితే.. రాత్రి బాగా చీకటి పడి గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి.. దుఖిస్తూ ఉంటుంది. ఆ సమచంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది.
దీంతో ఆమె గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షతలు ఇస్తుంది. ఈ అక్షతలను చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్లి.. ఆమె ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది.
ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెప్పగా అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని.. సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్ర వచను .
పూజా సమయంలో కంద మొక్కను పూజా గదిలో ఉంచి, దానిపై తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. మొదట వినాయకుడిని ఆరాధించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని లేదా సంతానలక్ష్మీ దేవిని ఆహ్వానించి, షోడశోపచార పద్ధతిలో పూజించాలి ఐదు రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తుంది.పూజ అనంతరం వ్రతకథను వినాలి శక్తి మేరకు ముత్తైదువులకు భోజన తాంబూలాలు ఇవ్వాలి
***. ****
.చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... “ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!”
సికింద్రాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గిఫ్ట్ “5000 రూపాయలు నిజంగా వచ్చాయి” అనే ఆశ చూపించే తప్పుడు సందేశాలతో పాటు లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల పొదుపును దోచుకుంటున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ వై. సంజీవ కుమార్ అన్నారు. డబ్బులు... మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు):
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు.
ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.... మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.... ధర్మపురిలో కాంగ్రెస్లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక
ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి... ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్... ‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్ను స్వీకరించని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు):
విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.
ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం... సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ... జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... 