నేడే పోలాల అమావాస్య.. పశువులను పూజించడం ఆనవాయితీ
ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. శనివారం అమావాస్య సందర్భంగా పశువులను పూజించడం పూజలు నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది.
ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టతను, వ్రతం కథను తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ఆవులు ఎద్దులు , బర్రెలు దున్నలు వంటి పశువులు
వ్యవసాయ పనులలో
రైతులకు ముమ్మరంగా సహాయం చేసేవి . దాంతో పోలాలన్ని నాట్లు పూర్తయి శ్రావణ బహుళ అమావాస్య వరకు ఎటూ చూసినా పచ్చని పచ్చదనం పరుచుకుని పశువులకు కాస్త తెరిపి దొరికేది . పశువులు తమకు చేసిన మేలువల్ల రైతాంగం పశువులను నీళ్ళతో కడిగి కొమ్ములకు రంగులు వేసి గౌరవించి పూజించడం ఆనవాయితీ గా మారింది
సంతానం పొందిన మహిళలు తమ పిల్లల బాగుకోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
పురాణాల ప్రకారం
పోలాల అమావాస్య కథ
పూర్వం ఓ గ్రామంలో నివసించే బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమారులు. యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఏడుగురు కుమారులు ఆ గ్రామంలోనే వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు.
తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు.
దీంతో ఏడుగురు అన్నదమ్ములు శ్రావణమాసం లో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరించారు. చివరిగా అమావాస్య రోజు వచ్చే పోలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వ్రతం చేయలేకపోతారు. మరుసటి ఏడాది వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మళ్లీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడి మరో బిడ్డ మరణిస్తాడు. దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు.
ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం.. బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం.. ఇలా ఏడేళ్లు జరుగుతుంది. దీంతో మిగిలిన ఆరు మంది కోడళ్లు ఏడో కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నాము అంటూ తిట్టుకుంటారు. ఈ కారణంగా ఏడో కోడలు కుమిలిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోజు కూడా ఏడో కోడలి మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్లీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా.. మాములుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే.. ఏడో కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకూ అలాగే గడిచిపోతుంది.
అయితే.. రాత్రి బాగా చీకటి పడి గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి.. దుఖిస్తూ ఉంటుంది. ఆ సమచంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది.
దీంతో ఆమె గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షతలు ఇస్తుంది. ఈ అక్షతలను చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్లి.. ఆమె ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది.
ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెప్పగా అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని.. సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్ర వచను .
పూజా సమయంలో కంద మొక్కను పూజా గదిలో ఉంచి, దానిపై తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. మొదట వినాయకుడిని ఆరాధించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని లేదా సంతానలక్ష్మీ దేవిని ఆహ్వానించి, షోడశోపచార పద్ధతిలో పూజించాలి ఐదు రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తుంది.పూజ అనంతరం వ్రతకథను వినాలి శక్తి మేరకు ముత్తైదువులకు భోజన తాంబూలాలు ఇవ్వాలి
***. ****
.చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి... స్మశాన వాటికలో చెట్లు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్
జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటిక లో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల... ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ సిబ్బందికి అవగాహన
జగిత్యాల మార్చి 11 (ప్రజా మంటలు)ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన సిబ్బందికి అవగాహన కార్యక్రమం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుండి ప్రారంభం కాబోయే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు కేటాయింపబడిన చీఫ్ సూపర్డెంట్ లకు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు నియమ
ఈ... ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 11 ( ప్రజా మంటలు)పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణం లో జగిత్యాల జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు లియాకత్ అలీ మోసిన్ స్వగృహం లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి .ఈ... సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):
సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన... కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జగిత్యాల రూరల్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల రోజే... కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రపతి ప్రతినిధిగా, గవర్నర్ gaa నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ స్వాగత కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,... వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగింపు
ఖమ్మం/హైదరాబాద్, మార్చ్ 10 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఖమ్మంలో దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు.
ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600... వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):
ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ... ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత మాట్లాడుతూ... ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తభా ఖమెనీ నియామకం –
ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తభా కామెనీ నియామకం
మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా... ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం
ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో... 