నేడే పోలాల అమావాస్య..  పశువులను పూజించడం ఆనవాయితీ

On
నేడే పోలాల అమావాస్య..  పశువులను పూజించడం ఆనవాయితీ

 

ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. శనివారం  అమావాస్య  సందర్భంగా పశువులను పూజించడం  పూజలు నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది.
 ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టతను, వ్రతం కథను తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో   ఆవులు ఎద్దులు , బర్రెలు దున్నలు వంటి పశువులు
వ్యవసాయ పనులలో 
 రైతులకు ముమ్మరంగా సహాయం చేసేవి . దాంతో పోలాలన్ని నాట్లు పూర్తయి శ్రావణ బహుళ అమావాస్య వరకు ఎటూ చూసినా పచ్చని పచ్చదనం పరుచుకుని పశువులకు కాస్త తెరిపి దొరికేది . పశువులు తమకు చేసిన మేలువల్ల రైతాంగం పశువులను నీళ్ళతో కడిగి కొమ్ములకు రంగులు వేసి గౌరవించి పూజించడం ఆనవాయితీ గా మారింది 
సంతానం పొందిన మహిళలు తమ పిల్లల బాగుకోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. 

పురాణాల ప్రకారం 
పోలాల అమావాస్య కథ
పూర్వం ఓ గ్రామంలో  నివసించే బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు  కుమారులు. యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఏడుగురు కుమారులు ఆ గ్రామంలోనే వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు.
తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు.

దీంతో ఏడుగురు అన్నదమ్ములు శ్రావణమాసం లో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరించారు. చివరిగా అమావాస్య రోజు వచ్చే పోలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వ్రతం చేయలేకపోతారు.  మరుసటి ఏడాది వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మళ్లీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడి మరో బిడ్డ మరణిస్తాడు. దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు.

ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం.. బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం.. ఇలా ఏడేళ్లు జరుగుతుంది. దీంతో మిగిలిన ఆరు మంది కోడళ్లు ఏడో కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నాము అంటూ తిట్టుకుంటారు. ఈ కారణంగా ఏడో కోడలు కుమిలిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోజు కూడా ఏడో కోడలి మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్లీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా.. మాములుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే.. ఏడో కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకూ అలాగే గడిచిపోతుంది.
అయితే.. రాత్రి బాగా చీకటి పడి గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి.. దుఖిస్తూ ఉంటుంది. ఆ సమచంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది.

దీంతో ఆమె గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షతలు ఇస్తుంది. ఈ అక్షతలను చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్లి.. ఆమె ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది.

ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెప్పగా అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని.. సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్ర వచను .

పూజా సమయంలో కంద మొక్కను పూజా గదిలో ఉంచి, దానిపై తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. మొదట వినాయకుడిని ఆరాధించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని లేదా సంతానలక్ష్మీ దేవిని ఆహ్వానించి, షోడశోపచార పద్ధతిలో పూజించాలి ఐదు రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తుంది.పూజ అనంతరం వ్రతకథను వినాలి  శక్తి మేరకు ముత్తైదువులకు భోజన తాంబూలాలు ఇవ్వాలి
            ***.   ****
.చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ జగిత్యాల

Tags

More News...

Local News  State News 

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు    మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూయడం బాధాకరమైన విషయమని ,ఆయన మృతి దేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రజా ఉద్యమాలలో కూడా తీరని లోటు కలిగించిందను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి. రాజేశం గౌడ్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు....
Read More...
Local News 

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు    సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు): మాజీమంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి  జన్మదిన వేడుకలు  ఆదివారం ఘనంగా జరిగాయి. బేగంపేట లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు రాష్ర్ట బీజేపీ అద్యక్షులు ఎన్,రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హజరయ్యారు. ఈసందర్బంగా భారీ కేకు కట్ చేశారు....
Read More...
Local News 

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్‌ సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) : హైదరాబాద్, సికింద్రాబాద్‌ల సిక్కు సమాజం ఆదివారం సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్‌లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. కార్యక్రమం ఆసా ది వార్ తో  ప్రారంభమై, ప్రసిద్ధ రాగి జథా భాయ్ జగ్ప్రీత్ సింగ్ జీ ఖన్నా వాలే  ఆధ్యాత్మిక కీర్తనలో...
Read More...
Local News 

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

ఎవరి కోసం అధికారంలో ఉన్నారా..? ప్రతి పక్షంలో ఉన్నారా? సికింద్రాబాద్  ఆగస్టు 24 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చేస్తున్న యాత్ర కేవలం నటన కోసం మాత్రమే అన్నట్లుగా ఉందని,  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా లేదా ప్రతిపక్షంలో ఉన్నదా అని తెలంగాణ...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం సికింద్రాబాద్, ఆగస్టు 24 (ప్రజామంటలు ):  హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద ఆకలితో అలమటిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు తమ 283వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుట్ పాత్ పై ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు.  ప్రతి ఆదివారం తమ కోసం రకరకాల...
Read More...
Local News 

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు):   పద్మారావు నగర్ అభినవ్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్  అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త ఎన్.చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవంగా అసోసియేషన్ నూతన అద్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా నర్సింహారెడ్డి ఎన్నికయినట్లు సభ్యులు తెలిపారు. నూతన అద్యక్షుడిగా ఎంపికైన
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్ కడసారి వీడ్కోలు పలికిన నేతలు , కార్యకర్తలు సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) :  సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ  సురవరం సుధాకర్‌రెడ్డి పార్ధివ దేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కళాశాలకు డొనేట్ చేశారు. ఆదివారం సాయంత్రం మఖ్దూంభవన్‌నుంచి గాంధీ మెడికల్‌కాలేజీ వరకు  సురవరం  భౌతికకాయాన్ని కార్యకర్తలు వెంట రాగా...
Read More...
Local News 

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం? ఇబ్రహీంపట్నం ఆగస్టు 24( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఆదివారం మాంసం వ్యాపారులు చనిపోయిన మేక మాంసాన్ని విక్రయించినట్లు జరిగిన ప్రచారం, గ్రామంలో ఆందోళనకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ముగ్గురు మటన్ వ్యాపారులు మాంసాన్ని విక్రయిస్తుండగా మాంసం నుండి దుర్వాసన రావడంతో...
Read More...
Local News 

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ ఆగస్ట్ 24(ప్రజా మంటలు)   ఆదివారం (భానువాసరే ) భాద్రపద మాసం  శుక్ల  పక్షం, పాడ్యమి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ.సూర్య భగవానుని విశిష్టత :ఆదివారం – సూర్య భగవానుని ప్రత్యేక దినంఆదివారం హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుని (సూర్యుని)కి అంకితమైన పవిత్రమైన రోజు.  సూర్యదేవుని...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు    జగిత్యాల ఆగస్టు 24 (ప్రజామంటలు) పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన విద్యార్థులు 64 వ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ – 2025 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.   ఈ నెల 22-08-2025న జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన  జగిత్యాల జిల్లా ఫుట్‌బాల్  సెలెక్షన్లలో ప్రతిభ ఈ...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం (అంకం భూమయ్య): గొల్లపల్లి ఆగస్టు 24  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని గంగదేవిపల్లి గ్రామానికి చెందిన బోయపోతూ నర్సయ్య  ఇటీవల అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున గంగదేవిపల్లి, రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకులు, ప్రజలు దయా...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు జగిత్యాల ఆగస్టు 24 (ప్రజా మంటలు)జిల్లా  కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో గత పది రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతుల  ముగింపు  ఉత్సవం, ఎంతో ఘనంగా జరిగింది. గాయత్రి పరివార్ నిర్వాహకులు శ్రీ వేముల రాంరెడ్డి  భగవద్గీత శ్లోకాలను వాటి తాత్పర్యాలను హృదయాలకు హత్తుకునేలా చెబుతున్న...
Read More...