భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప వరం "యోగ"ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలకు డా. బి. శంకర్
జగిత్యాల జూన్ 21(ప్రజా మంటలు)
భారతదేశం ప్రపంచ మానవాళికి అందించిన గొప్ప వరం యోగ అని ప్రముఖ వైద్యులు, ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వాల్మీకి ఆవాసం సేవా భారతీయ ఆధ్వర్యంలో స్థానిక గీత విద్యాలయం మైదానంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 దేశాలలో యోగ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
యోగ సాధన వల్ల శారీరక, మానసిక ఒత్తిడి దూరమై మనిషి ఆరోగ్యకరంగా జీవించగలుగుతారని తెలిపారు. యోగ సాధనలో శ్వాసను నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకు పెరుగుతుందని దీనికి యోగ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన గొప్ప ఆరోగ్య కరదీపిక యోగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగను భాగస్వామి గా చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యోగ శిక్షకులు డాక్టర్ గుండేటి ధనుంజయ, గడ్డం పూర్ణిమ, ఆవాస కమిటీ సభ్యులు ఎన్నమనేని అశోకరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, తుంగూరి సురేష్ మల్లేశం, బిజెపి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు దివాకర్, రాగిళ్ల సత్యనారాయణ, శంకర్,గాధాసు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
