నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్
సిరిసిల్ల . రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 1(ప్రజా మంటలు)
విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు.
జగిత్యాల మే 1(ప్రజా మంటలు)
జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు.- ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా ఎస్సీ/ ఎస్టీ కేస్ లపై పురోగతి, జిల్లా వ్యాప్తంగా నమోదైన తాజా నేరాల విశ్లేషణ, నేర నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సీసీటీవీ వ్యవస్థల ప్రాముఖ్యత మరియు వాటి నిర్వహణ,రాత్రి గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, మహిళల భద్రతపై,రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ మరియు అసాంఘిక కార్యకలాపాల పై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి అధికారులతో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. ప్రజల భద్రతను కాపాడేందుకు పోలీసులు నిరంతరం నిబద్ధతతో పనిచేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు చట్టలకు లోబడి బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని, అదే విధంగా నమోదైన కేసులలో పారదర్శకంగా విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా చూసి బాధితులకు పోలీస్ పై నమ్మకం, భరోసా కలిగించే విధంగా విధులు నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాత్రి సమయాల్లో ప్రజలు మనపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేసి చోరీలను నియంత్రించాలని సూచించారు.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ యొక్క నేర స్థలంలో తీసుకోవాల్సిన చర్యలు మరియు ఆ యొక్క నేరానికి సంబంధించిన క్లూస్ ను ఏ విధంగా సేకరించాలి అనే అంశాలపై డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గడిచిన ఏప్రిల్ నెలలో మూడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు మరొక కేసులో 10 సంవత్సరాలు జైలుశిక్ష విధించడంలో కృషిచేసిన పి.పి మల్లికార్జున్, అడిషనల్ పీ.పీ మల్లేశం ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడం లో, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ యొక్క సమావేశంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పిలు రఘు చంధర్, రాములు, మరియు డి సి ఆర్ బి,ఎస్ బి, ఐటి కోర్ , సి సి ఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్,రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇనస్పెక్టర్ లు కిరణ్ కుమార్ ,వేణు మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,నిరంజన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేష్ ,మరియు ఎస్.ఐ లు, డి సి ఆర్ బి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
