బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష
వెంట జీహెచ్ఎమ్సీ, విద్యుత్,పోలీస్ శాఖ అధికారులు
వర్షాలకు ముందుగానే పనులు చేయాలని ఆదేశం
సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు):
సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో బ్రాహ్మణవాడి ప్రాంతంలో నెలకొన్న పలు దీర్ఘకాలిక సమస్యలను పరిశీలించేందుకు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ మంగళవారం అధికారులతో కలిసి విస్తృత పర్యటన నిర్వహించారు. లేన్ 1 నుంచి లేన్ 7 వరకు వరుసగా సందర్శించిన ఆమె, వరద నీటి నిల్వ, డ్రైనేజీ, వీధి లైట్లు, విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలను సమీక్షించారు. అధికారులతో కలసి పర్యటించిన ఆమె ఈసందర్బంగా కాలనీలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, హెచ్ఎంఎన్డబ్ల్యూఎస్ఎస్బీ జనరల్ మేనేజర్ వినోద్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ సాయి, పోలీస్ శాఖకు చెందిన మొహక్ ఇక్బాల్తో పాటు ఆయా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని డా. నీలిమ అధికారులకు తెలిపారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈప్రాంతంలో తలెత్తే సమస్యలు ఈ సారి పునరావృతం కాకూడదన్నారు. ప్రతి లేన్లోని పరిస్థితులను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసేందుకు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో విషాల్ సుదం, హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్, సలీమ్ ఖాన్, మనోజ్ కుమార్, కృష్ణ, అల్తమాస్, చిరంజీవి, నసీర్ అడ్డు, తస్లీమ్, సబా, జగదీష్, అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..
