ఘనంగా గౌతమ్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 20 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి గౌతమ హై స్కూల్, విద్యానగర్ విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రంa స్థానిక మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్, తాజా మాజీ కౌన్సిలర్ కొలగాని ప్రేమలత తదితరులు పాల్గొన్నారు .
అనంతరం వక్తలు మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్థానికంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తూ పూర్తిస్థాయి మౌలిక వసతులతో నూతన ఆవిష్కరణలతో విద్యాసంస్థ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నూతన సాంకేతికతను రంగరించి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా పాఠశాల కరస్పాండెంట్ కంది అన్నపూర్ణ కైలాసం తనయుడు కంది శరత్ ఎంఎస్ పీహెచ్డీ యూఎస్ఏ అమెరికా నుంచి విద్యార్థుల ఉద్దేశించి ఇంటర్నెట్ ద్వారా సందేశాన్ని అందించారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈషా ఫౌండేషన్ ద్వారా నూతన భవనంలో అన్ని హంగులతో ఐఐటి, నీట్ తదితర పోటీ పరీక్షలలో స్థానిక విద్యార్థులు ప్రపంచీకరణలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
