అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.
సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):
మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని బిజెపి బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. బ్రిటిషోళ్ళకే భయపడలేదని బీజేపీకి భయపడం అన్న దయాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని బ్రిటిషోళ్లు వేసిన భీజమే కాంగ్రెస్ అని తెలుసుకోకపోవడం కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు ఏ.ఓ హ్యూమ్ ఒక బ్రిటిష్ అధికారి అన్న విషయం దయాకర్ కు తెలియక పోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.
గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో బీజేపీని ఓడిస్తాం అనగానే సోనియా, రాహుల్ పై ఈడీ దాడులు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని గతంలో సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ మీద మని ల్యాండరింగ్ కేసు వేశారని అప్పటి నుండి దానిమీద ఈడీ విచారణ జరుపుతోందని విచారణలో భాగంగా సోనియా, రాహుల్ ల ప్రమేయం ఉన్నట్టు ఈడీ విచారణలో తేలడం వల్లే సోనియా, రాహుల్ ల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందని ఈడీ అనేది రాజ్యాంగ బద్ధమైన ఒక సంస్థ అని అలాంటప్పుడు మోడీకి అమిత్ షాకి ఏమి సంభందం అని ప్రశ్నించారు.
ఈడీ అనే రాజ్యాంగ బద్ధమైన సంస్థ బిజెపి అధికారంలో వచ్చాకనే రాలేదని రాజ్యాంగం, అంబెడ్కర్ గురించి పదే పదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఈడీని అవమానిస్తే రాజ్యాంగాన్ని అంబెడ్కర్ గారిని అవమానించినట్లేనని కాంగ్రెస్ నాయకులు గుర్తెరగాలి అన్నారు.ఒకవేళ ఈకేసులో సోనియా, రాహుల్ ల తప్పు లేకుంటే కోర్టులో తమ సచ్చీలతను నిరూపించుకోవాలి కానీ ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు తెలపడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. దేశమంతా కులగణన చేపట్టాలని పార్లమెంట్ లో రాహుల్ డిమాండ్ చేయడం వల్లనే బిజెపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు అసలు సోనియా, రాహుల్ ఏ కులానికి చెందినవారో గాంధీ కుటుంబానికి సోనియా కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని అన్నారు.
చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు గాంధీ పేరు తగిలించుకొని నకిలీ గాంధీలు తయారు అయ్యారని వారిని దేశప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని అందుకే వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్నారని దీన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణచుకోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎక్కువ కాలం పాలించి స్కాంగ్రెస్ పార్టీగా అవతరించిందని ఏద్దేవా చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
