కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ
ముల్కనూర్ పిహెచ్సి పరిధిలోకి మార్చాలని గ్రామస్తుల వినతి
సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
భీమదేవరపల్లి ఏప్రిల్ 17 (ప్రజామంటలు) :
సోమవారం వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ను హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 సం.లు పైబడిన వారికి స్క్రీనింగ్ చేసిన వివరాలను పరిశీలించారు. 5 లబ్ధిదారులకు 14 డోసుల వ్యాక్సినేషన్ చేశారు. మొత్తం 3129 మందిని స్క్రీన్ చేయడం జరిగిందని, అయితే ఆన్లైన్లో సమస్య వలన అందరి వివరాలు నమోదు కాలేదని ఆరోగ్య సిబ్బంది డీఎంంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఉపకేంద్ర పరిధిలో గుర్తించిన 298 బిపి,186 షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే ఇద్దరు టీబి వ్యాధిగ్రస్తులకు సరైన ఫాలోఅప్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మందిర్లో ఇటీవల కొనుగోలు చేసిన మిని రిఫ్రిజిరేటర్ ను పరిశీలించారు. మిని రిఫ్రిజిరేటర్ అందుుబాటులో ఉన్నట్లయితే టి డి , ఏ ఆర్ వి ,ఏ ఎస్ వి వంటి వ్యాక్సిన్ లను ఇక్కడనే భద్రపరచడం వల్ల టి డి లాంటి ఇంజక్షన్ కోసం ప్రజలకు ముల్కనూర్ లేదా వంగరకు పోవాల్సిన ఇబ్బంది ఉండదు అన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మినీ రిఫ్రిజిరేటర్ అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా వైద్యాధికారులకు సూచించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణ స్థలానికి సంబంధించిన సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు తమ కొత్తపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని వంగర నుండి ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాల్సిందిగా కోరారు. కొత్తపల్లి నుండి వంగర పిహెచ్సికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు తెలియజేశారు. ఈ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో Dr . దినేష్ జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, ఏఎన్ఎం హేమలత ఆశాలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
