పవిత్రమైన వైద్య వృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలి

On
పవిత్రమైన వైద్య వృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలి

IMG-20250411-WA0011కాళోజీ హెల్త్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి
ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 2019 గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు) :
 
ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలని, ఇందులో వృత్తి నిబద్దత, ఓపిక,ప్రశాంతత ఎంతో అవసరమని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పీవీ నందకుమార్రెడ్డి అన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ 2019 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన  ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోగులతో ప్రేమగా వ్యవహరించాలని, ఆప్యాయంగా వారితో మాట్లాడాలని సూచించారు.

పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను, ఎంబీబీఎస్ పూర్తి చేసిన 2019 బ్యాచ్ కు చెందిన 245 మంది వైద్య విద్యార్థులందరికీ డాక్టర్ పట్టాలను అందజేసి, అభినందనలు తెలిపారు. 1973 బ్యాచ్ లో గాంధీ మెడికల్ కాలేజీలో తాను చదువుకున్నానని, ఈరోజు వైస్ ఛాన్స్ లర్ హోదాలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉన్నదన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధన చేయడానికి ముందుకు వస్తే తమ యూనివర్సిటీ ద్వారా వారికి తగిన నిధులను అందించి ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్ లో ఉన్న హెల్త్ యూనివర్సిటీ బ్రాంచ్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

IMG-20250411-WA0011

డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కళాశాల ఖ్యాతిని నూతన డాక్టర్లు మరింత పెంచే విధంగా నడుచుకోవాలని ఆయన అన్నారు. వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి గతంతో పోలిస్తే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదని అన్నారు. దానిని ఉపయోగించుకుని మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఆదిలాబాద్ జిల్లా, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ ప్రజలు వైద్యం కోసం పట్టణానికి రావాల్సి వచ్చేదని అన్నారు. 33 జిల్లాలలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు ఆయ్యాయని అన్నారు. ముఖ్యంగా కరోనా రెండు దశల్లో గాంధీ ఆసుపత్రిలో లక్షలాదిమందికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారని, అందుకు పనిచేసిన వైద్యులు సిబ్బందిని అభినందిస్తున్నామని అన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. ఇందిరా మాట్లాడుతూ 2019లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 245 మంది విద్యార్థుల్లో 95% ఉత్తీర్ణత సాధించారని అన్నారు.

మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ద్వారా తమ కళాశాలకు చెందిన డాక్టర్ దుర్గం కావ్య గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం అన్నారు.  గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్  సి.హెచ్.ఎన్.రాజకుమారి మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న తాజా మార్పులను నూతన డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గాంధీ వైద్య కళాశాల ప్రతిష్టను మరింత చేసే విధంగా వైద్య సేవ అందించాలని ఆమె సూచించారు. అనంతరం నూతన డాక్టర్ల చేత ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్ఓడి లు డాక్టర్ బి వాల్యా, డాక్టర్ రాజారామ్, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ మురళీధర్, గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లింగమూర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్,జూడా ప్రెసిడెంట్ డా.అజయ్, మహ్మాద్ ఫారుఖ్ పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...
Local News 

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): SSC -2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి, మానస, సూర్య స్కూల్స్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా...
Read More...
Local News 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ హైదరాబాద్ ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక ముషీరాబాద్ లో గల భవానీ శంకర దేవాలయం వేదిక గా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 33 మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి ని పరామర్శించారు త్వరితగతిన ఈ...
Read More...
Local News 

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల  విరాళం...
Read More...
Local News 

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి  పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా  జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు  మచ్చ...
Read More...
Local News 

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ బుధవారం విడుదల అయిన పదవతరగతి వార్షిక ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. రోహిత్ మిశ్రా అనే విద్యార్థి 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. తర్వాత ఆర్ .నిహారిక 600 మార్కులకు గాను 533...
Read More...
Local News 

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థులు 100% ఫలితాలు సాధించి, మండల జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. 1. ఎనగందుల వర్షిని 586 2. సట్టా అక్షిత 566 3. జాసియ బేగం 560 4. అనిశ్విక్ 555 5. సైన్ల శ్రేష్ణ...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

 జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదవ తరగతి విడుదలైన ఎస్సెస్సి ఫలితాలలో మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలకు అత్యుత్తమ ఫలితాలు జగిత్యాల జిల్లాలో ఉన్న మొత్తం 6 మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలల నుండి 378 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందరూ ఉత్తీర్ణత సాధించి 100% ఉత్తీర్ణత శాతం సాధించడం విశేషం.ఈ సంవత్సరం అత్యధిక...
Read More...