పవిత్రమైన వైద్య వృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలి

On
పవిత్రమైన వైద్య వృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలి

IMG-20250411-WA0011కాళోజీ హెల్త్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి
ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 2019 గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు) :
 
ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలని, ఇందులో వృత్తి నిబద్దత, ఓపిక,ప్రశాంతత ఎంతో అవసరమని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పీవీ నందకుమార్రెడ్డి అన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ 2019 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన  ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోగులతో ప్రేమగా వ్యవహరించాలని, ఆప్యాయంగా వారితో మాట్లాడాలని సూచించారు.

పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను, ఎంబీబీఎస్ పూర్తి చేసిన 2019 బ్యాచ్ కు చెందిన 245 మంది వైద్య విద్యార్థులందరికీ డాక్టర్ పట్టాలను అందజేసి, అభినందనలు తెలిపారు. 1973 బ్యాచ్ లో గాంధీ మెడికల్ కాలేజీలో తాను చదువుకున్నానని, ఈరోజు వైస్ ఛాన్స్ లర్ హోదాలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉన్నదన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధన చేయడానికి ముందుకు వస్తే తమ యూనివర్సిటీ ద్వారా వారికి తగిన నిధులను అందించి ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్ లో ఉన్న హెల్త్ యూనివర్సిటీ బ్రాంచ్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

IMG-20250411-WA0011

డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కళాశాల ఖ్యాతిని నూతన డాక్టర్లు మరింత పెంచే విధంగా నడుచుకోవాలని ఆయన అన్నారు. వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి గతంతో పోలిస్తే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదని అన్నారు. దానిని ఉపయోగించుకుని మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఆదిలాబాద్ జిల్లా, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ ప్రజలు వైద్యం కోసం పట్టణానికి రావాల్సి వచ్చేదని అన్నారు. 33 జిల్లాలలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు ఆయ్యాయని అన్నారు. ముఖ్యంగా కరోనా రెండు దశల్లో గాంధీ ఆసుపత్రిలో లక్షలాదిమందికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారని, అందుకు పనిచేసిన వైద్యులు సిబ్బందిని అభినందిస్తున్నామని అన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. ఇందిరా మాట్లాడుతూ 2019లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 245 మంది విద్యార్థుల్లో 95% ఉత్తీర్ణత సాధించారని అన్నారు.

మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ద్వారా తమ కళాశాలకు చెందిన డాక్టర్ దుర్గం కావ్య గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం అన్నారు.  గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్  సి.హెచ్.ఎన్.రాజకుమారి మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న తాజా మార్పులను నూతన డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గాంధీ వైద్య కళాశాల ప్రతిష్టను మరింత చేసే విధంగా వైద్య సేవ అందించాలని ఆమె సూచించారు. అనంతరం నూతన డాక్టర్ల చేత ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్ఓడి లు డాక్టర్ బి వాల్యా, డాక్టర్ రాజారామ్, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ మురళీధర్, గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లింగమూర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్,జూడా ప్రెసిడెంట్ డా.అజయ్, మహ్మాద్ ఫారుఖ్ పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...
Local News 

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు సిఐటియూ జెండాను  ఆవిష్కరించిన మండల సిఐటియు  అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు....
Read More...
Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...