చోరికి వచ్చిన దొంగకు వింత అనుభవం..
చోరీ చేసి పారిపోతుండగా కిందపడి తలకు గాయాలు...ఆసుపత్రిలో చేర్పించి తమ ఉదారతను చాటుకున్న కాలనీ వాసులు..
సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు):
ఓ దొంగ(35) మద్యం తాగి సెల్ ఫోన్ దొంగతనానికి వచ్చి ఇంట్లో వాళ్లు నిద్రలేవడంతో పట్టుకుంటారేమోనని భయంతో పారిపోతూ మెట్లపై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలై స్పృహత ప్పి పడిపోయాడు. దొంగేకదా చితకబాదుతామన్న ఆలోచన చేయకుండా ఆ కాలనీ వాసులు స్పృహతప్పిన దొంగను పోలీసుల సహకారంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గోపాలపురం పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పేషంట్ కోలుకొని, ఇంటికి వెళ్ళిపోయినట్లు సీఐ నరేశ్ తెలిపారు.
గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి... సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారు మనోహర్ థియేటర్ సమీపంలోని ఓ ఇంట్లో సోమవారం అర్దరాత్రి ఓ వ్యక్తి (35) ఫుల్లుగా మద్యం తాగి దొంగతనానికి యత్నించాడు. మెట్లు ఎక్కి పైకివెల్లిన అతడు కిటికీ లో నుంచి సెల్ ఫోన్ ను దొంగిలించాడు. ఇదే సమయంలో అలికిడి కావడంతో ఇంట్లో వారు నిద్రనుంచి మేల్కొనగా ఇది గమనించిన అతడు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. మెట్ల నుంచి కిందకు పరుగెత్తుతుండగా మెట్ల నుంచి జారి పడి గాయాలు కావడంతో పాటు స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని దేహశుద్ది చేయకుండా మానవతా దృక్పదంతో పోలీసులకు సమాచారం అందించి గాయాలపాలైన దొంగను ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం సదరు సెల్ ఫోన్ దొంగ కు కుటుంబసభ్యులు ఎవరు లేకపోడంతో తనే ఒంటరిగా ఇంటికి వెళ్లిపోయినట్లు ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
