మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

On
మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

(రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494)

"భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి, ముక్తి ప్రదాయినిగా  విరాజిల్లుతున్నది... సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యతీర్ధం. కరీంనగర్ కు 71 కిలోమీటర్ల ఉత్తరాన, జగిత్యాలకు 27 కిలోమీ టర్ల ఈశాన్యాన తెలంగాణ లోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా, దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నదీ క్షేత్ర రాజం. ప్రధానంగా శివకేశవుల నిలయమై, శ్రీల క్ష్మీనరసింహ, రామలింగేశ్వర ఆలయాలు, మసీదు పక్కపక్కనే కలిగి అనాదిగా వైష్ణవ, శైవ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలచి ఉన్నదీ పుణ్యతీర్ధం. బ్రహ్మండ, స్కంధ పురాణాలలో, మడికె సింగన పద్మ పురాణంలో, చెరి కొండ ధర్మన్న చిత్ర భారతంలో, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో, ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రలో, నృసింహదాసు మైరావణ చరిత్రలో, పోతనామాత్యుని నారాయణ శత కంలో, పింగళి సూరనార్యుని కళాపూర్ణో దయంలో, శేషాచలదాసు - నరహరి, నృసింహ, నృకేసరి శతకాలలో, కాకతీయానంతర శాసనాలలో, మధ్యయుగ దానపత్రాలలో ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసించ బడింది. పూర్వం ధర్మవర్మ మహారాజు ధర్మదేవత భక్తుడై, ప్రజలను ధర్మ కార్యోన్ముఖులను చేయడానికి చేసిన తపస్సు ఫలితంగా "ధర్మపురి" నామాంకిత, నృసిం హుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకై ఇచ్చట వెలసి యున్నాడని, పురాణాలు స్పష్ట పరుస్తున్నాయి. గౌతమ మహర్షి, తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పరమశివుని గూర్చి తపస్సు చేసి, ఆయన జటాజూటం నందు గల "గంగా దేవి"ని ధర్మపురికి రప్పించినందున "గౌతమి, గోదావరి" అని నదీ పేర్లు వచ్చినట్లు స్థల పురాణం విశద పరుస్తున్నది. శ్రీరామచంద్ర స్థాపిత రామేశ్వరాలయం, అక్కపెల్లి రాజేశ్వరాలయం, శ్రీరామాలయం, దత్తాత్రేయ, గౌతమేశ్వర, శ్రీసాయి శివ బాలాజీ , అయ్యప్ప, ప్రసన్నాంజనేయ, భక్తాంజనేయ, యమ ధర్మరాజ, సంతోషిమాత, సత్యవతీ, మహాలక్ష్మి మందిరాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలు చెక్కబడిన నృసింహాల యపు కాకతీయుల శిల్పకళకు అద్దం పట్టే కళ్యాణ మంటపం, శివాలయంలోని గణేష, చండిక, సప్తమాతృకలు, నల్లశెనపు రాతిపై సమంశ పద్ధతిలో చెక్కబడిన శ్రీరామలక్ష్మణ, సీతాదేవిల విగ్రహాలు మిగుల మనోజ్ఞమై ఉన్నాయి. ధర్మపురి క్షేత్రం మొదట జైన, బౌద్ధ యుగములందు ఆర్ష విద్య ప్రచార కేంద్రమై విదర్భ రాజ్య పోషణలో మున్యాశ్రమంగా ఉండేది. తర్వాత శాతవాహన, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ, రేచర్ల వెలమల మరియు నైజాం రాజుల ఏలుబడిలో అద్వితీయ వైభవాన్ని అనుభవించింది. ప్రతాప రుద్రుని కాలంలో ఢిల్లీని ఏలిన అల్లావుద్దిన్ ఖిల్జీ సేనాని మాలిక్ నాయబ్ కాపూర్ సైన్యం క్రీస్తు శకం 1309లో ఇందూరు (నిజామాబాద్)  మీదుగా కాకతీయులపై దండెత్తిన సమయంలో ఇచ్చటి నృసింహాలయం, రామేశ్వరా లయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. 14వ శతాబ్ది మూడవ పాదంలో నారాయణాశ్రమ స్వామి అనే సన్యాసి, నాటి రామగిరి పాలకుడైన  ముప్ప భూపతి సేనాని కేశనమంత్రి సాయంతో నారాయణ పురమను మఠంను స్థాపించి, బ్రాహ్మణులకు గృహములను నిర్మింపజేసి, అన్నసత్రాన్ని నెలకొల్పారు. 1724-50 మధ్య ధర్మపురివాసులు  తిరిగి నృసింహాలయాన్ని నిర్మించారు.

IMG-20250502-WA0010

క్షేత్ర ప్రాశస్త్యం

ఆద్వితీయ మహిమాన్వియైన ధర్మపురి క్షేత్ర మున యాత్రికుల సౌకర్యార్ధం నివాస స్థానములను కట్టించువారు భగవత్కటాక్షమున ఉత్తమ భవనముల పొందగలరని, ఇచ్చటి జీర్ణ మందిరములను ఉద్దరించువారు వైకుంఠమునందు ఉత్తమ సుఖములను అను భవించగలరని, శ్రీనృసింహుని పూజ కొరకు పూల చెట్లను పెంచువారు నందనాది వనములతో సౌఖ్యములను అను భవించ గలరని, శ్రీనృసింహు శౌల్యన్నమును, దధ్యన్నమును మరియు పులిహోరను నైవేద్యమిడు వారు అన్నదాతలై భగవత్కటాక్షమునకు పాత్రు లగుదురని, నృసింహుని ప్రీతికై క్షేత్రమున బ్రహ్మణులకు భూదానం, గోదానం మరియు హిరణ్యాది దానములనొసంగువారు ముందు జన్మమున సార్వభౌములగుదురని, క్షేత్రమున దీనాందులకు, దంపతులకు, బ్రహ్మచారులకు, పశుపక్ష్యాదులకు అన్నదాన మొనర్చినచో, నృసింహ కటాక్షమున వారి వారి పితృదేవతలు మోక్షమును పొందగలరని, శౌనకాది మహర్షు లకు నైమిషారణ్యము నందు శూత పౌరాణికులు వివరించినట్లు స్కంధ పురాణాంతర్గత ధర్మపురి
క్షేత్ర మహత్యం విశదపరుస్తున్నది. 

నరసింహ అవతార ప్రత్యేకత

రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, ఆకాల మృత్యు భయముండదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయా చరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం. "ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం” మంత్రంతో నరసింహ స్వామిని పూజిస్తే శతృ జయం కలుగుతుంది. పగలు రాత్రి కాని సంధ్యా. సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవ మూకాని చేతిగోళ్ళతో, హిరణ్యకశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి
గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నం.

నరసింహ నవరాత్రులు

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర) నవరాత్రి ఉత్సవాలు మే 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు సాంప్ర దాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవతా మూర్తులను కలిగి 'ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు' అని విఖ్యాతి నందిన ప్రాచీన చరిత్ర మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన ధర్మపురి క్షేత్రంలో ఏటా వైశాఖ శుక్ల షష్టి నుండి చతుర్దశి వరకు స్థానిక దైవాల నవరాత్రి ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించడం అనాదిగా ఆచరణలో ఉంది. ఈ సంవత్సరం ప్రధానంగా మే 7 న సహస్ర కలశాభిషేకం, 8న చందనోత్సవం, 9న వసంతోత్సవం, పల్లవోత్సవం, అన్న  కూటోత్సవం, నిత్య ఆరాధనలతో పాటు 10న లక్ష  తులసీ పూజ,  సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించ నున్నారు. 11న నర సింహ జయంతి, ప్రత్యేక స్థంభోద్భవ పూజాది కాలు నిర్వహించ నున్నారు. దేవస్థానం ఏసి, ఈఓ సంకటాల శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, వివిధ ఆలయాల అర్చకులు, సిబ్బంది కార్యక్రమాల ఏర్పాట్లు, నిర్వహణలలో నిమగ్నమై ఉన్నారు.

Tags

More News...

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న  విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా హైదరాబాద్ ఏప్రిల్ 02: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక...
Read More...

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు జగిత్యాల మే 02 (ప్రజా మంటలు) శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను...
Read More...
Local News 

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, మే 02  (ప్రజామంటలు): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  రికగ్నైజ్ గుర్తింపు కలిగిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కాశపాగా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి కార్మికులకు వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు, అన్యాయం జరిగిన అ సమస్యకు పరిష్కార దిశగా న్యాయబద్ధ పోరాటం చేసి బాధితులకు...
Read More...
Local News 

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లు పంపిణీ సికింద్రాబాద్, మే 02 (ప్రజామంటలు): వాసవిక్లబ్ ప్రతినిధి బి.లక్ష్మీ వివేకానంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొండాపూర్ లోని ఆదిత్యా హైట్స్ వద్ద ఉన్న చలివేంద్రంలో వందలాది మందికి మజ్జిగ ను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్ మ్యాడం చంద్రశేఖర్, ప్రతినిధులు విద్యా సంకల్స్ గోలి జగదీశ్వర్, ఆదిత్యా...
Read More...
Spiritual   State News 

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు(రామ కిష్టయ్య సంగన భట్ల...        9440595494) "భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా...
Read More...
State News 

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్ గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల ఎస్ఐ సిహెచ్ ,సతీష్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారానికి సత్వర న్యాయం చేయడం నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు మండలంలో శాంతిభద్రతలను నిలకడగా ఉండడంతో ప్రశంసిస్తూ...
Read More...
Local News 

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ  

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ   సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు): వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జియాగూడ లోని గోశాలో గోసేవ, గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బి.లక్ష్మీ వివేకానంద్ స్పాన్సర్ చేయగా వాసవి క్లబ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈసందర్బంగా గోవులకు ఒక ట్రక్కు పచ్చగడ్డి ని గోశాలకు అందచేశారు. గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్...
Read More...
Local News 

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల రాఘవ పట్నం గ్రామానికి చెందిన ఏలేటి చుక్కా రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి కార్యకర్త. రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులు అయిన వెంటనే స్పందించి  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  ఆయనకు సంబంధించిన ఎఫ్ ఐఆర్ కాపీలు  పోస్టుమార్టం రిపోర్టులను...
Read More...
Local News 

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్  గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాలీబాల్ శిక్షణ కేంద్రం శుక్రవారం ఉదయం ప్రారంబిచారు. కోచ్ తాండ్ర పవన్ మాట్లాడుతూ...
Read More...
Local News 

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  అభినందనలు

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  అభినందనలు                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 2(ప్రజా మంటలు)  జిల్లా 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి ( s s c) పరీక్ష ఫలితాల్లో  తెలంగాణ రాష్ట్రంలో 4 వ స్థానం  సాధించిన జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపి నందుకు  జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన...
Read More...
Local News 

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం 

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 2 ( ప్రజా మంటలు)  స్థానిక విద్యానగర్లోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ఆది శంకరాచార్య జయంతి, మరియు రామానుజాచార్య జయంతిని, పురస్కరించుకొని, ప్రముఖ  ఆధ్యాత్మిక సేవా తత్పరత కలిగిన  పొట్లపల్లి జమున గారు వికాస తరంగిణి మహిళలచే, ఒక వంద ఎనిమిది మంది సభ్యులచే సామూహిక శ్రీ విష్ణు...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే2(ప్రజా మంటలు)జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (మే 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు,...
Read More...