జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

On
జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

ప్రదర్శన ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము

జగిత్యాల ఎప్రిల్ 03:

 సూర్య గ్లోబల్ స్కూల్ లోనిర్వహించిన దేశ ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలిచే సంస్కృతి, నాగరికత అంశాల ప్రదర్శనతో చిన్నారులు అలరించారు.

 జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్యా గ్లోబల్‌ స్కూల్‌ లో గురువారం విద్యార్థులు భారతీయ సంస్కృతి-నాగరికతల వైభవాన్ని కండ్లకు కట్టేలా పలు అంశాలను ప్రదర్శింపజేసి అందరిని విస్మయానికి, గురి చేశారు. 


భిన్నత్వంలో ఏకత్వంకు ప్రతీకగా నిలిచే భారతీయ సంస్కృతిక అంశాలను రాష్ట్రాల వారిగా పిల్లలు ప్రదర్శించారు.పిల్లల్లో జ్ఞాన ఆర్జన ఆసక్తిని పెంచిన పాఠశాల యాజమాన్యంకు అభినందనలు అన్నారు. జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు దేశంలోని అన్ని రాష్ట్రాల వేషధారణతో ఆ రాష్ట్రాల ప్రాముఖ్యతను తెలియజేయడం అద్భుతమన్నారు. 

 గుజరాతీ వేషధారణతో పాటు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన గర్భా, డాండియా నృత్యాలను ప్రదర్శిఃచారు, సోమనాథ్‌ ఆలయం, స్ట్యాచ్యూ ఆఫ్‌ యూనిటీ, గిర్‌ నేషనల్‌ పార్క్​‍ వంటి ప్రఖ్యాత నిర్మాణాల నమూనాలను ప్రదర్శించారు.

  ధోఖ్లా, థెప్లా, ఖామాన్‌ వంటకాలను సైతం వండి వడ్డించారు.  మన రాష్ట్రానికి చెందిన చార్మినార్‌, రామప్ప దేవాలయాల నమూనాలతో పాటు, బోనాలు, బతుకమ్మ, ప్రసిద్ధ ఆహారం -   సరకొర్ర బియ్యం, దోశ, హైదరాబాద్‌ బిర్యానిని రుచి చూపించారు. ఆంధ్రప్రదేశ్‌ -   తిరుమల తిరుపతి, విశాఖ బీచ్‌, కూచిపూడి నృత్యం, గుత్తివంకాయ కూర, తమిళనాడుకు చెందిన బృహదీశ్వరాలయం నమూనాతో పాటు,  భరతనాట్యం, ఇడ్లీ-సాంబార్‌ వంటకాలను ప్రదర్శించారు. కర్ణాటకలోని హంపి, మైసూర్‌ ప్యాలెస్ నమూనాలు, యక్షగానం ప్రదర్శన, బెంగళూరు బిర్యాని లాంటి వంటకాలను చేపట్టారు.

రాజస్థాన్‌కు చెందిన నిర్మాణాలైన జైపూర్‌ హవా మహల్‌, థార్‌ ఎడారి, ప్రసిద్ది చెందిన ఘూమర్‌ నృత్యం, దాల్‌ బాటీ చూర్మా వంటకాలను తయారు చేశారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన తాజ్‌ మహల్‌, కాశీ విశ్వనాథ్‌ మందిరం, కతక్‌ నృత్యం, అవధీ బిర్యానీ, పశ్చిమ బెంగాల్‌ -   సుందర్‌ బన్స్​‍, హౌరా బ్రిడ్జ్‍, రసగుల్లా, ఒడిసి నృత్యం, మహారాష్ర్టకు చెందిన గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, లవణీ నృత్యం, వడాపావ్‌ వంటకం, పంజాబ్‌కు చెందిన గోల్డెన్‌ టెంపుల్‌, భాంగ్రా డాన్స్​‍, మక్కీ రోటీ, సర్పనీరలాంటి వంటకాలను తయారు చేసి ఆతులకు వడ్డించారు. సాంస్కృతిక అంశాలతో పాటు, సాంకేతిక అంశాల ఘనతను సైతం ప్రదర్శించారు.

 గణిత శాస్త్రవేత్తల ప్రతిభ, ఆవిష్కరణలు, భౌతిక, రసాయన, జీవ, వృక్ష శాసా్త్రల్లోని ముఖ్యమైన ఫార్ములాలను పిల్లలు ప్రదర్శించారు. 

 మానవ దేహంలోని బ్లడ్‌ గ్రూప్‌లను వివరించడంతో పాటు, అక్కడికి వచ్చిన ఆతుల వద్ద నుండి బ్లడ్‌ సాంపిల్స్​‍ సేకరించి, రక్తనమూనాలను తెలియజేయడం అందరిని ఆశ్చర్యంతో పాటు, ఆనందానికి గురి చేసింది. వీటితో పాటు ఇస్రో, ఆటమిక్‌ సెంటర్‌ నమూనాలను సైతం చిన్నారులు రూపొందించారు. 

 సామాజిక జీవనంలో కీలక పాత్ర పోషించే పోలీసు, డాక్టర్‌, ఉపాధ్యాయుడు, సైనికుడు, న్యాయమూర్తి, ఇంజనీర్‌, ఆర్మీ స్పేస్ సెంటర్‌, రైతు, టైలర్‌, బ్యుటీషియన్‌ లాంటి వృత్తులను సైతం పిల్లలు సచిత్రంగా, సవివరణంగా సాంకేతిక వస్తు సామాగ్రీతో సహా ప్రదర్శింజేసి ఔరా అనిపించుకున్నారు.

IMG-20250403-WA0014 ఈ కార్యక్రమానికి హజరైన జిల్లా విద్యాధికారి కె. రాము మాట్లాడుతూ,  స్కూల్‌ యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ  వారి ప్రతిభను  గుర్తించి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం వల్ల పిల్లల్లో స్ఫూర్తిని నింపవచ్చునన్నారు. చిన్నవయసులోనే పిల్లలకు సాంసృతిక, నాగరికత అంశాలతో పాటు, సామాజిక అంశాలపై ఒక సృహా రావడం గొప్పవిషయమన్నారు.

 తెలంగాణ లోని వంటకాలు అభిరుచులను తెలియజేస్తూ 700 మంది చిన్నారులు ప్రదర్శించిన ఇవ్వడం చాలా అరుదైన అంశమన్నారు. చిన్నారులు  కాలిగ్రఫీ హ్యాండ్‌ రైటింగ్‌ , ఆర్ట్‍ అండ్‌ క్రాఫ్ట్‍ను వంటబట్టించుకొని, అందమైన జీవితానికి మార్గాలు వేసుకోవాలని కోరారు. 

ఇందులో శ్రీధర్ రావు, సీనియర్ పాత్రికేయులు సిరిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ బోయినిపెల్లి శ్రీధర్‌ రావు, డైరెక్టర్లు మంజుల రమాదేవి, హరిచరణ్‌ రావు, రజిత రావు, సుమన్‌ రావు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...
Local News 

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): SSC -2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి, మానస, సూర్య స్కూల్స్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా...
Read More...
Local News 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ హైదరాబాద్ ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక ముషీరాబాద్ లో గల భవానీ శంకర దేవాలయం వేదిక గా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 33 మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి ని పరామర్శించారు త్వరితగతిన ఈ...
Read More...
Local News 

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల  విరాళం...
Read More...
Local News 

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి  పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా  జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు  మచ్చ...
Read More...
Local News 

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ బుధవారం విడుదల అయిన పదవతరగతి వార్షిక ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. రోహిత్ మిశ్రా అనే విద్యార్థి 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. తర్వాత ఆర్ .నిహారిక 600 మార్కులకు గాను 533...
Read More...
Local News 

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థులు 100% ఫలితాలు సాధించి, మండల జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. 1. ఎనగందుల వర్షిని 586 2. సట్టా అక్షిత 566 3. జాసియ బేగం 560 4. అనిశ్విక్ 555 5. సైన్ల శ్రేష్ణ...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

 జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదవ తరగతి విడుదలైన ఎస్సెస్సి ఫలితాలలో మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలకు అత్యుత్తమ ఫలితాలు జగిత్యాల జిల్లాలో ఉన్న మొత్తం 6 మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలల నుండి 378 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందరూ ఉత్తీర్ణత సాధించి 100% ఉత్తీర్ణత శాతం సాధించడం విశేషం.ఈ సంవత్సరం అత్యధిక...
Read More...