కాంగ్రెస్ లో చేరిన పలువురు గౌడ కులస్తులు
కాంగ్రెస్ లో చేరిన పలువురు గౌడ కులస్తులు
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 15 (ప్రజామంటలు): మండలంలోని పలు గ్రామాల్లోని గీత కార్మికులు ఇబ్రహీంపట్నం సర్దార్ సర్వాయి పాపన్న మండల అధ్యక్షులు నేరెళ్ల సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది గీత కార్మికులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి సోమవారం పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన గీత కార్మికులకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు డబ్బా మాజీ ఉపసర్పంచ్ భూస రాజేశ్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దూదిగం గంగాధర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జాన శంకర్, నల్ల రమేష్ చల్ల పురుషోత్తం, మెట్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి, గీత కార్మికులు బైరి శ్రీనివాస్ గౌడ్, సుంకేం ఆనంద్, జిల్లా గంగాధర్ గౌడ్, నారాయణ గౌడ్, ఎల్లా రాము గౌడ్, దేవయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, ప్రవీణ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.