ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

పార్టీ ద్రోహులు హరీశ్, సంతోష్ లు- వారి వల్లే రేపు పార్టీకి నష్టం- కవిత

On
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

హరీష్ రావు వల్లే జగ్గారెడ్డి,విజయశాంతి, డా.విజయరామారావు, ఈటెల పార్టీ వీడారు - కవిత 
రేవంత్ రెడ్డి తో కుమ్మక్కు - అందుకే వీరిపై కేసులు ఉండవు

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరు? సంతోష్ రావు క్లాస్మెంట్ అందుకే వీటి అవినీతిపై కేసులు లేవు

మహిళా నాయకులు నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ - స్వాగతం 

హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ, పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తనపై, పార్టీ పెద్దలైన కేసీఆర్, కేటీఆర్ పై హరీష్ రావు, సంతోష్ రావు లు చేసిన కుట్రలను, చేసిన పార్టీ వ్యతిరేక పనులను సవివరంగా వెల్లడించారు.

తీహార్ జైలు నుండి వచ్చిన వెంటనే, గురుకులంలో విద్యార్థి చనిపోతే వెళ్లిన, బనకచర్లపై, బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశా. గత నవవంబర్ నుండి నిన్నటి వరకు 47 నియోజక వర్గాలలో, పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకొంటూ, భవన్ ఇంచార్జీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తో మాట్లాడుతూ, నియోజకవర్గ కార్యకర్తలతో,నాయకులతో కలిసి కార్యక్రమాలు చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాల అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

తెలంగాణ భవన్ కు వెళ్లి అక్కడ 103 రోజుల క్రితం నాపై కొంత మంది చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్పినా, వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న నుండి ఫోన్ అందించాను. కానీ ఇప్పటి వరకు స్పందనలేదు. కానీ నా ప్రెస్ మీట్ పై పార్టీ మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం మంచిదే. అదే నేను ఆశించిన ప్రజాస్వామ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని కవితే అన్నారు.

 

మొన్నటికి మొన్న, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో అంతకాగుతు, సంఖ్యాబలం లేకున్నా, BRS పార్టీ నుండి రెండవ అభ్యర్థిని పెట్టాలని కేసీఆర్ పై వొట్టి కొట్టాడు. నాకు ఒక బీజేపీ ఎమ్మెల్యే పాన్ చేసి ఈ హరీష్ మాతో ఒప్పందం చేసుకొని, BRS నుండి రెండవ అభ్యర్థిని పెడతానంటున్నాడు, మాసయం కోరాడు.దీనికి పెద్దవారు అంగీకరించడా అని అడిగాడు. నేను ఈ విషయంలో నాన్న కు ఫోన్ చేసి చెపితే, ఆయన నో ఒకే అభ్యర్థి అని గట్టిగా చెప్పడంతో, ఆయమ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఇలా ఆయన పార్టీకి చేసిన ద్రోహాలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు.

మీడియా మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట.అందుకే ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు ఒకటి రెండు రోజులలో మాయం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి, హరీష్ కుమ్మక్కు అయిందనే, గురుకులాలకు సరఫరాచేసే పాల కుంభకోణం వార్త మాయం అయింది. ఆయన ఫాం హౌస్ వార్తకూడా అంటే. అదే, రామన్న మీద వచి ఆరోపణలపై విచారణ, మీడియాలో రాద్దాంతాలు. ఇది వారి కుట్రలకు, అవగాహనలు ప్రతీకలని ఆమె అన్నారు.

హరీష్ రావు ఎప్పుడూ కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా, తన ప్రత్యేక గ్రూప్ ఉంచుకున్నారు. ఎన్నికల్లో పార్టీకి తెలియకుండా, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు అదనంగా ఫండింగ్ చేశారు. ఈ డబ్బు ఎక్కడిది? ఇదంతా ఆయన అవినీతి డబ్బులు కావా అని ప్రశ్నించారు.

నేరేళ్ల దళితులపై పోలీసుల దురుసు ప్రవర్తనకు కారణం సంతోష్ రావు, కానీ చెడ్డపేరు రామన్నకు వచ్చిందని అన్నారు. 

బ్లూఫిన్ రియాల్టీ సంస్థ కు సంతోష్, పోచంపల్లి బినామీ

మొకిల్లాలో బ్లూఫిన్ రియాల్టీ సంస్థ కు బినామీలు ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గతం ఏమిటో అందరికీ తెలుసు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన పోచంపల్లికి ఇన్నివేల కోట్లు ఎలా వచ్చాయి? వీరంతా సంతోష్ తో కుమ్మక్కై సంపాదించింది కదా? సంతోష్ క్లాస్మెంట్ కాబట్టే పోచంపల్లి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని ఆరోపించారు.

హరీష్ రావు హంపి పార్టీ గురించి, YSR ను కలిసి, పార్టీకి ద్రోహం చేయాలని కొన్న విషయం సీనియర్ పాత్రికేయులందరికీ తెలుసు. అలాగే దుబ్బాక, హుజురాబాద్ ఓడిపోవడానికి ప్రధాన కారణం హరీష్ రావు. సమస్యలు సృష్టించి, పరిష్కరించమని ప్రచారం చేసుకొనే కుట్సిత మనస్తత్వం హరీష్ రావు , పార్టీని కబ్జా పెట్టాలనుకునే ఇలా వ్యవహరిస్తున్నాడని కవిత అన్నారు.

 

Tags

More News...

Local News  International  

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో  స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణేశుడికి పూజలు చేసిన మోంబాసా ప్రాంత తెలుగు ప్రజలు సమీపంలోని సముద్రంలో పడవపై వెళ్ళి వినాయక నిమజ్జనం చేశారు. ఈసందర్బంగా...
Read More...
National  State News 

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు హైదరాబాద్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు): గణేష్ నిమజ్జనలో పాల్గొనడానికి వస్తారనుకొన్న, అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది. ఈనెల 9వ తేదీన జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, అమిత్ షా బిజీగా ఉండడం వల్ల, పోటీలో ఉన్న ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి NDA మద్దతుదారుల ఓట్లకు గండి కొడతామోనని...
Read More...
National  International   Current Affairs  

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర మెరుపువేగంతో బంగారం ధరలు పెరగవచ్చు?అమెరికా ఫెడరల్ బ్యాంక్ గందరగోళం, టారిఫ్ గడవలే కారణమా,? న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: బంగారం నిప్పులు చెరుగుతోంది: $5,000 ధర కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉందని నిపుణులు ఎందుకు అంటున్నారు. రికార్డు గరిష్టాలు, US ఫెడ్ గందరగోళం, సెంట్రల్ బ్యాంక్ నిల్వలు  బంగారం ధరలు కొనుగోలుదారులను వణికిస్తున్నాయి. అమెరికా...
Read More...
Local News 

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   గురువారం గణేష్...
Read More...
Local News 

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం   జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభమైన అష్టాదశ పురాణ ప్రవచనం సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు ఒక పురాణంపై ప్రవచనాన్ని బుర్ర భాస్కర్ శర్మ కొనసాగిస్తున్నారు. ఆధ్యంతం ఎన్నో ఉపమానాలతో పురాణ ప్రవచనము కొనసాగుతుంది. పురాణ ప్రవచనాన్ని వినడానికి...
Read More...
Local News 

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కొడిమెల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు) కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిమ్యాల, నాచుపల్లి, పూడూర్, చెప్యాల్, రామకిష్టాపూర్ గ్రామాలలో  ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో  25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మల్యాల సీ.ఐ రవి మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజల భద్రత కోసం ఈ...
Read More...
National  Current Affairs   State News 

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు? కాంగ్రెస్ అగ్రకులాల,ఎస్సీల ఓట్ల లెక్కలలో చిక్కుకుంది సీట్ల పంపకం గురించి ఆర్జేడీ ఆందోళనలు పాట్నా సెప్టెంబర్ 04: మహాకూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి ముఖంగా చూపించడంలో కాంగ్రెస్ విముఖత చూపడానికి కారణం ఓటు లెక్కలు. కాంగ్రెస్ అగ్ర కులాలు, షెడ్యూల్డ్ కులాలను ఆకర్షించాలని చూస్తోంది. తేజస్వి పేరును ప్రకటించడం ద్వారా అగ్ర కులాలు,...
Read More...
National  International  

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించే దిశలో నేపాల్ ప్రభుత్వం  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: నేపాల్‌లో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, మరో 23 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నియమాలను పాటించలేదని పేర్కొంది; అసమ్మతిని నిశ్శబ్దం చేయడం మరియు ఆన్‌లైన్ ప్రసంగంపై నియంత్రణను కఠినతరం చేయడం ఈ చర్య యొక్క లక్ష్యం అని విమర్శకులు...
Read More...
Local News 

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   కిడ్నీ వ్యాధుల వల్ల కలిగే అనర్ధాలపై గాంధీ మెడికల్ కళాశాలలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గాంధీ వైద్య  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర జండా ఊపి ర్యాలీ ని  ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధుల పట్ల
Read More...
Local News 

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్... సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు): ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా నల్లగుట్ట ఓల్డ్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో గురువారం ఘనంగా  నిర్వహించారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. హెడ్మాస్టర్చిన్నాబత్తిని శౌరి మాట్లాడుతూ..సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన ఆచరణ, ఆలోచనలు ఉపాధ్యాయ వృత్తికి మార్గదర్శకం అన్నారు. ఉపాద్యాయులు  జాకీరా సుల్తానా, శైలజ,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం ₹20 లక్షల విలువైన పరికరాలు దానం చేసిన ప్రొఫెసర్ పద్మావతి రాఘువేంద్రరావు   సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 ( ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతగా ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పద్మావతి రఘువేంద్రరావు  రూ.20 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ను అందించారు. వీటిలో  సీ–ఏఆర్ఎమ్,...
Read More...
Local News 

ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన డ్రాయింగ్, వ్యాసరచనా రైటింగ్ పోటీలలో భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తమ  ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో గాయత్రి డ్రాయింగ్‌లో మొదటి బహుమతి సాధించగా,శివం కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. మణితేజ్ గౌడ్ ఎస్సే రైటింగ్‌లో సెకండ్ ప్రైజ్
Read More...