సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్
*డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు
*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) :
సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి సీసీఎస్ ఆధ్వర్యంలో పనిచేసే సిట్ లోని పోలీస్ అధికారులు సృష్టి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె సృష్టి కేసు లో తాము విచారణ జరిపిన అంశాలు, నిందితుల అరెస్ట్ ల గురించిన వివరాలను వెల్లడించారు.
తొమ్మిది కేసులు...25 మంది అరెస్టు....:
ఈ ఏడాది జూలై 27న సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై మొదటి కేసు నమోదైంది. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు సరోగసి పేరుతో మోసం చేసినట్లు డాక్టర్ నమ్రతపై కేసు నమోదు తర్వాత వరసగా బాధితులు గోపాల పురం పోలీస్ స్టేషన్ కు వచ్చి తాము మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇప్పటి వరకు సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు కాగా మొత్తం 25 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇల్లీగల్ సరోగసి, శిశువుల విక్రయం, సరోగసి మోసాల కేసులో అరెస్ట్ అయిన 25 మందిలో నలుగురు డాక్టర్లతో పాటు ల్యాబ్ టెక్నిషియన్స్, మేనేజర్స్,సూపర్ వైజర్స్,ఏజెంట్లు,బర్త్ పేరేంట్స్ లు ఉన్నారు.
డాక్టర్ సూరి శ్రీమతి డాక్టర్ పేరున లెటర్ ప్యాడ్ తీసుకొని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఐవీఎఫ్ కోసం సృష్టి సెంటర్ కు వచ్చిన పిల్లలు లేని దంపతులను మాయ మాటలు చెప్పిన డాక్టర్ నమ్రత ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తాయనే దుర్బుద్దితో సరోగసి వైపు వారిని మళ్ళించినట్లు దర్యాప్తు లో గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఐవీఎఫ్ అయితే కేవలం రూ.లక్ష నుంచి రూ 2లక్షలు మాత్రమే వస్తాయని, అదే సరోగసి అయితే రూ 30 నుంచి రూ 40 లక్షల వరకు గుంజవచ్చని ప్లాన్ వేసిన డాక్టర్ నమ్రత ఈజీ మనీ కోసం చాలా దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితుల ఫిర్యాదులతో వెలుగు చూసింది. శిశువుల కొనుగోళ్ళ విషయంలో ఆడపిల్లలకు రూ 3లక్షలు, మగపిల్లలకు రూ 4 లక్షలు ఏజంట్లకు ఇస్తారని తెలిసింది. ఒక జంటకు సరోగసి పేరుతో డబ్బులు తీసుకొని, చనిపోయిన శిశువును ఇచ్చారు. మళ్ళీ ప్రాసెస్ కోసం మరో రూ15 లక్షలు అవుతాయని అని చెప్పారని దంపతులు ఫిర్యాదుచేశారు.
మరో దంపతులకు వేరే వారి పిల్లలను కొనుగోలు చేసి, సరోగసి చేసినట్లు నమ్మించి వారి నుంచి దాదాపు రూ 40 లక్షలు వసూలు చేశారు. కాని ఇచ్చిన బాబు డీఎన్ఏకు పేరేంట్స్ డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో సృష్టి మోసాల పుట్ట బట్టబయలైంది. అలాగే తన మెడికల్ లైసెన్స్ నెంబర్ తో పాటు, తన పేరుతో లెటర్ హెడ్స్ ను డాక్టర్ నమ్రత తనకు తెలియకుండా అక్రమంగా వాడుతోందని ఓ సీనియర్ గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేశారు. వైజాగ్ కు చెందిన డాక్టర్ విద్యుల్లత తో పాటు డాక్టర్ రవి, డాక్టర్ ఉషను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. సికింద్రాబాద్ లోని ఉన్న ఆసుపత్రిని కేవలం కన్సల్టెన్సీగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఇక్కడ ఐవీఎఫ్ పేరుతో శాంపిల్స్ తీసుకుంటూ, మిగితా సరోగసి ప్రాసెస్ అంతా వైజాగ్ లో నిర్వహించినట్లు తెలిపారు. బాధితుల్లో ఒక ఎన్ఆర్ఐ జంట కూడ ఉండగా, వీరినుంచి భారీ మొత్తంలో డాక్టర్ నమ్రత డబ్బులు వసూలు చేసింది. మహిళా నిందితుల్లో చాలా మంది అండాలు అమ్ముకున్న వారు ఉండగా, మరికొందరు సరోగసి తల్లులుగా నటించిన వాళ్ళు ఉన్నట్లు తెలిపారు. ఎవరైన దంపతులు సరోగసి కోసం సెంటర్ కు అప్రోచ్ అవగానే వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఒక ఫేక్ అల్ర్టా సౌండ్ రిపోర్టు పంపుతారని, సరోగసి పద్దతిలో మీకు పుట్టబోయే పాప అంటూ స్కానింగ్ రిపోర్టు కూడ ఇస్తారని తెలిపారు. అదే సమయంలో నమ్రత ఏజంట్లు ఓ గర్బిణీని వెతికి పెడతారు. తొమ్మిది నెలల తర్వాత వైజాగ్ లో డెలివరీ చేసి, ఆ శిశువును సరోగసి ద్వారా పుట్టిన పాప అని దంపుతులను పూర్తిగా నమ్మించి, అప్పగిస్తారు.
ఇలా దాదాపు 50కి పైగా నకిటీ సరోగసి మోసాలు జరిగినట్లు తెలిసింది. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయన్నారు. డాక్టర్ నమ్రత మోసాలకు సంబందించిన 2010 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయని డీసీపీ తెలిపారు.
-
అరెస్ట్ అయిన 25 మంది వీరే:
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు, అడ్వకేట్ జయంత్ కృష్ణ, వైజాగ్ బ్రాంచీ మేనేజర్ కళ్యాణీ అచ్చాయమ్మ, ల్యాబ్ టెక్నిషియన్ చెన్నారావు,గాంధీ ఆసుపత్రి అనిస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్గుల సదానందం, ఏజంట్లు ధనశ్రీ సంతోషి,నందిని,బాబును విక్రయించిన దంపతులు అలీ అదిక్,నస్రీన్ బేగం,ఏజంట్ హర్షరాయ్,సూపర్ వైజర్ పవన్ మోహన కృష్ణ,నర్సు సురేఖ,ఏజెంట్ ఆషాబేగం,ఏజంట్ నయన్ దాస్,డాక్టర్ విద్యుల్లత,సబ్ ఏజంట్ షాహినా, గైనకాలజిస్ట్డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ రవి, జూనియర్ ఎంబ్రాలజిస్ట్ రమ్య,సబ్ ఏజెంట్ లు రత్నం,మీనాక్షి,మెయిన్ ఏజంట్ సరోజ,బర్త్ పేరేంట్ కరుణశ్రీ,సబ్ ఏజంట్ లు విజయ్ కుమార్, యమున లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)