సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

On
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

*డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు
*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) :

సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి సీసీఎస్ ఆధ్వర్యంలో పనిచేసే సిట్ లోని  పోలీస్ అధికారులు సృష్టి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె సృష్టి కేసు లో తాము విచారణ జరిపిన అంశాలు, నిందితుల అరెస్ట్ ల గురించిన  వివరాలను వెల్లడించారు.

తొమ్మిది కేసులు...25 మంది అరెస్టు....:

 ఈ ఏడాది జూలై 27న సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై  మొదటి కేసు నమోదైంది. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు సరోగసి పేరుతో మోసం చేసినట్లు డాక్టర్ నమ్రతపై కేసు నమోదు తర్వాత వరసగా బాధితులు గోపాల పురం పోలీస్ స్టేషన్ కు వచ్చి తాము మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇప్పటి వరకు సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు కాగా మొత్తం 25 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇల్లీగల్ సరోగసి, శిశువుల విక్రయం, సరోగసి మోసాల కేసులో అరెస్ట్ అయిన 25 మందిలో నలుగురు డాక్టర్లతో పాటు ల్యాబ్ టెక్నిషియన్స్, మేనేజర్స్,సూపర్ వైజర్స్,ఏజెంట్లు,బర్త్ పేరేంట్స్ లు ఉన్నారు.

డాక్టర్ సూరి శ్రీమతి డాక్టర్ పేరున లెటర్ ప్యాడ్ తీసుకొని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఐవీఎఫ్ కోసం సృష్టి సెంటర్ కు వచ్చిన పిల్లలు లేని దంపతులను మాయ మాటలు చెప్పిన డాక్టర్ నమ్రత ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తాయనే దుర్బుద్దితో సరోగసి వైపు వారిని మళ్ళించినట్లు దర్యాప్తు లో గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఐవీఎఫ్ అయితే కేవలం రూ.లక్ష నుంచి రూ 2లక్షలు మాత్రమే వస్తాయని, అదే సరోగసి అయితే రూ 30 నుంచి రూ 40 లక్షల వరకు గుంజవచ్చని ప్లాన్ వేసిన డాక్టర్ నమ్రత ఈజీ మనీ కోసం చాలా దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితుల ఫిర్యాదులతో వెలుగు చూసింది. శిశువుల కొనుగోళ్ళ విషయంలో ఆడపిల్లలకు రూ 3లక్షలు, మగపిల్లలకు రూ 4 లక్షలు ఏజంట్లకు ఇస్తారని తెలిసింది. ఒక జంటకు సరోగసి పేరుతో డబ్బులు తీసుకొని, చనిపోయిన శిశువును ఇచ్చారు. మళ్ళీ ప్రాసెస్ కోసం మరో రూ15 లక్షలు అవుతాయని అని చెప్పారని దంపతులు ఫిర్యాదుచేశారు.

మరో దంపతులకు వేరే వారి పిల్లలను కొనుగోలు చేసి, సరోగసి చేసినట్లు నమ్మించి వారి నుంచి దాదాపు రూ 40 లక్షలు వసూలు చేశారు. కాని ఇచ్చిన బాబు డీఎన్ఏకు పేరేంట్స్ డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో సృష్టి మోసాల పుట్ట బట్టబయలైంది. అలాగే తన మెడికల్ లైసెన్స్ నెంబర్ తో పాటు, తన పేరుతో లెటర్ హెడ్స్ ను డాక్టర్ నమ్రత తనకు తెలియకుండా అక్రమంగా వాడుతోందని ఓ సీనియర్ గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేశారు. వైజాగ్ కు చెందిన డాక్టర్ విద్యుల్లత తో పాటు డాక్టర్ రవి, డాక్టర్ ఉషను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. సికింద్రాబాద్ లోని ఉన్న ఆసుపత్రిని కేవలం కన్సల్టెన్సీగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఇక్కడ ఐవీఎఫ్ పేరుతో శాంపిల్స్ తీసుకుంటూ, మిగితా సరోగసి ప్రాసెస్ అంతా వైజాగ్ లో నిర్వహించినట్లు తెలిపారు. బాధితుల్లో ఒక ఎన్ఆర్ఐ జంట కూడ ఉండగా, వీరినుంచి భారీ మొత్తంలో డాక్టర్ నమ్రత డబ్బులు వసూలు చేసింది. మహిళా నిందితుల్లో చాలా మంది అండాలు అమ్ముకున్న వారు ఉండగా, మరికొందరు సరోగసి తల్లులుగా నటించిన వాళ్ళు ఉన్నట్లు తెలిపారు. ఎవరైన దంపతులు సరోగసి కోసం సెంటర్ కు అప్రోచ్ అవగానే వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఒక ఫేక్ అల్ర్టా సౌండ్ రిపోర్టు పంపుతారని, సరోగసి పద్దతిలో మీకు పుట్టబోయే పాప అంటూ స్కానింగ్ రిపోర్టు కూడ ఇస్తారని తెలిపారు. అదే సమయంలో నమ్రత ఏజంట్లు ఓ గర్బిణీని వెతికి పెడతారు. తొమ్మిది నెలల తర్వాత వైజాగ్ లో డెలివరీ చేసి, ఆ శిశువును సరోగసి ద్వారా పుట్టిన పాప అని దంపుతులను పూర్తిగా నమ్మించి, అప్పగిస్తారు.

ఇలా దాదాపు 50కి పైగా నకిటీ సరోగసి మోసాలు జరిగినట్లు తెలిసింది. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయన్నారు. డాక్టర్ నమ్రత మోసాలకు సంబందించిన 2010 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయని డీసీపీ తెలిపారు.  

  • అరెస్ట్ అయిన 25 మంది వీరే:

సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు, అడ్వకేట్ జయంత్ కృష్ణ, వైజాగ్ బ్రాంచీ మేనేజర్ కళ్యాణీ అచ్చాయమ్మ, ల్యాబ్ టెక్నిషియన్ చెన్నారావు,గాంధీ ఆసుపత్రి అనిస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్గుల సదానందం, ఏజంట్లు ధనశ్రీ సంతోషి,నందిని,బాబును విక్రయించిన దంపతులు అలీ అదిక్,నస్రీన్ బేగం,ఏజంట్ హర్షరాయ్,సూపర్ వైజర్ పవన్ మోహన కృష్ణ,నర్సు సురేఖ,ఏజెంట్ ఆషాబేగం,ఏజంట్ నయన్ దాస్,డాక్టర్ విద్యుల్లత,సబ్ ఏజంట్ షాహినా, గైనకాలజిస్ట్డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ రవి, జూనియర్ ఎంబ్రాలజిస్ట్ రమ్య,సబ్ ఏజెంట్ లు రత్నం,మీనాక్షి,మెయిన్ ఏజంట్ సరోజ,బర్త్ పేరేంట్ కరుణశ్రీ,సబ్ ఏజంట్ లు విజయ్ కుమార్, యమున లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

Tags

More News...

Local News 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక  ధర్మపురి ఆగస్టు 13 (ప్రజా మంటలు): ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మధు మహాదేవ్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషన్  ఎన్నికయ్యారు. స్థానిక కర్నె అక్కపెళ్లి కళ్యాణమండపంలో  రాష్ట్ర నాయకులు జె.సురేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సంగనభట్ల రామకృష్ణయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలచారి,ఆధ్వర్యంలో ఐ జే యు జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటీ...
Read More...
National  State News 

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు పాట్నా ఆగస్ట్ 12:మంగళవారం (ఆగస్టు 12, 2025)న విడుదల చేసిన ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, కొత్తగా ఓటర్ల నమోదు కోసం దాదాపు 64,000 దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. బీహార్ SIR: కొత్తగా దరఖాస్తులు దాఖలు చేస్తున్న ఓటర్లు డ్రాఫ్ట్ రోల్స్‌లో లేరా లేదా మొదటిసారి ఓటర్లా అనేది EC డేటా అస్పష్టంగా ఉంది...
Read More...
Local News 

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి సికింద్రాబాద్, ఆగస్టు 12 (ప్రజామంటలు): రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్బంగా రాష్ర్ట బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు మర్రి పురూరవరెడ్డికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తార్నాక లోని ఆయన నివాసంలో మర్రి పురూరవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.రాంచంద్రరావు...
Read More...
National  Local News  State News 

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్,  ఆగస్టు 12 (ప్రజా మంటలు)::ట్రాఫిక్ పోలీసులు మరొక చెట్టుకు పునర్జన్మ ఇచ్చారు. మహాంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్నీ జంక్షన్ సమీపంలో  ఉన్న ఓ పెల్టో ఫోరం చెట్టు కు సంబందించి విస్తరించిన కొమ్మల కారణంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్...
Read More...

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025  విద్యా సంవత్సరానికి గాను నిర్వహించబడే డిప్లమా  ఇన్ మ్యాజిక్ కోర్సులో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని వర్సిటి రిజిస్ర్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు , ఔత్సహిక కళాకారులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని సంబంధిత శాఖలో సమర్పించి నేరుగా...
Read More...
National  Local News  State News 

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్ *డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) : సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి...
Read More...
Local News  State News 

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ శస్త్రచికిత్స లేకుండా  ప్రోస్టేట్ క్యాన్సర్‌, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :  తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా...
Read More...
State News 

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్ హైదరాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : మిసెస్ క్రియేటీవ్–2019 మిసెస్ లావణ్య అదారి తన కలల డిజైనర్ బోటిక్ షాపును మంగళవారం సిటీలోని అత్తాపూర్ లో విజయవంతంగా లాంచ్ చేశారు. మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో పేరుతో ప్రాంభించిన బోటిక్ లో బ్రైడల్ కు సంబందించిన ఫ్యాషన్ దుస్తులు, చిక్ వెస్ర్టన్ ఔట్ ఫిట్స్,...
Read More...
Local News 

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం   ఇబ్రహీంపట్నం ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ 33/11కేవీ సబ్స్టేషన్ లో సామర్థ్యానికి మించి లోడు నమోదు అవుతున్న దృష్ట్యా రూ.85 లక్షలతో అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కావడం, మూడు రోజుల క్రితం సబ్స్టేషన్ కు  పంపించారు....
Read More...
Local News  State News 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు  హైదరాబాద్ ఆగస్ట్ 12: కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి రూ.15 వేల రూపాయలు సుజాత డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుని తీసుకుంటుండగా పట్టుకొన్నారు.
Read More...
State News 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి  అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 12: గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో...
Read More...
National  State News 

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 12:   'నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు, లక్నో మెట్రో విస్తరణ', ₹18541 కోట్ల విలువైన ప్రణాళికలను కేబినెట్ ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించారు. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్...
Read More...