ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్
శస్త్రచికిత్స లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స
సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :
తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా కిమ్స్ హాస్పిటల్స్ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ చికిత్సను డే కేర్ విధానంలో నిర్వహించారు.
ఇప్పటివరకు బహ్రెయిన్, దుబాయ్, మారిషస్లకు చెందిన ముగ్గురు విదేశీయులు సహా 13 మంది రోగులను విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా, భారత వైద్య రంగంలో పెరుగుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, వైద్య నైపుణ్య ప్రాముఖ్యతను కిమ్స్ ఆసుపత్రులు మరోసారి నిరూపించాయి. ప్రోస్టేట్ క్యాన్సర్మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలు ఇటీవలి కాలంలో పురుషుల్లో వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా వీటి కోసం క్లిష్టమైన శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అయితే, ఒక ముఖ్యమైన పురోగతిగా కిమ్స్ ఆసుపత్రులు తుల్సా-ప్రో (ట్రాన్స్యూరేథ్రల్ అల్ట్రాసౌండ్ అబ్లేషన్ ప్రోస్టేట్) సిస్టమ్ను పరిచయం చేశాయి. ఇది విప్లవాత్మకమైన ఎంఆర్ఐ మార్గదర్శకత్వం కలిగిన అల్ట్రాసౌండ్ఆధారిత చికిత్సా విధానం.
ఈ చికత్స ద్వారా ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండా ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆగ్నేయాసియాలో ఇదే మొట్టమొదటిగా నిలిచింది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రుల ఛైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు ఈ అత్యాధునిక పరికరాన్ని ప్రారంభించారు. ఇటువంటి ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతదేశానికి పరిచయం చేయడంలో తాము గర్వంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, “కిమ్స్లో మా రోగులకు ప్రపంచంలోని తాజా వైద్య విధానాలను చేరవేయడంలో కట్టుబడి ఉంది. తుల్సా-ప్రోతో, ఇప్పుడు మేము ప్రోస్టేట్ చికిత్సలో సంపూర్ణ సేవలను అందిస్తున్నాం. ఇందులో సాంప్రదాయ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, రోబోటిక్ విధానాలు, అలాగే ఇప్పుడు ఎటువంటి కోతలు అవసరం లేని చికిత్సలు ఒకే చోట లభిస్తాయి అని తెలిపారు. అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న రోగులకు అందించే వైద్య నైపుణ్యం, సేవల ప్రయోజనాలను కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు వివరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ యూరాలజీ మరియు శస్త్రచికిత్స బృందంలోని ప్రముఖులు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, డాక్టర్ కె.వి.ఆర్. ప్రసాద్, డాక్టర్ నీల్ నరేంద్ర త్రివేది తదితరులు హాజరయ్యారు.తుల్సా-ప్రోను పరిచయం చేయడంతో, కిమ్స్ ఆసుపత్రులు ప్రోస్టేట్ చికిత్సలో ఆసియా వ్యాప్తంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయి. ఇది సాంప్రదాయ శస్త్రచికిత్సకు సురక్షితమైన, ప్రభావవంతమైన, ప్రపంచ స్థాయి ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
