11 ఏండ్ల అభివృద్దిపై ఈనెల 22న ఎగ్జిబిషన్ - ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్, జూన్ 19 (ప్రజామంటలు):
11 ఏండ్ల బీజేపీ ప్రభుత్వ అభివృద్దిపై ఈనెల 22న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో ప్రత్యేక ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇంపీరియల్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా బీజేపీ ఎంపీని 4 లక్షల మెజార్టీతో మల్కాసిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారన్నారు. కేవలం 75 రోజుల్లోనే తనకు విజయాన్ని అందించారని అన్నారు. ఏడాది కాలంలో తన విజయాలు, సమస్యలు పోరాటల అంశాలపై ఎగ్జిబిషన్ లో పొందుపరుస్తామన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం ప్రజలను హైడ్రా పేరుతో బయపెట్టిందన్నారు.తాను మొదటి నుంచి పోరాటం చేసే వ్యక్తినని, మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం నిరుపేదలను ఇబ్బంది పెట్టే చర్యలను అడ్డుకున్నామన్నారు. సంవత్సర కాలంగా కంటి మీద కునుకు లేకుండా కష్టపడ్డానని, వికాసిత్ భారత్ కార్యక్రమంను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర నాయకులు సునీల్ బన్సారీ, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ ఈటల స్పందించారు.
క్యాబినెట్ లో చర్చ జరిగి, ఆమోదం లేకుండా ఏ పని జరగదన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అన్నారు. సుందిళ్ళ అన్నారం మేడిగడ్డ ప్రాజెక్ట్ లు రీడీజైన్ లో కేసీఆర్ చేర్చారన్నారు. అవనీతి జరిగితే విచారణ జరపాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని నమ్మకం లేదని, అందుకే తాము సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. రాష్ర్టంలో గత ప్రాజెక్ట్ లు పార్టీలకు ఏటీఎం లు గా మారాయని ఆరోపించారు. మొదట ఫిల్లర్ లు రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే పని పెట్టుకోవాలని ఎంపీ ఈటల రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ లు కట్టడం తప్పు కాదని, కాని వాటి పేరుతో అక్రమాలు చేయడం తప్పు అని ఎంపీ ఈటల అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
