ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు
భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం
వైద్యులు… కనిపించే దేవుళ్ళు
భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం
భీమదేవరపల్లి, జూలై 1(ప్రజామంటలు) :
వైద్యులు కనిపించే దేవుళ్ళు అని వినిపించే మాట, ప్రస్తుత కాలంలో మరింత మరింత స్పష్టంగా రుజువవుతోంది. రోగుల ప్రాణాలను కాపాడుతూ తన సేవలతో విశేష గుర్తింపు పొందుతున్న వైద్యులను గౌరవించేందుకు ప్రతి ఏడాది జూలై 1న డాక్టర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండల కెమిస్ట్ అండ్ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి, సుధాకర్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సుధాకర్, లిటిల్ ఏంజెల్ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ స్వామిరావును శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
ఈ సత్కార కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బొజ్జపూరి మురళి (శ్రీ మణికంఠ మెడికల్), మామిడాల రవీందర్ (రవీంద్ర మెడికల్), సుద్దాల జవహార్ (నవతా మెడికల్), రాజు (సుశ్రుత మెడికల్), యాదగిరి (కార్తికేయ మెడికల్), తౌటం రాజేష్ (మా సాయి దత్త మెడికల్), ఉడుత శ్రీనాథ్ (స్వస్తిక్ జనరిక్ ఫార్మసీ) తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల సేవలు అద్భుతమైనవని ప్రశంసిస్తూ, వారి సేవలను స్మరించుకునే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం హర్షాతిరేకాలను సంతరించుకుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నెలవారీ నేర సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,
