గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కమిటీ
పది మంది వైద్య నిపుణులతో కోవిడ్ కమిటీ ఏర్పాటు..
*60 కోవిడ్ బెడ్స్ తో మూడు వార్డుల ఏర్పాటు
సికింద్రాబాద్ మే 24 (ప్రజామంటలు):
హైదరాబాద్ లో కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పాలన యంత్రాంగం అప్రమత్తమైంది. సూపరింటెండెంట్ డా. రాజకుమారి చైర్మన్ గా ఆయా వైద్య విభాగాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో ప్రత్యేక కోవిడ్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 60 బెడ్లతో కూడిన 3 కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కే సునీల్ తెలిపారు. ఇందులో అత్యవసర వైద్య వసతులు కలిగిన 15 బెడ్ లతో స్పెషల్ వార్డు ను ఎమర్జెన్సీ విభాగం వెనక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలతో వచ్చిన పేషంట్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. అలాగే కేసులు పెరిగినట్లయితే వైరస్ వేరియంట్ ఏంటో తెలుసుకోవడానికి జీనోమ్ స్వీక్వేన్సింగ్ కై శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తామన్నారు.
కోవిడ్ కమిటీ ఏర్పాటు:
కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం శనివారం ఆస్పత్రిలోని ప్రధాన వైద్య విభాగాల హెచ్ ఓ డి లతో కోవిడ్ కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో చైర్మన్ గా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, నోడల్ ఆఫీసర్ గా జనరల్ మెడిసిన్ హెచ్ఓడి ఎల్. సునీల్ కుమార్ లు వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే సునీల్, ఆర్ ఎం ఓ 1 డాక్టర్ శేషాద్రి, ఫల్మనాలజీ హెచ్ఓడి డాక్టర్ కృష్ణమూర్తి, అనిస్తీసియా హెచ్ఓడి ఆవుల మురళీధర్, పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ వాసుదేవ్, గైనకాలజీ హెచ్ ఓ డి డాక్టర్ రాధా, మైక్రో బయాలజీ హెచ్ ఓ డి డాక్టర్ పూజ, డ్యూటీ ఆర్ ఎం ఓ తో పాటు పీజీ వైద్యులు ఉంటారు. కోవిడ్ పాజిటివ్ బాధితులు భవిష్యత్తులో గాంధీలో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో వారికి అందించే అత్యవసర వైద్యం, తదితర వసతులపై కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని డిప్యూటీ డాక్టర్ కే సునీల్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ పేషంట్ల కోసం గాంధీ లో వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ వార్డులు సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
