కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు
గొల్లపల్లి జూలై 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శంకర్రావుపేటకు చెందిన కీర్తిశేషులు ఎడమల ఎల్లారెడ్డి స్మారకార్థం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మనవడు ఎడమల భోజేందర్ రెడ్డి తాను చదువుకున్న మల్లన్న పేట ఉన్నత పాఠశాల పైన మమకారంతో విద్యార్థులకు ప్రోత్సకాలు అందజేశారు.
గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మల్లన్న పేట ఉన్నత పాఠశాలలో 544 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచిన లక్కాకుల వైష్ణవికి 10,000/- రూపాయలు, మరియు 542 మార్కులతో రెండవ స్థానం సాధించిన చందనకు 5,000/- రూపాయలు ప్రోత్సాహకంగా అందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు పేదరికం ఎప్పటికీ అడ్డు కారాదు అన్నారు.ఎడమల భోజేందర్ రెడ్డి అందించిన నగదు ప్రోత్సాహకం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ భవిష్యత్తులో తాము ఇంకా బాగా చదువుకోవాలనే తపన పెరుగుతుందన్నారు.
గత మూడు సంవత్సరాల నుండి భోజేందర్ రెడ్డి మలన్నపేట పాఠశాలలో పదవ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఇదే విధంగా నగదు బహుమతి అందిస్తున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా భోజేందర్ రెడ్డి కి మరియు వారి కుటుంబ సభ్యులకు పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో శంకర్రావుపేట గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, వారి బంధువులు మల్లారెడ్డి , కిషోర్, ఉపాధ్యాయులు కర్ణాకర్, రాజేశం, హరికృష్ణ, సత్య, రవీందర్, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, ప్రకాష్, స్రవంతి, నందయ్య, రాజనర్సయ్య పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు
