భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
నేటి నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు
రెండు రెవెన్యూ బృందాల నియామకం - ప్రత్యేక వెరిఫికేషన్ బృందాల ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
బుగ్గారం మే 05 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలంను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు
రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని అన్నారు. ఈ బృందాలు షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో ప్రతి రోజు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ప్రతి రోజు ఒక్కో బృందం ఒక గ్రామం చొప్పున రోజుకు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు.
ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో సంబంధిత యజమాని పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు,
వారసత్వ భూములు, భూస్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వేనెంబర్ మిస్సింగ్, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, సరిహద్దు సమస్యలు, పార్ట్ -బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు, పట్టా లేకుండా ప్రభుత్వ భూములు కబ్జా కలిగిన వివరాలు సేకరణ తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు.
భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు
రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందన్నారు.
అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి సహకారం అందించేందుకు వీలుగా దరఖాస్తులను వెంటది వెంట పరిశీలన జరిపేలా ప్రత్యేక వెరిఫికేషన్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
భూ సమస్యలు కలిగిన రైతులు, ప్రజలు ఈ సదస్సులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సూచించారు.
ఈనెల 5, 6 సోమ, మంగళ వారాలలో యశ్వంత రావుపేట, మద్దునూర్ గ్రామాలలో వేర్వేరు రెవెన్యూ బృందాలు రైతుల, ప్రజల నుండి భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు స్వీకరించి పరిశీలించ నున్నారు.
ఈనెల 7, 8 బుధ, గురు వారాలలో శేకల్ల, సిరికొండ గ్రామాలలో, 9, 12 తేదీలు అనగా శుక్ర, సోమ వారాలలో గంగాపూర్, వెలుగొండ గ్రామాలలో రైతుల, ఆయా గ్రామాల ప్రజల నుండి భూ సమస్యలపై పిర్యాదులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం సమస్యలను పరిష్కరించ నున్నారు. ఈనెల 13, 14 మంగళ, బుధ వారాలలో గోపులాపూర్, సిర్వంచ కోట, చిన్నాపూర్ గ్రామాల పరిధి భూ సమస్యలపై రైతుల, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, విచారణ జరిపించి చర్యలు చేపట్ట నున్నారు. చివరగా ఈనెల 15, 16 వ తేదీ గురు, శుక్ర వారాలలో బుగ్గారం మండల కేంద్రంలోని రైతుల, ప్రజల నుండి భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ప్రత్యేక విచారణ అనంతరం చర్యలు చేపట్టి రైతులకు, ప్రజలకు భూ సమస్యలు తీర్చ నున్నారు.
రెండు బృందాలుగా పర్యటన
బుగ్గారం మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ గా భూ భారతి ద్వారా రైతుల, ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం రెండు వేర్వేరు బృందాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ బృందం - 1 గా బుగ్గారం తహసీల్దార్ యం. ఎ. మాజిద్, గిర్దావర్ -1 ఎన్.బాపురెడ్డి, రికార్డ్ అసిస్టెంట్ యం.స్వామి, జూనియర్ అసిస్టెంట్ కె.సుధాకర్, మండల సర్వేయర్ ఆర్.పరమేశ్వర్ లను నియమించారు.
రెండో రెవెన్యూ బృందంగా ధర్మపురి తహసీల్దార్ సి.హెచ్.కృష్ణ చైతన్య, బుగ్గారం నాయబ్ తహసీల్దార్ పి.శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ సి.హెచ్.సురేందర్ రావు, జూనియర్ అసిస్టెంట్ పి.జనార్ధన్, రాయికల్ మండల సర్వేయర్ ఆర్.నవీన్ లను జిల్లా కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా తేదీలలో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు భూ సమస్యలపై తగు ఆధారాలతో సహా పిర్యాదులు అందజేసి సమస్యలను తొలగించు కోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
హాజరు కానున్న మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అడ్లూరి
భూ భారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారం కోసం పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించిన బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలలో జరుగ నున్న రెవెన్యూ సదస్సులలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో పాటు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.మధు సూదన్ తదితరులు హాజరు కానున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
