జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర
యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
భీమదేవరపల్లి ఏప్రిల్ 21 (ప్రజామంటలు) :
హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో డ్రగ్స్ నివారణ పోరు యాత్ర నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, డ్రగ్స్, మద్యం, పాన్ పరాక్ లాంటివి యువతను నాశనం చేస్తూ ఒక తరాన్ని తుడిచి పెట్టేస్తున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు అలవాటు పడిన పిల్లల కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందని, జలగలు రక్తాన్ని పీల్చినట్లు ఈ వ్యసనం కుటుంబ ఆర్థిక పరిస్థితులను పీల్చివేసి నాశనం చేస్తుందన్నారు. అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యం దెబ్బతిని, కుటుంబంలో ప్రశాంతత సంపూర్ణంగా నాశనం అవుతుందన్నారు. పోనీ వీటికి దూరంగా ఉందామంటే ఓ వైపు బెల్ట్ షాపులు, మరోవైపు గ్రామ గ్రామాన విస్తరించిన డ్రగ్స్ వల్ల గ్రామాలలో తీవ్ర సమస్య ఏర్పడిందన్నారు. తప్పనిసరిగా ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయాల్సి ఉందన్నారు. హుస్నాబాద్ జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై పోరుయాత్ర చేపట్టడం అభినందనీయమని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం మాణిక్యపుర్ ,గాంధీనగర్ మొదలుకొని రత్నగిరి మరియు రంగయ్యపల్లె,వంగర లలో జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం,హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి , భీమదేవరపల్లి మండలం జేఏసీ చైర్మన్ డ్యాగాల సారయ్య, నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, భీమదేవరపల్లె మండల ఏపిఎం దేవానందం,మరియు చెప్యాల ప్రకాష్, సతీష్, సదానందం, నాగమణి , కర్ణాకర్ బాలసుందర్ సీసీలు,ఉప్పుల కుమారస్వామి, మాట్ల వెంకటస్వామి ,గాండ్ల పద్మ ,దండు లక్ష్మి, శ్రీదేవి, షబానా , ఎదులాపురం తిరుపతి, ప్రొఫెసర్ వీరన్న నాయక్, తాళ్లపల్లి ఆశీర్వాదం, జగన్ ,ఐలయ్య మాజీ సర్పంచ్ రాజయ్య, తాళ్ల పెళ్లి కుమార్ , గ్రామాల మహిళా అధ్యక్షులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
