ఎంపీ ఈటలకు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలి
సికింద్రాబాద్, ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
మల్కాజిగిరి ఎంపీ,సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ కు తెలంగాణ రాష్ర్ట భారతీయ జనతా పార్టీ అద్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ అఖిల భారత ముదిరాజ్ కోలి సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు పార్టీ అగ్రనాయకులను కోరారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, బడుగు బలహీన వర్గాల ప్రజల నాడీ తెలిసిన ఈటల రాజేందర్ రాష్ర్ట బీజేపీ సారథి పోస్టుకు అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు రాష్ర్ట కేబినేట్ మంత్రిగా, ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో హెల్త్ మినిస్టర్ గా ప్రాణానికి తెగించి రాష్ర్టానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట సాధనలో ఈటల రాజేందర్ పాత్ర చిరస్మరణీయమన్నారు. రాష్ర్ట జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఈటల రాజేందర్ కు రాష్ర్ట బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇస్తే , ముదిరాజ్ లకు సరైన గౌరవం దక్కినట్లు తమ కమ్యూనిటీ భావిస్తుందని అన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ లు, కాని పక్షపాతం గాని చూపకుండా, అందరిని ఒకే విదంగా చూస్తూ, అందరితో మమేకంగా వ్యవహరించే ఈటల రాజేందర్ కు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇవ్వాలని పొట్లకాయల వెంకటేశ్వర్లు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లకు బుధవారం పంపిన లేఖ లో కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
