రాజీవ్ యువ వికాసం పథకంలో అధికారుల లాలుచీ
*ముడుపులు ఇస్తేనే ఆదాయ, కుల సర్టిపికెట్లు
*సికింద్రాబాద్ రెవిన్యూ ఆఫీస్ లో అధికారుల నిర్వాకం
*ఆర్టీవో కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
సికింద్రాబాద్ ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
యువతకు స్వయంఉపాధి రుణాలిచ్చి, వారికి జీవనోపాధి చూపించే ప్రభుత్వ ప్రతిష్మాత్మక రాజీవ్ యువ వికాక పథకం అధికారుల పాలిట కామథేనువు లా మారింది. ఆదాయ,కుల దృవీకరణ పత్రాల జారీకి సికింద్రాబాద్ మండల రెవిన్యూ సిబ్బంది దరఖాస్తులదారులు డబ్బులు ఇవ్వనిదే పత్రాలు ఇవ్వడం లేదని బన్సీలాల్ పేట కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి సికింద్రాబాద్ ఆర్టీవో సాయిరామ్ కు బుధవారం ఫిర్యాదు చేశారు.
డిప్యూటీ తహసీల్దార్, ఇతర అధికారులకు బన్సీలాల్ పేట డివిజన్ కు చెందిన పలువురు దరఖాస్తు దారులు డబ్బులు పంపిన గూగుల్ పే, ఫోన్ పే స్క్రీన్ షాట్ లను ఆర్టీవోకు అందచేశారు. అనర్హుల నుంచి డబ్బులు తీసుకుంటున్న రెవిన్యూ అధికారులు ఫీల్డ్ ఎంక్వేరీ ఏమీ చేయకుండానే ఆదాయ దృవీకరణ పత్రాలను జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో నిజమైన పేద, మద్య తరగతి ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని వారు వాపోయారు. లంచం డబ్బులిచ్చిన వారికి రూఒక లక్షా90 వేలు, డబ్బులివ్వకపోతే రూ 2.20 లక్షల ఆదాయ సర్టిఫికెట్లను ఇస్తున్నారని వారు ఆరోపించారు. దాంతో అర్హులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాస పథకాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు. తాను కుల, ఆదాయ సర్టిఫికెట్ కోసం వారం రోజుల నుంచి ఆఫీస్ నుంచి తిరుగుతున్నప్పటికీ అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వలేదని, చివరికి డిప్యూటీ తహసీల్దార్ రంజనికి రూ 500 ఫోన్ పే చేస్తే, అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారని, బన్సీలాల్ పేట కు చెందిన మోసెస్ వాపోయారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లను అందచేయాలని ఐత చిరంజీవి, సాయి సందీప్, మోసెస్, అబ్దుల్ కలీమ్ లు ఆర్డీవో కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆర్డీవో తప్పనిసరిగా ఈ వ్యవహరంపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని వారు పేర్కొన్నారు.
ఏసీబీ అధికారులు కూడ సికింద్రాబాద్ మండల రెవిన్యూ సిబ్బంది లంచాల డిమాండ్, స్వీకరణపై పోకస్ పెట్టాలని, తాము ఇచ్చిన ఆదారాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
