అమాయకపు రైతులకు సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు కాజేసిన ముఠా అరెస్ట్ - జగిత్యాల డిఎస్పి రఘు చందర్
గొల్లపల్లి( పెగడపల్లి) ఫిబ్రవరి17 (ప్రజా మంటలు):
అమాయకపు రైతులకు సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
పెగడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన చంద్రమౌళి బతికేపల్లి గ్రామానికి చెందిన మల్లేశం చింతకిందు కిషోర్ అనే వ్యక్తులు ముగ్గురు కలిసి NAPS అనే సంస్థ ద్వారా, రైతులకు 40% పర్సెంట్ సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని బతికేపల్లి నందగిరి గ్రామంలోని ఆరుగురు అమాయకపు రైతులను నమ్మించి వారి వద్ద నుంచి దాదాపు 36 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందులో నుండి దాదాపు 10 లక్షల వరకు డౌన్ పేమెంట్ గంగాధర లోని శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి ప్రోద్బలంతో వారికి ట్రాక్టర్లు ఇప్పించి, అమాయకపు రైతులకు తెలియకుండా సబ్సిడీ కోసమని వారి సంతకాలు తీసుకొని ఈఎంఐ కట్టుకునే విధంగా పై ముగ్గురు కలిసి పథకం వేశారు.
మిగిలిన సుమారు 26 లక్షల రూపాయలను తలో కొంత మొత్తంలో తమ సొంత అవసరాలకు వాడుకొని రైతులను మోసం చేసిన మన్నె మల్లేశం చింతకింది కిషోర్ కామెర చంద్రమౌళి అను వ్యక్తులను పెగడపల్లి పోలీసులు సీఐ మల్యాల నీలం రవి ఎస్సై రవికిరణ్ లు సోమవారము పట్టుకొని జగిత్యాల కోర్టు ముందు ప్రవేశపెత్తారు. అదే గ్రామం లోని కామెర చంద్రమౌళి కి చెందిన NAPS అనే ప్రైవేట్ సంస్థపై మంచిర్యాల లో చాలామంది రైతులను మోసం చేసినందుకు గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని అదేవిధంగా పెగడపల్లి మండల ప్రాంతంలో కూడా పైన తెలిపిన విధంగా ఈఎంఐ క్రింద ఆరుగురు అమాయకపు రైతులకు ట్రాక్టర్లు ఇప్పించినట్లు మరియు వారిని మోసగించుటలో సహకరించిన శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి పై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు జగిత్యాల డిఎస్పి శ్రీ రఘు చందర్ సిఐ నీలం రవి, ఎస్ఐ రవికిరణ్, తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
