వరదల్లో కొట్టుకపోయిన, తడిసిపోయిన పాస్ బుక్, ఆధార్ కార్డులకు కొత్తవి అందిస్తాం - సిఎం రేవంత్ రెడ్డి
వరదల్లో కొట్టుకపోయిన, తడిసిపోయిన పాస్ బుక్, ఆధార్ కార్డులకు కొత్తవి అందిస్తాం - సిఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం సెప్టెంబర్ 03:
ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయిన, పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను అదేశించారు.
* పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆకేరు వాగు వరద ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను, అక్కడి తండాలను పరిశీలించారు. సీతారాంపురం తండాలో బాధిత కుటుంబాలతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసానిచ్చారు.
* ఆకేరు వాగు పొంగిన ప్రతిసారీ సీతారాం తండాతో పాటు పక్కనే ఉన్న మరో రెండు తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ మూడు తండాలను కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు అందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహం, నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనాలు వేసి కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
* వాగు ఉధృతిలో కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదంటూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
