విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
మెట్ పల్లి జూలై 4 (ప్రజా మంటలు)
ప్రస్తుత వర్షా కాలంలో బ్రేక్ డౌన్ తదితర సందర్భాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సత్వరం స్పందించి మరమ్మతులు చేపట్టక విద్యుత్ పునరుద్ధరణ సకాలంలో చేయకపోతే కఠినమైన చర్యలు తప్పవని జగిత్యాల జిల్లాఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం పేర్కొన్నారు.
మెటుపల్లి లో నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త కనెక్షన్లు పౌర సేవా పత్రం అనుసరించి వేగంగా విడుదల చేయడం ప్రధాన అంశాలని, తదనుగుణంగా పురాతన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ లలో లోపాలు సరిదిద్ది, నెట్వర్క్ ను ఆధునీకరించాలని, తద్వారా శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ వ్యవస్థ ను బలోపేతం చేయాలని, నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించడానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు.
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల ను మార్చే ప్రక్రియలో సిబ్బంది విధిగా ఉండాలని, రైతులను అట్టి పనులకు పురమాయించి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు.
గత నెలరోజుల్లో మెటుపల్లి డివిజన్ లో సంభవించిన విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకూడదని, అందుకు సిబ్బంది అన్ని ముందస్తు రక్షణ చర్యలు గైకొనాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల్లోగా ఏఈలు తమ కార్య క్షేత్రంలో మొత్తం సిబ్బందిని ఒకేచోట సమావేశపరిచి రక్షణ సామగ్రి వాడకంపై అవగాహన కల్పించి విలువైన తమప్రాణాలు, ప్రజలు, పశువుల ప్రాణాల రక్షణకు ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, డిఈ టెక్నికల్ గంగారం, ఏడీఈలు మనోహర్, రఘుపతి, ఏఈ లు రవి, ప్రదీప్, శివకుమార్, అజయ్ తదితరులు, ఏఏఓ భూమయ్య, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
