బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

On
బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ జూలై 05:

సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో “నిస్సహాయకులకు అండగా - లైంగిక దాడికి గురైన పిల్లల రక్షణ మరియు హక్కులు” అన్న అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

 ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.“పిల్లలపై జరుగుతున్న హేయమైన నేరాలను నియంత్రించడమే కాకుండా బాధితులకు చట్టపరంగా, నైతిక పరంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇంకా, బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. వారి రక్షణ కోసం తెలంగాణలో భరోసా ప్రాజెక్టును చేపట్టాం. భరోసా ప్రాజెక్టు కింద ప్రస్తుతం 29 కేంద్రాలు పనిచేస్తున్నాయబి తెలిపారు.

 ఈ కేంద్రాల ద్వారా బాధితులకు పోలీసు సహకారమే కాకుండా న్యాయపరమైన, వైద్యపరమైన సహాయం అందించడంతో పాటు సానుకూల వాతావరణంలో వారికి అవసరమైన కౌన్సెలింగ్‌ వంటి సేవలను అందిస్తున్నాయి.

IMG-20250705-WA0012 హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈ కోర్టుల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం కల్పించడం, భవిష్యత్తులో వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించాం.

 పోక్సో చట్టం (POCSO Act), జువెనైల్ చట్టాల (Juvenile Justice Act) ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలి. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి వేదన కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలి. న్యాయం కేవలం కోర్టుల్లోనే లభించాలనే కాకుండా, ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ వారికి అవసరమైన అండదండలు లభించాలి. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో పాటు అన్ని దశల్లోనూ బాధితులకు న్యాయం దక్కాలి, రక్షణ కల్పించాలి.

న్యాయం దక్కడం అంటే కేవలం దోషులకు శిక్షలు విధించడం వరకే సరిపోదు. బాధితుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. వారికి అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు ఉండాలి. వారి బాల్యాన్ని తిరిగి పొందేలా చర్యలు ఉండాలి.

అత్యంత హేయమైన ఇలాంటి నేరాలను నియంత్రించడంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, పౌర సమాజంలోని ఇతర భాగస్వామ్య సభ్యులందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం.

 జరిగిన అన్యాయంపై తమ గొంతు వినిపించలేని వారికి అండగా నిలవాలన్న ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించడం ఎంతో అవసరం. అందుకు న్యాయ వ్యవస్థ సభ్యులు, పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పౌర సమాజానికి అభినందనలు...” అని అన్నారు.

 ఈ ప్రారంభ సదస్సులో యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెకాఫ్రే, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు, పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు పౌర సమాజంలోని భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు.

Tags

More News...

Local News 

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

చదువుతోపాటు సంస్కారం అందించాలి  -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్    జగిత్యాల జూలై 5 : (ప్రజా మంటలు) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు.  సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు రూ. ఒక లక్ష విలువైనడెస్క్లను అందజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...
Read More...
Local News 

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక *"  జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)   పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు...
Read More...
Local News 

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ    జగిత్యాల జూలై 5(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  సూచన మెరకు ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ, అపోలో రీచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తేదీ: 8.7.2025 మంగళవారం రోజున ఉదయం 9గంటల నుండి
Read More...
Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...
Local News  State News 

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్‌‌ సంతాపం సిరిసిల్ల జూలై 05: సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల  రిపోర్టర్  ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి  పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి...
Read More...
Local News  State News 

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు   -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి   (చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్) హైదరాబాద్ జూలై 05: తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు. రాబోయే...
Read More...
Local News 

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ మాస బోనాల జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దాదాపు 2వేల5వందల  కిలోల వివిధ కూరగాయలతో అమ్మవారి ఆలయమంతా అలంకరణ చేసినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల అలంకరణతో ఆలయం కొత్తరూపం సంతరించుకుంది. ఈ...
Read More...
Local News 

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

 పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో శుక్రవారం శ్రీసాయి సప్తాహం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే  ఈ ఉత్సవ వేడుకల్లో మొదటి రోజున సాయిబాబా సన్నిధిలో ఉదయం శ్రీసాయి పంచఫలరసాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీసాయి లక్ష్మీ గణపతి సేవ...
Read More...
Local News 

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు.. సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) : ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది....
Read More...
Local News 

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన -గాంధీ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి మూడు రోజుల శిక్షణ శిభిరం సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లోని ఎన్ఎంసీ( నేషనల్ మెడికల్ కమిషన్) ఆధ్వర్యంలో  గాంధీమెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ కి బేసిక్ కోర్సు ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2025 ఐదవ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్...
Read More...