చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక  దీపావళి పండుగ

On
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక  దీపావళి పండుగ


జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు)
చీకట్లను చీల్చి వెలుగులు మిరజిమ్మే వేడుకే దీపావళి పండుగ సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం. ఎటుచూసినా దీపాల సొబగులతో
అంబరాన్నంటే సంబరాలతో హైందవులు దీపావళి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనేది దీపావళి వేడుకలు  

ఆశ్వీయుజ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య,, ఈ మూడు రోజులకు అత్యంత ప్రాధాన్యం ఉంది సనాతన ధర్మంలో ఆశ్వీయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి ధన త్రయోదశి, నరకచతుర్దశి, అమావాస్య ఈ మూడు రోజుల్లో సాయంకాల సమయాన దీపాలను ఇంటి వద్ద, ఆలయాల వద్ద, గోశాల వద్ద వెలిగించడం లక్ష్మీ ప్రదం భాద్రపదమానం లో మొదలయ్యే పితృదేవతారాధనకు ఈ దీపావళితో దీపాల ద్వారా వీడ్కోలు పలకడం జరుగుతుంది

నరక చతుర్దశి రోజు సూర్యుడు తుల రాశిలో, చంద్రుడు కూడా చిత్త స్వాతి నక్షత్రం తులారాశి లో ఈవిధంగా రవిచంద్రులిద్దరూ తుల రాశిలోనే ఉండటం జ్యోతిషశాస్త్రం ప్రకారం అత్యంత విశేషమైనది.. దీపావళి రోజు తెల్లవారు జామున తలస్నానం ఆచరించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది తులారాశిలో సూర్యుడు సంచరించే సమయంలో నదుల్లోని నీటిలో శక్తి దాగి ఉంటుందనీ.. ఆ నదీ ప్రవాహంలో గానీ, సముద్రంలో గానీ తలస్నానమాచరించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేద వైద్యం పేర్కొంటోంది.

అందువల్ల నరక చతుర్దశి /దీపావళి రోజున తల స్నానమాచరించడం సనాతనంగా వస్తున్న ధర్మం. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తమతమ అత్త మామల ఇళ్ళకు వెళ్ళి హారతులు తీసుకుని భోగి స్నానాలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం .
మానవులను
చీకటి నుంచి వెలుగు వైపు.. నడిపించేదే దీపావళి . చీకటి అజ్ఞానానికి, నిరాశకు ప్రతీక కాంతి.. ఆనందానికి సూచిక దీపం ఐశ్వర్యం అంధకారం దారిద్య్ర్యం అజ్ఞానము అనే  చీకట్ల నుంచి విజ్ఞానము ఐశ్వర్యం అనే వెలుగులోకి పయనింపజేయడమే దీపావళి పండుగ ఉద్దేశం 
. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉన్నదని.. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం జ్ఞానానికి, త్రిమూర్తులకు ప్రతీక. అందుకే సనాతన ధర్మంలో ప్రతీ శుభకార్యంలో దీపాన్ని వెలిగిస్తారు.

పురాణాల ప్రకారం.. దీపావళి పండుగ తో నరకాసుర సంహార గాథ, బలి చక్రవర్తి రాజ్య దానం, విక్రమార్కుని పట్టాభిషేకం ముడిపడి ఉన్నాయి. ఆశ్వీయుజ చతుర్దశి రోజు నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సంహరించడం వల్ల దీపావళి ఏర్పడిందని. పురాణాలు చెబుతున్నాయి. బలి చక్రవర్తి మహా విష్ణువుకు రాజ్యదానం చేసింది ఈ సమయంలోనే, అలాగే, విక్రమార్కుడికి పట్టాభిషేకం జరిగిన సమయం కూడా ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి 
శాస్త్ర ప్రకారంగా చూస్తే.. దీపావళి ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి)ధన త్రయోదశి మొదటి రోజు, నరకాసురుడి సంహారం జరిగిన నరక చతుర్దశి రెండో రోజు: ఆశ్వీయుజ అమావాస్య దీపావళి మూడోరోజు. బలి చక్రవర్తి పాతాళంలోకి ప్రవేశించిన రోజు బలి పాడ్యమి నాలుగో రోజు. అలాగే, కార్తీక శుక్ల ద్వితీయ /యమ ద్వితీయ ఈరోజు యమ ధర్మరాజుని ప్రార్ధిస్తారు.  భగినీ హస్త విదియ  రామాయణం ప్రకారం.. రామ భరతుని యొక్క సమాగమం దీపావళి తో ముడిపడి ఉంది. రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యకు చేరి భరతుడిని కలిసింది దీపావళి రోజే అని రామాయణం పేర్కొంటుంది. దీన్ని ఉత్తరాదిలో భరత్ మిలాప్ వేడుకగా జరుపుకొంటారు.

అభ్యంగన స్నానం, దీపారాధన, ఇంటి ఇలవేల్పు పూజ, లక్ష్మీపూజ దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మి ఆరాధన చేస్తారు. సనాతన ధర్మంలో దీపావళి అమావాస్య రోజంటే... రామాయణంలో రాముడు అయోధ్యకు వచ్చిన రోజు, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. మహాభారతంలో
నరకాసురుడిని వధించిన రోజు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు. విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చు ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలి.

చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ జగిత్యాల

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ నిజామాబాద్ అక్టోబర్ 20 (ప్రజా మంటలు): నిజామాబాద్ లో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి కారణమైన నిందితుడు రియాజ్, ఆస్పత్రిలో జరిగిన కాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.  ఈనెలలో జరిగిన ఘటన నుండి తప్పించుకొని పారిపోయిన రియాజ్ ను నిన్న, సారంగాపూర్ దగ్గర పోలీసులు పట్టుకొన్నారు. ఈసందర్భంగా జరిగిన పెనుగులాటలో రియాజ్ కు గాయాలైనట్లు,అందుకే ప్రభుత్వ...
Read More...

ఉక్రెయిన్‌ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్‌ ఒత్తిడి

ఉక్రెయిన్‌ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్‌ ఒత్తిడి ట్రంప్-జెలెన్స్కీ విలేకరుల సమావేశంలోని 7 ముఖ్యాంశాలు వాషింగ్టన్‌ అక్టోబర్ 20:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీపై రష్యా ప్రతిపాదనలను అంగీకరించమని ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ అంగీకరించకపోతే “పుతిన్‌ దేశాన్ని నాశనం చేస్తాడు” అని ట్రంప్‌ బెదిరించినట్లు పత్రికలు ఆదివారం రాశాయి. సమాచారం ప్రకారం, గత శుక్రవారం...
Read More...
National  International  

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా? న్యూయార్క్ అక్టోబర్ 20: ప్రపంచ ఆర్థిక సంక్షోభాల మూలాలు చాలా సార్లు ఆర్థిక సడలింపుల దశల్లోనే విత్తనాల్లా నాటబడతాయి. చరిత్ర చూపినట్టుగా, వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, సడలింపు ఆర్థిక విధానం కొనసాగిన తర్వాత వాటి కఠినతరం దశే పెద్ద సంక్షోభాలకు దారితీసిందను మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు....
Read More...
Local News 

చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక  దీపావళి పండుగ

చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక  దీపావళి పండుగ జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు)చీకట్లను చీల్చి వెలుగులు మిరజిమ్మే వేడుకే దీపావళి పండుగ సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం. ఎటుచూసినా దీపాల సొబగులతోఅంబరాన్నంటే సంబరాలతో హైందవులు దీపావళి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనేది దీపావళి వేడుకలు   ఆశ్వీయుజ త్రయోదశి,...
Read More...
State News 

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం    *డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ వైఎంసీఏ చౌరస్తా వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులో ఘోర ప్రమాదం తప్పింది.గోపాలపురం ఎస్.ఐ మాధవి తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి జూబ్లీ బస్...
Read More...
National  Comment 

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం   బీహార్ ఎన్నికలపై ప్రత్యేక కథనం NDA - INDIA కూటములలో తిరుగుబాట్లు నిరుద్యగం, ఓటర్ల జాబితాలో లోపాలు ప్రశాంత్ కిషోర్ సైంధవ పాత్ర    పట్నా, అక్టోబర్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే నెలలో కఠినమైన పోటీ ఎదురవుతోంది. రాష్ట్రంలో యువ...
Read More...
Local News 

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన  శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక    జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం తేదీ 1 నవంబర్ 2025 కార్తీక శుద్ధ త్రయోదశి నుండి సోమవారం 3 తేదీ వరకు. జరిగే ప్రతిష్ట కార్యక్రమం శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ నందీ ధ్వజస్తంభ పున ప్రతిష్ట, రాత్రి కార్తీక...
Read More...
Local News 

బిసి సంక్షేమ సంఘం  జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

బిసి సంక్షేమ సంఘం  జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి  ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య    జగిత్యాల అక్టోబర్ 19(ప్రజా మంటలు) జగిత్యాల పట్టణం కి చెందిన మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మిని జాతీయ బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా నియమించినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు  ఆర్. కృష్ణయ్య తెలిపారు.  ఆదివారం హైదరాబాద్ లోని కార్యాలయం లో కృష్ణయ్య లక్ష్మీకి నియామాకాపు...
Read More...

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ "లొంగుబాట్లు విప్లవాన్ని ఆపలేవు; అంతిమ విజయం ప్రజలదే" మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పత్రికా ప్రకటన  హైదరాబాద్‌, అక్టోబర్ 16 (ప్రజా మంటలు):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, అలాగే ఉత్తర సబ్‌జోనల్ బ్యూరో...
Read More...
National  International  

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయిల్ కాల్పుల ఉల్లంఘన గాజా సిటీ, అక్టోబర్ 19 (ప్రజా మంటలు)అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్‌తో ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ సైన్యం కనీసం 47 సార్లు ఉల్లంఘనలు జరిపి, 38 మంది పలస్తీనియన్లు మృతి చెందగా 143 మంది గాయపడ్డారు అని గాజా మీడియా కార్యాలయం ప్రకటించింది....
Read More...
State News 

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అక్టోబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ...
Read More...
Local News 

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి   ఇన్స్పెక్టర్.   జి నాగరాజు సికింద్రాబాద్, అక్టోబర్ 19 (ప్రజా మంటలు):  దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్ స్పెక్టర్ జీ. నాగరాజు సూచించారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు,బ్లాంకెట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల...
Read More...