ధర్మపురిలో వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
దక్షిణ కాశిగా హరిహర క్షేత్రంగా, దివ్యనారసింహ క్షేత్రంగా, దక్షిణాభిముఖియై ప్రవహిస్తున్న పవిత్ర గోదావరీ తీరాన వెలసి భక్తి ముక్తి ప్రదాయినిగా, వరదాయినిగా పారాణిక, చారిత్రిక, ఐతిహాసిక ప్రాధాన్యతను సంతరించుకున్న వైవిధ్య భరిత పలు దేవాలయాల సముదాయంతో విరాజిలు తున్న పుణ్యతీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో సోమ వారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభ మైనాయి. ధార్మిక క్షేత్రంలో సకల దేవాలయాలలో నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఆలయాలలో సంప్రోక్షణలు గావించి, దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించగా, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించిన భక్తజనం స్థానిక దైవాలను దర్శించు కున్నారు. దేవస్థానంలోని ప్రధానాల యాలైన శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీ వేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర ఆలయాలలో ఉదయం కలశ స్థాపన, మహా సంకల్పం, పృథ్వీ, గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, రుత్విగ్వరణం, అఖండ దీపస్థాపన నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, యోగినీ, అంకురారోపణ, మాతృకా, నవగ్రహ పూజలు సర్వతోభద్ర మండల స్థాపనం, దేవీ కలశ స్థాపనం, సప్తశతి పారాయణం, స్థాపిత దేవతా పూజలు, లలితా సహస్ర నామావళి స్తోత్రాలతో పూజలు ప్రారంభించారు.
చతుష్షష్టి ప్రత్యేక పూజలు, శ్రీ చక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయ పూజలను నిర్వహించారు. కన్యకా, సువాసిని పూజలు జరిపారు. అమ్మ వారు "శైలపుత్ర ఎరుపు రంగు చీరలో మలెపూలు, బిల్వపత్రి దండలు ధరించి భక్తులకు దర్శనం ఇచ్చింది. దేవస్థానం ఏసీ ఈఓ శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తలు,సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పర్యవేక్షణలో, వేదపారాయణ దారులు బొజ్జ రమేష్ శర్మ, సిహెచ్. ముత్యాల శర్మ, భరత్ శర్మ, నారాయణ శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్యులు, అర్చకులు ద్యావళ్ళ విశ్వనాథ శర్మ, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, ఋత్వికులు నంబి అరుణ్ కుమార్, పాలెపు సందీప్ శర్మ, పాలేపు చంద్రమౌళి, బలరాం శర్మ, అలువాల కిష్టయ్య, ద్యావళ్ళ సాయి శర్మ అర్చకులు కార్యక్రమాలను జరిపించారు. సిబ్బంది సహకరించారు. భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం దేవీ పూజ, సుహాసిని కన్యకా పూజ, హారతులు, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
శ్రీనర్మదేశ్వర మందిరంలో, మేళ తాళాలతో, మంగళ వాద్యాలతో, వేద మంత్రోచ్ఛాటనలతో పురవీధుల గుండా ఊరేగింపు జరిపిన అనంతరం దుర్గా మాత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డీటీడీ కణ్యాణ మంటపంలో నవదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రారంభ దిన పూజలు నిర్వహించారు. అలాగే చింతామణి చెరువు కట్ట మీద మొదటిసారి మహా శక్తి సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా దేవి ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు.
సాయంత్రము 6.00 గం.లకు శ్రీ యోగ, ఉగ్ర నృసింహస్వామి వార్ల ఊరేగింపు అశ్వవాహనంపై గ్రామములోని పురవీధులలో తిరిగి దేవాలయమనకు విచ్చేశాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
