రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం

On
రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం

 సూర‌త్ నుంచి హైద‌రాబాద్‌కు 1300 కిలోమీట‌ర్ల రోడ్డు ప్రయాణం
 * వెంటిలేట‌ర్ మీద పెట్టి 1.1 కిలోల శిశువును తీసుకొచ్చిన వైద్యులు
 * ప్రపంచంలో ఇలాంటి సుదీర్ఘప్రయాణం ఇప్పటికి 723 కిలోమీట‌ర్లే
 * కిమ్స్ క‌డ‌ల్స్ లో శిశువుకు సంపూర్ణ చికిత్స‌.. పూర్తిగా కోలుకున్న బాబు
 * ఇది గిన్నిస్ రికార్డు అవుతుందంటున్న వైద్యనిపుణులు

సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :

 అది గుజ‌రాత్‌లోని సూర‌త్ న‌గ‌రం. అక్కడున్న ఓ తెలుగు కుటుంబానికి నెల‌లు నిండ‌క‌ముందే, అంటే ఏడో నెల‌లోనే ఒక మ‌గ‌బిడ్డ పుట్టాడు. కానీ కేవ‌లం 1.1 కిలోల బ‌రువు మాత్రమే ఉన్న ఆ శిశువుకు.. అనేక ఆరోగ్యప‌రమైన స‌మ‌స్యలు త‌లెత్తాయి. తీవ్రమైన సెప్సిస్‌, ఊపిరి అంద‌క‌పోవ‌డం, శ‌రీరంలో ప‌లు అవ‌య‌వాలు ప‌నిచేయ‌క‌పోవ‌డం లాంటివి వ‌చ్చాయి.

దాంతో అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించ‌డం మొద‌లుపెట్టినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆ బాబు తండ్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్  ఆస్పత్రిని సంప్రదించారు. ఎయిర్ అంబులెన్సులో తీసుకొద్దామ‌ని ప్రయ‌త్నించినా, ఆ తండ్రి ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా రోడ్డు మార్గంలో తీసుకురావాల్సి వ‌చ్చింది. అలా తీసుకొచ్చిన బృందానికి మార్గద‌ర్శక‌త్వం వ‌హించి, ఇక్కడ ఆ బాబుకు చికిత్స అందించి, పూర్తిగా కోలుకునేలా చేసిన కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రి క్లినిక‌ల్ డైరెక్టర్, చీఫ్ నియో నాటాల‌జిస్ట్ డాక్టర్ బాబు ఎస్. మ‌దార్కర్ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను సోమవారం విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు.

ఓ చిరుద్యోగికి ఈ క‌ష్టం వ‌చ్చింది. అక్కడినుంచి ఇక్కడ‌కు తీసుకురావ‌డానికి ఎయిర్ అంబులెన్సు ఖ‌ర్చు తాను భ‌రించ‌లేన‌ని ఆయ‌న చెప్పడంతో రోడ్డు మార్గంలో తీసుకురావాల‌ని నిర్ణయించాం. అయితే, అంత త‌క్కువ బ‌రువుండి, నెల‌ల నిండ‌క‌ముందే పుట్టి, అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న శిశువును రోడ్డు మార్గంలో తీసుకురావ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్నప‌ని, 1300 కిలోమీట‌ర్ల దూరం ఉండ‌డంతో సుమారు 14-16 గంట‌ల ప్రయాణం అవుతుంది. అంత‌సేపూ బాబును వెంటిలేట‌ర్ మీదే ఉంచాలి. అందుకు చాలా ఆక్సిజ‌న్ అవ‌స‌రం అవుతుంది. అందుకోసం బాబును తీసుకొచ్చే అంబులెన్సే కాకుండా, వెన‌కాల మ‌రో అంబులెన్సును కూడా పెట్టాం. అందులో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు ఉన్నాయి. దారిలో నాసిక్‌లోను, మ‌రికొన్నిచోట్ల సిలిండ‌ర్లు మార్చుకున్నాం. 

మ‌ధ్యమ‌ధ్యలో బాబుకు శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బంది, గుండె కొట్టుకునే రేటు మార‌డం లాంటి స‌మ‌స్యలు త‌లెత్తాయి. అయినా నిపుణులైన వైద్యులు, న‌ర్సింగ్ సిబ్బంది కూడా అంబులెన్సులో ఉండ‌డంతో వెంట‌నే వాటిని స‌రిచేయ‌గ‌లిగారు. అంత సుదూర ప్రయాణం కావ‌డంతో సిబ్బంది కూడా కొంత అనారోగ్యం పాల‌య్యారు. కొంద‌రికి వాంతులు అయ్యాయి, నీర‌స‌ప‌డ్డారు. అయినా బాబును సుర‌క్షితంగా సికింద్రాబాద్ చేర్చాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో అంతా క‌లిసి క‌ష్టప‌డ్డారు. ఎందుకైనా మంచిద‌ని మొత్తం మూడు బృందాలుగా వైద్యులు, న‌ర్సుల‌ను పంపాం. ఈ బృహ‌త్ ప్రయ‌త్నంలో మొత్తం 31 మంది సిబ్బంది పాల్గొన్నారు. కిమ్స్ కడల్స్ మరియు రెడ్ హెల్త్ అంబులెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు మార్గం ద్వారా చిన్నారిని తరలించడంలో సహకరించారు. అలాగే 15 మంది వైద్యులు, న‌ర్సులు, బ‌యోమెడిక‌ల్ సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది, 11 మంది బ్యాక్ ఎండ్ నిపుణులు, ఐదుగురు ప‌రోక్ష స‌హాయ సిబ్బంది ఉన్నారు. వీరంతా నిర్విరామంగా క‌ష్టప‌డి బాబును సుర‌క్షితంగా సూర‌త్ నుంచి సికింద్రాబాద్ చేర్చారు. ఈ మార్గంలో కిమ్స్ అనుబంధ ఆస్పత్రులు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందించ‌డం, ఇత‌ర సాయం చేయ‌డం కూడా చాలా ఉప‌యోగ‌ప‌డింది. ఇక్కడ‌కు వ‌చ్చిన త‌ర్వాత ప‌రీక్షిస్తే, బాబుకు మ‌ల్టీ ఆర్గాన్ స‌మ‌స్యలు ఉన్నాయి. దాదాపు రెండు నెల‌ల పాటు బాబును ఆస్పత్రిలో ఉంచి మంచి చికిత్స చేశాం. దాంతో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. 1.9 కిలోల బ‌రువుకు చేరుకున్నాడు. వెంటిలేట‌ర్, ఆక్సిజ‌న్ తీసేసినా సాధార‌ణంగానే ఉన్నాడు. త‌ల్లిపాలు తాగుతున్నాడు. వాళ్ల తాత కుటుంబం ఇక్కడే ఉండ‌డంతో కొన్నాళ్లు న‌గ‌రంలోనే ఉంటారు. మ‌ధ్యమ‌ధ్యలో ఫాలో అప్ ప‌రీక్షల‌కు రావ‌ల్సి ఉంటుంద‌ని చెప్పాం. బాబు ఏడుస్తూ, ఆడుకుంటూ బాగా చురుగ్గా ఉన్నాడు. ప్రపంచంలో ఇప్పటివ‌ర‌కు ఇలా రోడ్డుమార్గంలో నెల‌లు నిండ‌ని శిశువుల‌ను తీసుకొచ్చిన గ‌రిష్ఠ దూరం కేవ‌లం 723 కిలోమీట‌ర్లు మాత్రమే. అదే మ‌న దేశంలో అయితే అది 513 కిలోమీట‌ర్లే. అందువ‌ల్ల ఇది గిన్నిస్ రికార్డు అవుతుంది అని డాక్టర్ బాబు ఎస్. మ‌దార్కర్ వివ‌రించారు.బాబును తీసుకొచ్చిన బృందంలో డా స‌తీష్‌, డా రియాన్, డా  సంతోష్, చిన్నా బ్రద‌ర్, స‌న‌ల్ బ్రద‌ర్, అంబులెన్సు పైల‌ట్లు ఆనంద్, మోహ‌న్ ఉన్నారు. ఆస్పత్రితోపాటు కిమ్స్ ఫౌండేష‌న్ త‌ర‌ఫున సహాయం అందించిన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర‌రావు, మెడిక‌ల్ స‌ర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, ఆస్పత్రి సీఈఓ డా అభిన‌య్ బొల్లినేని త‌దిత‌రులంద‌రికీ బాబు తండ్రి కృత‌జ్ఞత‌లు తెలిపారు. త‌న బాబును కంటికి రెప్పలా కాపాడి, క్షేమంగా అప్పగించిన కిమ్స్ యాజ‌మాన్యానికి, వైద్యుల‌కు, న‌ర్సింగ్ సిబ్బందికి ఆయ‌న కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత  శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు  బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము
Read More...
Local News 

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా  పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...
Local News  Crime 

జగిత్యాలలో యువతి ఆత్మహత్య

జగిత్యాలలో యువతి ఆత్మహత్య జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు): స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి...
Read More...
Local News 

డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ

డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)దూప, దీప నైవేద్య జగిత్యాల జిల్లా సర్వ సభ్య సమావేశం స్థానిక ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న డీడీఎన్ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ డీడిఎన్ అర్చకుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని...
Read More...
Local News 

ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ,జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15 మందికి...
Read More...
Local News 

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ...
Read More...
Local News 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.  జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.    జగిత్యాల ఆర్డీవో మధుసూదన్     జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం  లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి...
Read More...