పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ - సేవ భూషణ్ జాతీయస్థాయి పురస్కారం-2025
సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శతాధిక కవులకు ఘన సన్మాన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పలువురికి అవార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తాల పద్మ జలంధర్ గౌడ్ దంపతులకు సేవా భూషణ్ జాతీయ స్థాయి ఆవార్డును లయన్ డా. జి మహేంద్ర కుమర్, డిస్ట్రిక్ట్ గవర్నర్, 320-ఎ, లయన్ డా. ఇ.యస్. సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.
అనంతరం సేవా భూషణ్ జాతీయ అవార్డు గ్రహీత జలంధర్ గౌడ్ మాట్లాడుతూ..ఈ అవార్డు తనకు రావడం ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉందనీ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతని పెంచుతుందనీ అన్నారు.ప్రస్తుతం పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం అనేక విషపూరితమైన వాయువుల వల్ల పర్యావరణం ప్రకోపించడం ఓజోన్ పొర మందగించి పోవడంతో సూర్యుడు ద్వారా వచ్చే కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల జీవకోటి అనారోగ్య పాలవుతుంది తెలిపారు. ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు వర్షం పడుతుందో అనేది తెలియకుండా పోతుందనీ వెల్లడించారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందనీ అన్నారు.
దానిని అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ, తమ పుట్టినరోజు పెళ్లిరోజు మరియు ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా ప్రయత్నం చేసినట్లయితే. పచ్చదనాన్ని పెంచుకోవడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకట్ట వేసినవారమవుతామనీ అలాగే ప్రతి ఇంటి వద్ద, షాపుల వద్ద మొక్కలను, చెట్లను పెంచే వారికి ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు ఇస్తే అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తాల ఫౌండేషణ్ సభ్యులు మక్తాల పద్మవతి, కె. వెంకటేష్, అంజనేయులు, ఎ. కృష్ణ తదితరులు పాల్గోన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
