మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ శ అశోక్ కుమార్ 

On
మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ శ అశోక్ కుమార్ 

 
జగిత్యాల ఆగస్ట్ 12 ( ప్రజా మంటలు)
 మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
 
 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 27 లక్షల విలువగల 144 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
 
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ  అన్నారు.
 
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 27 లక్షల విలువగల 144 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
 
 
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1268 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు.
 
సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారుల ను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.
 
అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. 
 
ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లుఅజర్ లను జిల్లా ఎస్పీ  అభినందించారు.
 
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతిక ఉపయోగించి పోయిన సెల్ఫోన్ల ను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ కి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
 
*ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతులను ఉపయోగించి వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.* 
 
ఆన్‌లైన్ డెలివరీ మోసాలు* – అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీల ప్రత్యేక ఆఫర్ రోజులలో ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడం, నకిలీ వెబ్‌సైట్లు ద్వారా మోసాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా బలవుతున్నారు. అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే ఆర్డర్ చేయాలి.
 
*లోన్ మోసాలు*– రైతులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లోన్ యాప్స్, వ్యక్తులు తప్పుడు వాగ్దానాలతో డబ్బు మోసం చేస్తున్నారు. అనుమతి లేని యాప్స్‌కు లేదా అపరిచితులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దు.
*నకిలీ కస్టమర్ కేర్ మోసాలు* – వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు నకిలీ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి OTP, బ్యాంక్ వివరాలు చెప్పడం వల్ల భారీ నష్టాలు చవిచూస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ లేదా బిల్లులోని నంబర్లను మాత్రమే ఉపయోగించాలి.
 
. *స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు* – స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా మోసగాళ్లు డబ్బు దోచుకుంటున్నారు. అధికారికంగా నమోదు అయిన బ్రోకరేజ్ సంస్థల ద్వారానే పెట్టుబడి పెట్టాలి.
 
5. *పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలు* – ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో తప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం గుర్తింపు ఉన్న ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించాలి.
 
ప్రజలు ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.
 
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం  హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ అజర్ ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags

More News...

Local News  State News 

రాష్ట్రంలోని  భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి 

రాష్ట్రంలోని  భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 13: రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ స‌ద‌స్సుల్లో వార‌స‌త్వ‌, ఇత‌ర మ్యుటేష‌న్ల‌కు సంబంధించి స్వీక‌రించిన ద‌రఖాస్తుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి రెవెన్యూ శాఖ...
Read More...
Local News 

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు సికింద్రాబాద్, ఆగస్ట్ 13 (ప్రజామంటలు) : పోలీసుల ప్రతిష్టను మరింత పెంపొందించేలా క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నిబద్దతతో  విధులు నిర్వహించాలని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌ పేర్కొన్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్  నుంచి సిటీలోని పలు ఠాణాలకు ట్రాన్స్ఫర్  అయిన ఒక ఏఎస్‌ఐ, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం వీడ్కోలు కార్యక్రమం...
Read More...
National  State News 

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు 

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 13: సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ ఎం. కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్ నియామకాలను రద్దు చేస్తూ ఆగస్టు 13, 2025న సంచలన తీర్పు వెలువరించింది. ఈ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ మరియు కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై...
Read More...
Local News 

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్గ్ 13 (ప్రజామంటలు) : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ బుధవారం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ లో ప్రభుత్వం నుంచి మంజూరైన సబ్సిడీ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలను ఆర్థికంగా నిలబెట్టడం కోసమే ప్రభుత్వం...
Read More...
Local News 

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం  నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం  నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య):   గొల్లపల్లి ఆగస్టు 13  (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల యువకులు గతకొంతకాలంగా క్రీడా మైదానానికి స్థలం లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం  మంత్రి  దృష్టికి తీసుకెళ్లగా వెంటనే  స్పందిస్తూ, రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్‌లతో చర్చించి, క్రీడా మైదాన నిర్మాణం కోసం ఏడు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రొసీడింగ్...
Read More...
Local News 

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల  అశోక్ 

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల  అశోక్  జగిత్యాల ఆగస్ట్ 13 ( ప్రజా మంటలు)స్థానిక ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాలలో నేడు డ్రగ్స్ మరియు మత్తుపదార్థాలపై విద్యార్థులు మాస్ ప్రతిజ్ఞ చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య  అశోక్ హాజరయ్యారు.   ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశంలో మత్తు పదార్థాల విషయంలో, కేంద్ర...
Read More...
Local News 

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఆగస్ట్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ,జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై సర్దార్ సర్వాయి పాపన్న...
Read More...
Local News  State News 

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ అడ్వకేట్ రామారావు ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ సికింద్రాబాద్, ఆగస్ట్ 13 (ప్రజామంటలు) : అమానవీయ పరిస్థితులలో సంగారెడ్డి జిల్లా నాగుల గిద్ద మండలంలోని మునియా నాయక్ తండాలో   కౌషి బాయి అనే గిరిజన గర్భిణీ మహిళ ప్రసవించిన సంఘటన తెలిసిందే.  ఎలాంటి రవాణ సౌకర్యాలు, సరైన రోడ్డు లాంటి మౌళిక వసతులు ఏవీ...
Read More...
Local News 

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు. భద్రత చర్యలో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలలో సమగ్ర తనిఖీలు. (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్...
Read More...
Local News 

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా  తిప్పర్తి రాజకుమార్

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా  తిప్పర్తి రాజకుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పట్టణంలో శ్రీ గాయత్రి మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఎన్నికల నిర్వహించారు అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్ ఉపాధ్యక్షులుగా, మారుపాక లింగబాబా ఎదులాపురం నరసింహచారి దుంపెట్ సందీప్ ప్రధాన కార్యదర్శిగా సజ్జనకు రవి సహాయ కార్యదర్శిగా ఇందూరు నిరంజన్ చారి కోశాధికారిగా కోటి నీలకంఠం గౌరవాధ్యక్షులుగా...
Read More...
Local News  Crime 

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఇబ్రహీంపట్నం ఆగస్టు 13( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వరరావు పెట్ గ్రామ శివారులో గల వరద కెనాల్ నందు గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చినది. మృతదేహం ఎత్తు అందాద 5.2 ఉండి, నీలం రంగు డబ్బాలుగల షర్టు, నీలం రంగు కాటన్ జీన్స్ మరియు ప్యాంటు లోపల...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు ఇబ్రహీంపట్నం  ఆగస్టు 13 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులతోఎంఇఓ బండారి మధు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని  ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు పాఠశాల స్థాయి...
Read More...