ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శని వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని ప్రతీతి. ధర్మపురిలో దక్షిణ వాహినిగా ఉన్న గౌతమి యందు దక్షిణాభిముఖులై, స్నానాలు ఆచరిస్తే నరసింహుని దర్శిస్తే, నరక బాధలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యమ ధర్మరాజును దర్శించే భక్తుల సంఖ్య, నానాటికీ అధికమ వుతున్నది. ఇటీవల సంభవి స్తున్న అనూహ్య ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా, అకాల మృత్యు నివారణకై అధర్వణ వేదంలో పేర్కొనబడిన "ఆయుష్య సూక్తం" ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే భరణి నక్షత్రం, చతుర్దశి తదితర ప్రత్యేక దినాల సంధర్భంగా, అభిషేకం, ఆయుష్య సూక్తం, యమ సూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్తం, జ్వర హర స్తోత్ర పఠనాలు, రోగ నివారణ సూక్తాలు పూజలు, యమాష్ట కాది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శని వారం యమ ధర్మరాజుకు విశేష అర్చనలు, పూజాదులు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి, ముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతున్న హరిహర క్షేత్రమైన ధర్మపురిలోని, సమస్త భారతావని లోనే అపురూపంగా వెలసిన, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో భాద్రపదమాస అంతర్గత భరణీ నక్షత్రంతో కూడిన సందర్భంగా మహా సంకల్ప యుక్త అభిషేకం, ఆయుష్య సూక్తం, యమసూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్త పఠనాది ప్రత్యేక పూజాది కాలను, అనంతరం జ్వరహర స్తోత్రము రోగ నివారణ సూక్తములచే పంచామృత అభిషేక యమాష్టక పఠనం, హారతి మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణాది ప్రత్యేక కార్యక్రమాలను దేవస్థానం పక్షాన నిర్వహించారు.
దేవస్థానం కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ , ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్, వేద పండితులు బొజ్జా రమేష్ శర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ , ప్రదీప్ కుమార్ , వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్ అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్, రాజగోపాల్, సిబ్బంది అర్చకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు. అకాల మృత్యు బాధ రాహిత్యానికి, దీర్ఘ ఆయువుకై ప్రత్యేకంగా గోత్ర నామములతో ఆయుష్య సూక్త యుక్త పూజలను నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
