జల్సాలకు మరిగి...చైన్ స్నాచింగ్ బాట పట్టిన యువకుడు
చివరికి రైల్వే పోలీసులకు చిక్కిన ప్రైవేట్ ఎంప్లాయి..
77గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం
సికింద్రాబాద్, ఆగస్టు 11 (ప్రజామంటలు):
లేనిపోని జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఓ వైపు ప్రైవేట్ జాబ్ చేస్తూనే..ప్రవృత్తిగా బంగారు చైన్ల దోపిడి బాట పట్టి, చివరికి రైల్వే పోలీసులకు చిక్కాడు..అతడి నుంచి రూ7లక్షల 70వేల విలువ చేసే 77 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ డీఎస్సీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...ఏపీ కాకినాడ జిల్లా శంఖవరం మండటం జగ్గంపేట కు చెందిన కోరుప్రోలు లవరాజు(23) గత రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు జీవనోపాధికై వచ్చాడు.
జీడిమెట్ల పరిధిలోని సూరారంలో నివాసం ఉంటూ హెటిరో ల్యాబ్స్లో రూ23వేల జీతంతో జూనియర్ కెమిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో మద్యం, సిగరేట్లు,ఆన్లైన్ బెట్టింగ్గేమ్స్ యాప్ లకు బానిస అయిన లవరాజుకు నెలవారీ జీతం డబ్బులు సరిపోలేదు. ఈ నేపద్యంలో ఓసారి సొంతూరు కు వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన లవరాజు కు అక్కడున్న జనం రద్దీని చూసి గోల్డ్ చైన్ స్నాచింగ్ స్కెచ్ వేశాడు. స్నాచింగ్ చేస్తే, తన జల్సాలకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవచ్చని నిర్ణయించుకున్నాడు. తన స్కెచ్ లో భాగంగా ఫిబ్రవరి 26న సింహపురి ఎక్స్ప్రెస్, ఆగస్ట్ 2న గౌతమి ఎక్స్ప్రెస్లో బంగారపు గొలుసుల చోరి చేశాడు. రైల్వే ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు డీఎస్పీ జావెద్, ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్, ఎస్ఐ సుబ్బారెడ్డి లు ఆర్పీఎఫ్ పోలీసులతో కలసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.
సోమవారం ఉదయం 7 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. గతంలో పలు చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మూడు చైన్లను దొంగిలించగా, రెండింటిని విక్రయించిన నిందితుడు ఒక్కదానిని సూరారం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీ లో తాకట్టు పెట్టాడు. నిందితుడి వద్ద రూఏడు లక్షల డెబ్బై వేల విలువ చేసే 77గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ను స్వాధీనం చేసుకొని, నిందితుడు లవరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
