విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

On
విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం 

 

మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు)

రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.

అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న స్థలాలను కనుగొని వాటిని సరిదిద్ధి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

క్షేత్రస్థాయి ఇంజనీర్లు మరియు సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించారు.

మనుషుల ప్రాణాలు చాలా విలువైనవని, భవిష్యత్తులో ఒక్క ప్రాణం కూడా అస్తవ్యస్తమైన నెట్వర్క్ వల్ల పోవడానికి వీలులేదని, అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

ప్రమాదాలకు కారణాలుగా భావిస్తున్న ముఖ్యమైన పారామితులు (వల్నరబుల్ లొకేషన్లు) ఇవీ...

అస్తవ్యస్తంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్లు, తుప్పు పట్టి పాడైపోయిన ఎర్తు పైపులు, వంగిపోయిన స్తంభాలు, వదులుగా వేలాడుతున్న తీగలు, రెండు స్తంభాల మధ్య డెబ్బై మీటర్ల కంటే ఎక్కువ నిడివి ఉన్న వాటి నడుమ మద్యంతర స్తంభాలు, సిమెంటు ఊడిపోయి ఇనుప రాడ్లు తేలిన స్తంభాలు, ఇరువైపుల నుండి విద్యుత్ సరఫరా కలిగియున్న ఫీడర్ల యొక్క డబల్ ఫీడింగ్ పాయింట్ల వద్ద ఒక స్పాన్ లో విద్యుత్ నిర్వీర్యం చేయడం, ఒకే స్తంభం పై ప్రయాణిస్తున్న హెచ్టి-ఎల్టీ లైన్ల మధ్య దూరం కనీసం ఐదు అడుగులు ఉండేలా చూడడం, ఇళ్లకు దగ్గరగా, ఇండ్ల మీదుగా వెళ్లే లైన్లను కనీస దూరానికి మార్చి మనుషులు షాక్ కు గురికాకుండా చూడడం, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల వెంట లైన్లు క్రాస్ అయినప్పుడు భూమి నుండి ప్రామాణిక ఎత్తును పాటించడం, ఎత్తు తక్కువగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలను పెంచడం, సిబ్బంది స్వయం రక్షణ జాగ్రత్తలు తీసుకోవడం.. ఇలా 12  ముఖ్యమైన సమస్యలుగా గుర్తించారు. 

నడుం బిగించిన యంత్రాంగం 

గత రెండు మూడు రోజుల నుండి డివిజన్ వ్యాప్తంగా ప్రతి సెక్షన్లో స్థానిక క్షేత్ర స్థాయి సిబ్బంది తాము గుర్తించిన సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసి వాటిని సరిదిద్దే పనికి ఉపక్రమించారు. చిన్న పనులు సిబ్బంది నిర్వహిస్తూ, పెద్దవాటిని కాంట్రాక్టర్ల ద్వారా చేపిస్తూ రోజువారీగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ సెక్షన్లో ప్రతిరోజు ఏ పని జరుగుతున్నది అన్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనులు వేగవంతం చేయడానికి యాజమాన్యం దిశా నిర్దేశం చేస్తున్నది.

 ఈ పనుల వల్ల చేకూరే ప్రయోజనాలు

ఏళ్ళ తరబడి పేరుకుపోయిన పాత నెట్వర్క్ ను సరిదిద్దడం వల్ల విద్యుత్ ప్రమాదాలనుండి మనుషులను, మూగజీవాలను రక్షించవచ్చు. ముఖ్యంగా విద్యుత్ సంస్థ పట్ల వినియోగదారుల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. సంస్థ పేరు ఇనుమడిస్తుంది. జాతీయ స్థాయిలో డిస్కంల పనితీరు మెరుగు పడటం వల్ల పరపతి రేటింగ్ పెరిగి ప్రభుత్వాలు, వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతిమంగా వినియోగదారులే లబ్ది పొందుతారు.

 పొలం బాట

క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా రైతుల వద్దకే వెళ్ళి మాట్లాడి తక్షణం పరిష్కరించడానికి ప్రతీ వారం ఒక రోజు పొలం బాట కార్యక్రమం రూపొందించబడింది. అధికారులు, సిబ్బంది, కార్మికులు గుర్తించబడిన ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లైన్ లను సరిదిద్దడం వల్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ సమస్యలు, సామర్థ్యం పెంపుదల, అదనపు ట్రాన్స్ఫార్మర్ల మంజూరు, కొత్త కనెక్షన్ల విడుదలలో వేగం, రైతులు విద్యుత్ సిబ్బంది కి సమాచారం లేకుండా, స్వయంగా ట్రాన్స్ఫార్మర్లపై ఫ్యూజ్ లు మార్చే  ప్రక్రియలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయడం, ఆ పనులకు ఖచ్చితంగా స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వడం మొదలగు జాగ్రత్తలు, విషయాలు రైతుల దృష్టికి తేవడం జరుగుతుంది. ఈ పొలం బాట మంచి సత్ఫలితాలను ఇస్తుందనడంలో సందేహం లేదు.

ఇది నిరంతర ప్రక్రియ: జి.మధుసూదన్, డిఈ, మెట్టుపల్లి

విద్యుత్ యాజమాన్యం ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తూ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఇది నిరంతర ప్రక్రియ గా కొనసాగిస్థాం. స్వయం రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా పని చేసే సిబ్బందిని గుర్తించి వారి జీతం నుండి రూ.3 వేలు కోత విధిస్తున్నాం అన్నారు.
గొప్ప భవిష్యత్తుకు పునాది: దురిశెట్టి మనోహర్, ఏడీఈ, మెటుపల్లి

ప్రతీ గ్రామంలో చేపడుతున్న ప్రమాదకర నెట్వర్క్ ను సరిదిద్దె ప్రక్రియ ఒక మంచి పరిణామం. రాబోయే కాలంలో విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తగ్గించాలనేదే మా లక్ష్యం. అందుకు సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు. ఈ పనుల ద్వారా వినియోగదారులు, రైతుల అభిమానం చూరగొంటాం అన్నారు.

Tags

More News...

National  State News 

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు న్యూఢిల్లీ ఆగస్టు 10: CBSE తీసుకున్న పెద్ద నిర్ణయం వల్ల, ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు ఓపెన్ బుక్ తో పరీక్ష రాయగలరు;CBSE తదుపరి విద్యా సంవత్సరం 2026-27 నుండి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఓపెన్ బుక్ అసెస్‌మెంట్ (OBA) పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద, విద్యార్థులు భాష, గణితం, సైన్స్...
Read More...
Local News  State News 

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల ఆగస్టు 10 (ప్రజా మంటలు):   జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, బీసీ లను...
Read More...
Local News  State News 

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కి కరప్షన్ గనిగా మారిన సింగరేణి - దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది సింగరేణి కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి తెలంగాణ జాగృతి...
Read More...
Local News 

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్, ఆగస్టు 10 (ప్రజా మంటలు):  చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని మెట్టుగూడ వద్ద గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడ మెట్రో పిల్లర్ నంబర్ 1084 వద్ద గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 55- 60) డెడ్‌బాడీ పడి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు వెళ్లి...
Read More...
Local News  State News 

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు   వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, క‌వాసాకి డిసీజ్‌లు వ‌చ్చే ప్రమాదం  వీటిని జాగ్రత్తగా గ‌మ‌నించి స‌త్వర చికిత్సలు అందించాలి    లేనిప‌క్షంలో ప్రాణాల‌కే ప్రమాదం వాటిల్లే అవ‌కాశం    ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణుడు ప్రొఫెస‌ర్‌ సుర్జీత్ సింగ్‌  సికింద్రాబాద్, ఆగస్ట్ 10 (ప్రజామంటలు) : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో ఉండే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌య‌టి నుంచి వ‌చ్చే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది....
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు సికింద్రాబాద్  ఆగస్టు 10 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై దుర్భర జీవనం గడుపుతున్న అనాధలకు, నిరాశ్రయులకు మేము ఉన్నాము.. అని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్లు అండగా నిలిచారు. రక్షాబంధన్ పండుగ వేడుకల సందర్భంగా అందరూ వేడుకలు చేసుకుంటుంటే అనాధల వద్దకు వెళ్లిన వీరు మీకు మేము  ఉన్నామని అంటూ...
Read More...
National  International  

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు అదే దారిలో ఇండియా,కెనడా దేశాలు మాడ్రిడ్ ఆగస్ట్ 09: F-35 విమానాలను స్పెయిన్ తిరస్కరించింది, US జెట్ ఒప్పందం నీరుగారిపోయింది, ట్రంప్ కలలు చెదిరిపోయాయి. గతంలో అమెరికాతో ఎఫ్ 35 జెట్ ఫైటర్ విమానాల కొనుగోలో ఒప్పందంను స్పెయిన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.అమెరికా నుండి F-35 కొనుగోలును కెనడా పునరాలోచించుకుంటోంది స్పెయిన్ చర్య ఇతర దేశాల ప్రాధాన్యతలు...
Read More...
National  Local News  State News 

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం న్యూఢిల్లీ ఆగస్ట్ 09: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలిలో, ఆగస్టు 5, 2025 మంగళవారం, రోజున కురిసిన వర్షానికి,  మేఘావృతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది; విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శనివారం నాటికి హెలికాప్టర్లను ఉపయోగించి 825...
Read More...
Local News  State News 

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :   రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్  స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు వారికి...
Read More...
Local News  Spiritual   State News 

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరిసికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):   రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి  క్షీణిస్తున్న ప్రస్తుత  రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం వివరాలు...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం     మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు) రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న...
Read More...
Local News 

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు.  దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన .  జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు) పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి  దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు...
Read More...