రోడ్డుపై బైఠాయించి విరసన తెలుపుతున్న నల్లగుట్ట వాసులు
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన
దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళన
కాంగ్రెస్ గుండాల దాడులు అంటూ ముద్రించిన ఫ్లెక్సీల ప్రదర్శన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 07 (ప్రజా మంటలు)
అకారణంగా ఇంట్లోకి చొరబడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గొల్లపల్లి నల్ల గుట్టకు చెందిన పలువురు గొల్లపల్లి పోలీస్ స్టేషన్కు ఎదుట బయట రోడ్డుపై బైఠాయించి గురువారం ఆందోళన నిర్వహించారు.
గొల్లపల్లి మండలంలో అమాయకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని, నిందితులను అరెస్టు చేయడంలో చూపుతున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసన అంటూ ముద్రించిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ జగిత్యాల ధర్మారం ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
కాలనీకి చెందిన పలువురు మహిళలు యువకులు పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై ఆందోళన నిర్వహించారు .దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది సుమారు గంట పాటు రోడ్డుపై నిరసన తెలుపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా నల్లగుట్ట ప్రాంతానికి చెందిన దండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ నెల 4వ తేదీన ఇంట్లోకి అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేస్తూ భౌతిక దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచారని వారు తెలిపారు.

ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడుతున్నప్పటికి పోలీసులు నిందితులను అరెస్టు చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో అదేరోజు దాడి చేసి గాయపరచాలని ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఇప్పటికే అరెస్టు చేయకుండా అరెస్టు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎందుకంటే నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు
ఆందోళన కారుల వద్దకు వచ్చిన ఎస్సై వారిని శాంత పరచడానికి యత్నించగా అందుకు వారు ససిమేరా అంటూ భీష్మించు కూర్చున్నారు నిందితులకు తగు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి కది లేదు అంటూ ఆందోళన కొనసాగించారు. సమాచారం తెలుసుకున్న ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి తరలివచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు నిందితులను అరెస్టు చేసి బాధితుడికి న్యాయం చేస్తామని ఆందోళన విరమించాలని బాధితుడు బంధువులతో మాట్లాడినప్పటికీ వారు శాంతించలేదు.
దీంతో సీఐ బాధితుడు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు .ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసు ను దింపారు నిందితులు పరారీ లో ఉన్నారని వారిని వెతికి పట్టుకొని రిమాండ్ కు తరలించి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 08 (ప్రజామంటలు): :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ... పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర
వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
*కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా
సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు.... జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
**
జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు) భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ... స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ * ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సి.ఐ సుధాకర్ మాట్లాడుతూ.... ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం
జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు.
సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి... అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్లో హ్యాష్ట్యాగ్
కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం... తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.
సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3... వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ఇందిరాభవన్లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్గా ఉన్న రామస్వామి... మేడ్చల్–మల్కాజ్గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత
ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,”
తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్పల్లి ప్రెస్ మీట్
కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
మేడ్చల్–మల్కాజ్గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లిలో జరిగిన... “ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్
“స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు”
హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు):
ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల... న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్
మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు.
సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన... 