కొండగట్టులో కోతులకు శాశ్వత ఆహారంకై మొక్కలు నాటిన రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థులు 

On
కొండగట్టులో కోతులకు శాశ్వత ఆహారంకై మొక్కలు నాటిన రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థులు 

సహకరించిన నేచర్ లవర్ ఫౌండేషన్, అటవీశాఖ అధికారులు 

మల్యాల ఆగస్ట్ 07 (ప్రజా మంటలు):

కొండగట్టులో కోతులకు భవిష్యత్తులో శాశ్వత ఆహారం అందించడానికి మొక్కలు నాటాలనే సంకల్పంలో రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థుల ముందడుగు వేశారు.కొండగట్టు ప్రాంతంలో కోతులకు శాశ్వత ఆహారం అందించాలని ఒక సదుద్దేశంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు నేచర్ లవర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అల్లనేరేడు ,రేగు, సీతాఫల్ ,మేడి, చింత లాంటి అనేక రకాల 500కు పైగా పళ్ళ మొక్కలను నాటారు.

 ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు మొక్కలు నాటే  కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి దర్శనానికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ క్రమంలో చాలామంది  ప్రతిరోజు కోతులకు ఆహారాన్ని అందించినప్పటికీ వాటికి సరిపోయేంత ఆహారం లభించకపోవడం లేదా ప్రతిరోజు  భక్తులు ఆహారాన్ని అందించకపోవడం ద్వారా అడవిలో ఉండాల్సిన వానరాలు ప్రజా క్షేత్రంలోకి వస్తున్నాయి.

ఇలా రోడ్లపైకి రావడం వల్ల యాక్సిడెంట్ రూపంలో గానీ సరియైన ఆహారం లభించకపోవడం వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంది పూర్వకాలం నుండి అన్ని పురాణాల ప్రకారం కోతుల నుండి మనుషులుగా మారిన మనం ప్రతిరోజు ఎన్నో అవసరాల నిత్య అటవీ ప్రాంతాలను నరికి వేస్తూ అటవీ ప్రాంతాలలో లభించే పళ్ళ మొక్కలను మానవ అవసరాల నిమిత్తం వాటిని నరికి వేయడం ద్వారా రాబోయే రోజులలో వాటికి ఆహారం లభించడం చాలా కష్టమవుతుంది కాబట్టి భవిష్యత్తులో రాబోయే కారణాన్ని గుర్తించి ముందుగానే నేచురల్ లవర్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా శాశ్వతంగా కోతులకు ఆహారాన్ని అందించాలంటే, ఇప్పటినుండే అడవి ప్రాంతంలో వివిధ రకాల పళ్ళ మొక్కలను నాటి, వాటిని సంరక్షిస్తే అవి రాబోయే రోజులలో కోతులకు సరిపోయే ఆహారాన్ని అందించడానికి వీలవుతుందని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

IMG_20250807_182204

ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ఎస్వి విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ గారు మరియు రామకృష్ణ విద్యాసంస్థల డైరెక్టర్ పి నరేష్ గారు రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రాజేందర్ గారు శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముసపట్ల రాజేందర్ గారు మరియు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపు మునీందర్ రెడ్డి గారు మరియు నేచర్ లవర్ ఫౌండేషన్ నిర్వాహకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అటవీ రేంజర్ గులాం మొయినుద్దీన్, దేవస్థానం సూపరింటెండెంట్ 
సునీల్ కుమార్, ఉపరేంజ్ అధికారి R . మోనిక, అటవీశాఖ ఉద్యోగులు T.రత్నమ్మ, E.ప్రవీణ్ కుమార్,G.రాజేశం, N.మహేందర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే ప్రతీ సంవత్సరం,ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి విద్యా సంస్థ తీసుకుని, సంవత్సరంలో ఒకరోజు ప్రతి విద్యార్థిచే ఒక మొక్క నాటించే కార్యక్రమాన్ని తీసుకోవాలని సూచించారు.

ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నేచర్ లవర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న విద్యార్థులు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుండాలని కోరారు.

ఈ సందర్భంగా నేచర్ల వారు ఫౌండేషన్ నిర్వాహకులునేచర్ లవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శేఖర్ వంకాయల ట్రస్టీ బొద్దుల శ్రవణ్ కుమార్ కార్యదర్శి రామ్ కిషన్ ప్రచార కార్యదర్శి మీనాక్షి వంకాయల జ్యోతి లతోపాటు ప్రముఖ సామాజికవేత్త కోటా శ్యాం కుమార్ తదితరులు  మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా సులువు, కానీ వాటిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ వాటికి సరియైన సమయంలో నీటిని అందిస్తూ  మొక్కలను కొన్ని రోజుల వరకు కాపాడినప్పుడే అది చెట్టు గా ఎదుగుతుంది అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని, కాబట్టి మేము చేసే ఈ ప్రయత్నంలో మీ వంతుగా ఎవరైనా దాతలు ఉంటే నేరుగా మమ్ములను సంప్రదించి లేదా మా ఫోన్ నెంబర్ 8331053474 ద్వారా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా కానీ మాకు చేయూతనివ్వాలని కోరారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు సికింద్రాబాద్,  డిసెంబర్ 08 (ప్రజామంటలు): :    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ...
Read More...

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన
Read More...

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ *కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు....
Read More...

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ ** జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు)   భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ...
Read More...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు) సర్పంచ్  ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్  గ్రామంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా  సి.ఐ సుధాకర్  మాట్లాడుతూ....
Read More...

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం  జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి...
Read More...
National  Filmi News 

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్ కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం...
Read More...
National  State News 

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3...
Read More...
Local News 

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి...
Read More...
State News 

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,” తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్ కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు): మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన...
Read More...
State News 

“ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

“ఏం సాధించారని సంబరాలు “స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు): ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల...
Read More...
Local News 

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్ మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన...
Read More...