మైనర్ బాలుని అక్రమ నిర్బంధంపై వ్యక్తిగతంగా హాజరుకావాలని హక్కుల కమీషన్ నోటీస్
హైదరాబాద్ ఆగస్ట్ 07:
జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో, మైనర్ బాలుని అక్రమ నిర్బంధన మరియు థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో హైదరాబాద్ నగర కమీషనర్ వారికి వ్యక్తిగత హాజరు కై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశం జారీచేసింది.
ఫిర్యాదుదారుడు దగ్గుపాటి రాంబాబు (HRC నం. 2901/2025) తన 17 ఏళ్ల కుమారుడు దగ్గుపాటి అజ్తి కుమార్ శర్మను 15.12.2024 నుండి 17.12.2024 వరకు జూబ్లీ హిల్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించి, దారుణంగా హింసించారని చేసిన ఆరోపణలను కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన తెలంగాణ మానవ హక్కుల కమిషన్,తీవ్రంగా పరిగణించింది.
పోలీసుల హింస కారణంగా బాధితుడు నడవలేని పరిస్థికి గురైనట్లు నివేదించబడిన బాధితుడి ఆరోగ్య పరిస్థితిని గమనించిన కమిషన్, సంబంధిత అధికారి ఇప్పటివరకు కమీషన్ కు ఎటువంటి నివేదికను సమర్పించలేదు. కాబట్టి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వారిని ఈనెల 12న రికార్డులతో తమముండు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.
హైదరాబాద్లోని NIMS మెడికల్ సూపరింటెండెంట్ను బాధితుడిని వెంటనే పరిశీలించి అవసరమైన చికిత్స అందించాలని, 48 గంటల్లోపు వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
