పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు
పట్టించుకోని పంచాయతీ అధికారి.- కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య
గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలోని గత పది ఏండ్లుగా మురుగు కాలువలోని నీరు ఎటు వెళ్లక అక్కడే నిలువ ఉండడంతో జనాలు నానా అవస్థలు పడుతూ నిత్యం దోమలతో కుస్తీ పడుతూ అనారోగ్యాలకు గురి అవుతున్న పద్మశాలి కాలనీలో వాసులు ముఖ్యంగా ఇళ్ల నుంచి వాడుక నీరు బయటకు వెళ్లే మార్గం లేక, గతంలో కరెంటు మోటర్ ద్వారా పంపింగ్ చేసేది అది కాస్త చెడిపోవడంతో ప్రధాన రోడ్లపై చేరి,నిలిచి ఉంటు వర్షం నీరు కూడా కాలువల ద్వారా వెళ్లడం లేదు ,ఫలితంగా రోడ్లపై నీరు నిలిచి ఉండటం, దుర్వాసన దోమలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య ఆరోపించారు.
ముఖ్యంగా ఇళ్ల నుంచి వచ్చే నీరు డ్రైనేజీలో నిలిచి రోడ్లపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ దుర్వాసన వస్తుంది,అని ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ముందస్తు వర్షాలతో కాలనీ లో నీరు నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగి,మలేరియా ఇతర దోమ ద్వారా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.నీరు నిలిచిపోవడం వల్ల రోడ్లు దెబ్బతింటాయి,కాలనీలో మురికి కాలువ లేకపోవటం వల్ల పదవ వార్డు కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మా సమస్యను వెంటనే పరిష్కరించాలి గ్రామ ప్రజలు కోరుతున్నారు.ఈ విషయంపై పంచాయతీ అధికారిని వివరణ కోరగా నిధులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనిపై అధికారులు మరియు ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
