గత ప్రభుత్వ పెద్దలు ధర్మపురి పట్టణంలో తాగునీటిని సరఫరా చేయడంలో విఫలం - మంత్రి అడ్లూరి
ధర్మపురి జూలై 19 ( ప్రజా మంటలు):
ప్రభుత్వ పెద్దలు తలాపున గోదావరి ఉన్న పట్టణంలో తాగునీటిని సరఫరా చేయడంలో విఫలమయ్యారని,రాబోయే రోజుల్లో పట్టణంలో శాశ్వత మంచినీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ధర్మపురి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజిటెబుల్ మార్కెట్ను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి శనివారం రోజున రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజలకు,రైతులకు అందుబాటులోకి రాకపోవడం బాధాకరమనీ,మార్కెట్లో షెడ్ లలో నిర్మించిన గద్దెలు ఎత్తుగా వుండడంతో అమ్మకాలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు,కూరగాయల వ్యాపారులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.
సమస్యను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,మున్సిపల్ శాఖ అధికారులు,స్థానిక రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులుకు సూచించడం జరిగిందని ఆయన ఆన్నారు.
అమృత్ పథకంలో భాగంగా మార్కెట్ అవరణతో పాటు,మాతశిశు హాస్పిటల్ ఆవరణలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల కూడా వేగంగా కొనసాగుతున్నాయని,పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని,బోల్ చెరువుతోపాటు,అమృత్ పథకంలో భాగంగా వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు చేయడంతోపాటు, అక్కపెళ్లి రిజర్వాయర్ను పూర్తిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
