స్టీల్ కంపెనీలో రూ 46 లక్షల చోరి   - ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

On
స్టీల్ కంపెనీలో రూ 46 లక్షల చోరి   - ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

సికింద్రాబాద్, జూన్ 22 (ప్రజామంటలు):

ఓ కంపనీలో జరిగిన రూ.46లక్షల నగదు చోరీ కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారు. సదరు  సంస్థ మాజీ ఉద్యోగి తాను పనిచేసిన పాత సంస్థకే టోకరా వేసి ఏకంగా లాకరు నుంచి రూ.46లక్షలు  దొంగిలించి డబ్బులతో పరారీ అవుతుండగా  పోలీసుల అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.46.4లక్షల నగదును  స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు  ఆదివారం నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్ లోని  డీసీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని  పాటిగడ్డ  ప్రాంతంలో గిరీష్ జైన్ సన్ స్టీల్  పేరుతో స్టీల్  కంపనీ నిర్వహిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి  కంపనీలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి లాకర్ లో ఉన్న రూ.48లక్షలు దొంగిలించి పారిపోయాడు.ఈ విషయాన్ని మరుసటి రోజు గుర్తించిన కంపనీ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ జైన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు   సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఆ కంపనీ మాజీ ఉద్యోగి గిరిధారి సింగ్(28)గా  గుర్తించారు.  మధ్య ప్రదేశ్ పురేలీ ప్రాంతానికి చెందిన గిరిధారి సింగ్(28) ఈ కంపనీలో మూడేళ్ల పాటు పనిచేశాడు. అయితే అతను పనిచేసిన సమయంలో  డబ్బులు లాకర్ లో భద్రపరిచే పనులు సైతం చేసేవాడు. కాగా అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కంపనీ యజమాని గిరీష్ జైన్ ఆరు నెలల క్రితం అతనిని పనిలో నుంచి తీసేశాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న    గిరిధారి సింగ్ ఈనెల 20 అర్దరాత్రి పాటిగడ్డలోని స్టీల్ కంపనీకి వచ్చాడు. కంపనీ గోడ చాలా చిన్నదిగా ఉండటంతో గోడ ఎక్కి లోపలికి ప్రవేశించాడు. గోద్రెజ్ లాకర్ ని బ్రేక్ చేసి అందులో ఉన్న రూ.46 లక్షలు  చోరీ చేశాడు .  అ డబ్బులతో అదే రోజు రాత్రి సికింద్రాబాద్ కు చేరుకున్న గిరిధారిసింగ్  ఆదిలాబాద్ మీదుగా మధ్య ప్రదేశ్ పురేలీ వెళ్లేందుకు బస్సులో బయలు దేరాడు.  చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 30 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు బస్సులో మధ్య ప్రదేశ్ వెళుతున్నట్లు ఆర్టీసీ బస్పును జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు.

 నిందితున్ని  ఆదిలాబాద్ పోలీసుల సహాకారంతో మహారాష్ర్ద బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు  తరలించినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి, బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల జూన్ 30    (   ప్రజా మంటలు) అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని  జిల్లా   ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల...
Read More...
Local News 

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం లోషెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జగిత్యాల జిల్లా ఆద్వర్యం లో అదనపు కలెక్టర్ బీఎస్ లత  అధ్యక్షతనఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు  పై పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జూన్ 30(ప్రజా మంటలు) పట్టణములోని శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. .అనంతరం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.,ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ...
Read More...
Local News 

రిటైర్మెంట్ వృత్తికి కానీ వ్యక్తిత్వానికి కాదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

రిటైర్మెంట్ వృత్తికి కానీ వ్యక్తిత్వానికి కాదు    జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల జూన్ 30( ప్రజా మంటలు)    రిటైర్మెంట్ వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. పదవి విరమణ పొందిన అధికారుల గూర్చి మాట్లాడుతూ విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ ఏఎస్ ఐ  ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన  ఎస్పీ      జిల్లా పోలీసు...
Read More...
Local News  State News 

జర్నలిజం ముసుగులో కేటీఆర్ పై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారు - జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

జర్నలిజం ముసుగులో కేటీఆర్ పై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారు - జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల 29 జూన్ (ప్రజా మంటలు) :  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై దురుద్దేశపూర్వకంగా మహా టీవీలో అసత్య వార్తలు, ప్రసారాలను ఖండించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. ఈ...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ధ్యేయం-మంత్రి అడ్లూరి గొల్లపల్లి జూన్ 29 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో  కళ్యాణ లక్ష్మి షాది ముబారక్  సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా...
Read More...
Local News 

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ జూన్ 29 (ప్రజా మంటలు): నిజామాబాదు లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం నిమిత్తము కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చారు.  బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పోర్టులో విమానం దిగిన అమిత్ షా కు అభివాదం చేసిన మాజీ మంత్రి, NDMA వైస్ ప్రెసిడెంట్ మర్రి శశిధర్...
Read More...
Local News 

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): సికింద్రాబాద్ చిలకలగూడ లోని కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సర్వసభ్య సమావేశం ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఆషాడ బోనాల ఉత్సవాల నేపద్యంలో భక్తుల సౌకర్యార్థమై చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై హక్కుదారులు చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఏడాది ఆలయ హక్కుదారులు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది....
Read More...
Local News 

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) : ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సహకారోద్యమానికి ప్రాణం పోసిన కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39వ వర్ధంతిని ఆదివారం ఉదయం సంఘ ఆవరణలో శ్రద్ధాంజలుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంఘ ప్రస్తుత అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి...
Read More...
Local News 

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు) పట్టణం విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్న, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ...
Read More...
Local News 

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :    ముల్కనూర్ లోని విశ్వశాంతి విద్యాలయం 2010-11 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మళ్లీ ఒకచోట చేరి గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపి, మిత్రుల మధ్య మధురానుభూతులు పంచుకున్నారు. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః...” శ్లోకంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, జీవితానికి మార్గదర్శకులైన...
Read More...
Local News 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి  సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): జూలై 13, 14న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని, అందుకు ప్రభుత్వ అధికారులు,పార్టీలకతీతంగా నాయకులు,భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి కోరింది.ఈ మేరకు వారు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన...
Read More...