స్టీల్ కంపెనీలో రూ 46 లక్షల చోరి - ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
సికింద్రాబాద్, జూన్ 22 (ప్రజామంటలు):
ఓ కంపనీలో జరిగిన రూ.46లక్షల నగదు చోరీ కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారు. సదరు సంస్థ మాజీ ఉద్యోగి తాను పనిచేసిన పాత సంస్థకే టోకరా వేసి ఏకంగా లాకరు నుంచి రూ.46లక్షలు దొంగిలించి డబ్బులతో పరారీ అవుతుండగా పోలీసుల అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.46.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డ ప్రాంతంలో గిరీష్ జైన్ సన్ స్టీల్ పేరుతో స్టీల్ కంపనీ నిర్వహిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి కంపనీలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి లాకర్ లో ఉన్న రూ.48లక్షలు దొంగిలించి పారిపోయాడు.ఈ విషయాన్ని మరుసటి రోజు గుర్తించిన కంపనీ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ జైన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఆ కంపనీ మాజీ ఉద్యోగి గిరిధారి సింగ్(28)గా గుర్తించారు. మధ్య ప్రదేశ్ పురేలీ ప్రాంతానికి చెందిన గిరిధారి సింగ్(28) ఈ కంపనీలో మూడేళ్ల పాటు పనిచేశాడు. అయితే అతను పనిచేసిన సమయంలో డబ్బులు లాకర్ లో భద్రపరిచే పనులు సైతం చేసేవాడు. కాగా అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కంపనీ యజమాని గిరీష్ జైన్ ఆరు నెలల క్రితం అతనిని పనిలో నుంచి తీసేశాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న గిరిధారి సింగ్ ఈనెల 20 అర్దరాత్రి పాటిగడ్డలోని స్టీల్ కంపనీకి వచ్చాడు. కంపనీ గోడ చాలా చిన్నదిగా ఉండటంతో గోడ ఎక్కి లోపలికి ప్రవేశించాడు. గోద్రెజ్ లాకర్ ని బ్రేక్ చేసి అందులో ఉన్న రూ.46 లక్షలు చోరీ చేశాడు . అ డబ్బులతో అదే రోజు రాత్రి సికింద్రాబాద్ కు చేరుకున్న గిరిధారిసింగ్ ఆదిలాబాద్ మీదుగా మధ్య ప్రదేశ్ పురేలీ వెళ్లేందుకు బస్సులో బయలు దేరాడు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 30 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు బస్సులో మధ్య ప్రదేశ్ వెళుతున్నట్లు ఆర్టీసీ బస్పును జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు.
నిందితున్ని ఆదిలాబాద్ పోలీసుల సహాకారంతో మహారాష్ర్ద బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి, బేగంపేట ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

రిటైర్మెంట్ వృత్తికి కానీ వ్యక్తిత్వానికి కాదు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జర్నలిజం ముసుగులో కేటీఆర్ పై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారు - జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి
