వివిధగ్రామాల వృద్ధుల ఫిర్యాదులపై విచారణలు.
జగిత్యాల జూలై 19 ప్రజా మంటలు):
వయో వృద్ధులను నిరాదరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఆర్డీవో అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏ.ఓ.రవికాంత్ విచారణలు నిర్వహించారు.
గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన సింగం లక్ష్మీ,అదే మండలంకు చెందిన నందిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల రామవ్వ,జగిత్యాల పట్టణములోని వంజరివాడకు చెందిన తుదుగేని శారద, మంచినీళ్ల బావి వాడ కు చెందిన రాయిల్ల మల్లయ్యల తదితర ,వివిధ మండలాల గ్రామాల ఫిర్యాదు దారుల కుమారులను,కూతుర్లను,కోడళ్లను,అల్లుళ్ళను,మనుమలను, మనుమ రాళ్లను విచారించారు.విచారణలకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులకు,కోడళ్లకు,కూతుర్లకు,అల్లుళ్ళకు 2007 సంరక్షణ చట్టం,నియమావళి 2011, సెక్షన్ 24 పై సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ చేశారు.
ఆ తల్లిదండ్రుల పక్షాన సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ వాదనలు వినిపిస్తూ వారికి వృద్ధుల సంరక్షణ చట్టం కింద న్యాయం చేయాలని కోరారు. జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండిగే లక్ష్మీ అనే వృద్ధ తల్లిని,తండ్రి బాలమల్లు ను పోషించకుండా కొడుతూ,చంపుతనని బెదిరింపులకి గురిచేస్తున్న వారి పెద్ద కొడుకు పై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 24 ప్రకారము ఎఫ్.ఐ.ఆర్.నెంబర్.340/2024 తేదీ.29-7-2024 ద్వారా క్రిమినల్ కేసు నమోదు అయిందని,అలాగే జగిత్యాల ,కోరుట్ల,మెట్ పల్లి డివిజన్లలో కుమారులకు6 మాసాల జైలు శిక్షతో పాటు జరిమాన ఆర్డీవో లు విధించిన విషయాన్ని వివరిస్తూ హరి ఆశోక్ కుమార్ వివరించారు.
కొడుకులకు,కోడళ్లకు,కూతుర్లకు,మనుమలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపర చర్యలు ఉంటాయని ఏ.ఓ.రవికాంత్ హెచ్చరించారు.ఈ విచారణలో వృద్ధుల సంరక్షణ విభాగం సహాయకురాలు పద్మజ,తదితరులున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
