తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

On
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

హైదరాబాద్ జూలై 16: 

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గారితో ముగిసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలనీ కెటిఆర్ సూచించారు.

 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇన్‌ఛార్జీగా ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారు.images (30)

కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

 సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం.

 పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలన్న కేటీఆర్ సూచన.

 పది సంవత్సరాల కాలంలో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు 

 కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను తీవ్రంగా వ్యతిరేకించింది మన పార్టీ. 

 కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయం. 

సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని నిర్ణయం. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుంది. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది 

 కార్మికుల కోసం పార్టీ లీగల్ సెల్ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుంది. ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా.. చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అందిస్తుంది  త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరపాలని నిర్ణయించారు.

Tags

More News...

Local News 

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి     జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్              జగిత్యాల సెప్టెంబర్ 1 (ప్రజా మంటలు)            ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో...
Read More...
Local News  State News 

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494).  రాష్ట్రంలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణానికి ప్రత్యేకత ఉంది. గంభీర గౌతమీ  (గోదావరి) నది తీరంలో వెలసిన తీర్థంగా, పలు దేవాలయాల సమాహారంతో క్షేత్రంగా, తన ఆస్థాన కవిగా, ఆస్థానానికి  వన్నె తెచ్చిన కన్నడ  ఆదికవిగా భావింప బడే, విక్రమార్జున చరిత్ర కావ్య కర్త  పంప ఆర్ష...
Read More...
Local News 

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే  ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్  అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే  ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్  అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు..  జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ..మెట్పల్లి సెప్టెంబర్ 1 (ప్రజా మంటలు)ఎన్పీడీసీఎల్ డి ఈ మనోహర్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరు.. మనోహర్ ను ఘనంగా సన్మానించిన అధికారులు.. ఉద్యోగ బాధ్యతలను నిబద్దతతో క్రమశిక్షణతో నిర్వర్తిస్తే అటు ప్రజలు అటు అధికారుల్లో మంచి గుర్తింపు వస్తుందని దురిశెట్టి మనోహర్ విద్యుత్ శాఖ ఏ డీఈ గా పనిచేసి...
Read More...

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి శ్రద్ధ భీమదేవరపల్లి, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : మండలంలోని ముత్తారం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వేషధారణలో...
Read More...
Local News 

  మా కామాఖ్య హాస్పిటల్ వారిచే   ప్రెస్ క్లబ్ గణపతి వద్ద  అన్నప్రసాద వితరణ

   మా కామాఖ్య హాస్పిటల్ వారిచే   ప్రెస్ క్లబ్ గణపతి వద్ద  అన్నప్రసాద వితరణ    జగిత్యాల సెప్టెంబర్ 1 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ లో వినాయక నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిష్టించిన గణపతి వద్ద  సోమవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణంలోని మా కామాఖ్య హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్...
Read More...
Local News 

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భీమదేవరపల్లి, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :    మండలంలోని ముత్తారం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని గణపతిని ఆరాధించారు. సాయంత్రం భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామస్తులు,...
Read More...
Local News 

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి సికింద్రాబాద్, సెప్టెంబర్01 ( ప్రజామంటలు) : నో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్‌ (NCPS) రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ (OPS) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీజీఈ జేఏసీ యూనియన్‌ కోఆర్డినేటర్‌ జి.వి.కృష్ణారావు హాజరయ్యారు.ఆర్‌టీసీ కళ్యాణం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ఎయిడెడ్‌...
Read More...
Local News 

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో వినాయకుడిని నెలకొల్పగా నిమజ్జన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పూజల అనంతరం వినాయకుడిని ట్రాక్టర్లో డప్పు నృత్యాలతో ఉరేగింపుగా తీసుకువెళ్లి గ్రామంలోని సమీప చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం...
Read More...
National  State News  Current Affairs  

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు వరదలు వస్తే ఆదుకోలేని  స్థితిలో ప్రభుత్వం ఉంది. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): ప్రజలకు న్యాయం చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోందని,కేసీఆర్ పై సీబీఐ...
Read More...
Local News 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ - సేవ భూషణ్ జాతీయస్థాయి పురస్కారం-2025  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి 

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి  సమస్యలను తీర్చాలని ప్రభుత్వానికి వినతి- గాంధీ ఆసుపత్రిలో పీవైఎల్ ప్రతినిధుల పర్యటన   సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీ ఆసుపత్రి మూడు వేల పడకలతో, అన్ని సౌకర్యాలతో ఆప్ గ్రేట్ చేయాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీ.వై.ఎల్) నాయకులు డిమాండ్ చేశారు. వేల పడకల పరిమితిని...
Read More...
Local News 

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ 69వ గేమ్స్ ప్రారంభం  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం  విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి...
Read More...