బన్సీలాల్పేట లో కార్డన్ సెర్చ్
సికింద్రాబాద్,జూన్ 20 (ప్రజా మంటలు):
గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలో పోలీసులు శుక్రవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బన్సీలాల్ పేట్, సిసి నగర్ లోని పలు బస్తీల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 80 ద్విచక్రవాహనాలు, ఒక 4 వీలర్స్ సీజ్ చేశారు. అలాగే బెల్ట్ షాపు నుంచి తెచ్చి భద్రపరిచిన 32 బీర్బాటిళ్లు, 150 నిషేధిత పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా 8మంది అనుమానితులను , ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. ఇక నుంచి ఎప్పటికప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసి అవేర్ నెస్ కల్పిస్తామన్నారు. అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ కార్డన్ సర్చ్ లో గాంధీనగర్ డివిజన్ ఏసీపీ యాదగిరి,ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, డీఐ ఆర్. వెంకటేశ్వర్లు తో పాటు 250 మంది పోలీసులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
